AmirKhan: ప్రముఖ బాలీవుడ్ హీరో అమిర్ఖాన్ కేజీఫ్2 టీమ్కు క్షమాపనలు చెప్పారట. అంతే కాదు, హీరో యశ్కు తానే స్వయంగా క్షమాపన లేఖ రాస్తూ.. కేజీఎఫ్2సినిమాకు తాను ప్రచారం చేస్తానని చెప్పారట.. అసలు అమిర్ఖాన్ ఏంటి.. కేజీఎఫ్ టీమ్కు సారీ చెప్పడం ఏంటీ?.. అనుకుంటున్నారా?.. ఈ విషయం తెలియాలంటే.. వివారాల్లోకి వెళ్లాల్సిందే.
ప్రస్తుతం అమిర్ఖాన్ హీరోగా అద్వైత్ చందన్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమా లాల్సింగ్ చద్దా.. ఈ సినిమాలో కరీనా కపూర్, నాగచైతన్య కీలక పాత్రలు పోషిస్తున్నారు. కాగా.. కరోనా కారణంగా అనేక సార్లు వాయిదా పడుతూ వచ్చిన ఈ సినిమాను.. వచ్చే ఏడాది ఏప్రిల్14న విడుదల చేయనున్నట్లు ఇటీవలే ప్రకటించారు. అయితే అదే రోజు కేజీఎఫ్2 కూడా విడుదలకు సిద్ధంగా ఉంది. లాల్సింగ్ చద్దా కంటే ముందే కేజీఎఫ్ టీమ్ సినిమా రిలీజ్ డేట్ను ప్రకటించింది. ఈక్రమంలోనే ఒకే రోజు రెండు పెద్ద సినిమాలు స్క్రీన్పై తలపడితే.. వసూళ్లు షేర్ చేసుకోవాల్సి వస్తుంది. ఈ నేపథ్యంలోనే అమిర్ఖాన్ కేజీఎఫ్2 టీమ్కు క్షమాపణలు చెప్పారట.
తాజాగా, ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన అమిర్కాన్.. తానే స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించారు.. తప్పని పరిస్థితుల్లోనే లాల్సింగ్ చద్దాను ఏప్రిల్లో విడుదల చేస్తున్నామని.. కావాలని అసలు చేయలేదని అన్నారు. కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్, హీరో యశ్తో పాటు నిర్మాతకు క్షమాపణలు కోరుతూ లేఖ రాసినట్లు తెలిపారు. యశ్తో కూడా ఫోన్లో మాట్లాడినట్లు వివపించారు. కేజీఎఫ్2ను తానే స్వయంగా ప్రచారం చేస్తానని అన్నారు.. ఈ సినిమా కోసం ఎదురుచూస్తున్న లక్షలాంది మంది ప్రేక్షకుల్లో నేను ఒకడినని ఈ సందర్భంగా అన్నారు అమిర్ఖాన్. మరి ఈ రెండు సినిమాల్లో దేనికి ప్రేక్షకులు ఓటేస్తారో చూడాలి.