Homeఎంటర్టైన్మెంట్Prabhas : ప్రభాస్ ని చూసి వెక్కిళ్లు పెట్టి ఏడ్చేసిన అల్లు స్నేహ రెడ్డి..అసలు ఏమి...

Prabhas : ప్రభాస్ ని చూసి వెక్కిళ్లు పెట్టి ఏడ్చేసిన అల్లు స్నేహ రెడ్డి..అసలు ఏమి జరిగిందంటే!

Prabhas :  టాలీవుడ్ లో విపరీతమైన మాస్ ఇమేజ్ ఉన్న హీరోలు సాఫ్ట్ సినిమాలు చేయడానికి తడబడుతూ ఉంటారు. ఎందుకంటే అప్పటి వరకు భారీ యాక్షన్ సన్నివేశాల్లో నటించిన హీరోలను, ఒక్కసారిగా లవ్ స్టోరీస్, ఫ్యామిలీ డ్రామా మూవీస్ లో చూడడం కష్టమే. అలా కొంతమంది హీరోలు ప్రయత్నం చేసి, సినిమాలు బాగున్నప్పటికీ కూడా ఫ్లాప్స్ ని అందుకున్నారు. నేటి తరం స్టార్ హీరోలలో విపరీతమైన మాస్ ఇమేజ్ ఉన్న హీరోలలో ఒకడు రెబల్ స్టార్ ప్రభాస్. ఆయన కెరీర్ లో బ్లాక్ బస్టర్ హిట్స్ గా నిల్చిన సినిమాలలో అత్యధిక శాతం మాస్ కమర్షియల్ సినిమాలే. ‘ఛత్రపతి’ సినిమా తర్వాత అయితే ఆయన మాస్ ఇమేజ్ ఎవ్వరూ ఊహించని రేంజ్ కి వెళ్ళింది. ఆ ఛత్రం నుండి బయటపడడానికి ప్రభాస్ కి చాలా సమయమే పట్టింది. ఇక ఆ మాస్ పాత్రలు కూడా ఆడియన్స్ కి రొటీన్ అనిపించిన సమయంలో ఆయన ‘డార్లింగ్’, ‘మిస్టర్ పర్ఫెక్ట్’ సినిమాలు చేసాడు.

ఈ రెండు చిత్రాలు కూడా కమర్షియల్ గా పెద్ద హిట్స్ అయ్యాయి. ప్రభాస్ కి యూత్ ఆడియన్స్ లో ఒక రేంజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ని పెంచిన సినిమాలుగా ఈ రెండు నిలిచాయి. అయితే మిస్టర్ పర్ఫెక్ట్ సినిమా విడుదలకు ముందు ప్రభాస్ చాలా టెన్షన్ పడ్డాడట. ఈ సినిమా విడుదలకు ముందు ప్రభాస్ బుర్రలో ఎన్ని ఆలోచనలు ఉన్నాయో, ఆయన ఎంత భయపడ్డాడో ప్రభాస్ బెస్ట్ ఫ్రెండ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవల బాలయ్య ‘అన్ స్టాపబుల్ 4’ టాక్ షోలో చెప్పుకొచ్చాడు. మిస్టర్ పర్ఫెక్ట్ లాంటి సినిమాలు ఫ్యాన్స్ నచ్చకపోయినా పర్వాలేదు, కానీ లేడీస్, ఫ్యామిలీ ఆడియన్స్ నచ్చాలి. ఎందుకంటే వాళ్ళని దృష్టిలో పెట్టుకొని తీసిన సినిమా ఇది. నన్ను ఇలాంటి భారీ యాక్షన్ సినిమాల్లో చూసిన వాళ్ళు, అకస్మాత్తుగా ఇలాంటి సాఫ్ట్ రోల్స్ లో చూసి నచ్చగలరా అనే సందేహం ఆయనలో ఉండేదట.

కలిసినప్పుడల్లా ప్రభాస్ ఈ విషయం గురించి చెప్తూ టెన్షన్ పడేవాడట. ఒకరోజు దిల్ రాజు మిస్టర్ పర్ఫెక్ట్ ప్రివ్యూ షోని ఇండస్ట్రీ లో ఉన్న ముఖ్యమైన వాళ్లకు వేసి చూపించాడట. అల్లు అర్జున్ తన సతీమణి స్నేహ రెడ్డి తో కలిసి ఆ ప్రివ్యూ షోకి వెళ్ళాడట. ప్రభాస్ మాత్రం టెన్షన్ తో ఈ ప్రివ్యూ షో కి రాలేదట. అయితే అల్లు అర్జున్ సినిమా చూసిన వెంటనే ప్రభాస్ కి ఫోన్ చేసి ‘డార్లింగ్..సినిమా అదిరిపోయింది..ఫస్ట్ హాఫ్ అద్భుతం..సెకండ్ హాఫ్ ఇంకా అద్భుతం’ అని చెప్పాడట. అప్పుడు ప్రభాస్ ‘నీకు నాకు నచ్చితే సరిపోదు..లేడీస్ కి నచ్చాలి..స్నేహా కి నచ్చిందా?’ అని అడిగాడట. దానికి అల్లు అర్జున్ ‘ఆమెకు ఒక రేంజ్ లో నచ్చింది. ముఖ్యంగా సెకండ్ హాఫ్ ని చూసి ఒక్కటే ఏడుపు’ అని చెప్పాడట. అప్పుడు ప్రభాస్ మన టార్గెట్ రీచ్ అయ్యింది, సినిమా హిట్ అయిపోతుంది అని అన్నాడట.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.
Exit mobile version