మీ టూ ఉద్యమం ప్రారంభమైన తర్వాత మహిళలంతా వారిపై జరిగిన లైంగిక వేధింపులను బయటపెడుతున్నారు. ఈక్రమంలోనే బాలీవుడ్లోని పలువురు హీరోయిన్లు సైతం తమపై జరిగిన లైంగిక దాడులు జరుగాయంటూ సోషల్ మీడియాలో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా దర్శకుడు అనురాగ్ కశ్యప్ పై హీరోయిన్ పాయల్ ఘోష్ లైంగిక వేధింపుల ఆరోపణలు చేసింది. దీంతో ఈ విషయం బాలీవుడ్లో హాట్ టాపిక్ గా మారింది.
Also Read: సుశాంత్ ఆత్మహత్య.. బయటపడుతున్న డర్టీ సిక్రెట్స్.!
పాయల్ ఘోష్ హిందీతోపాటు తెలుగులో ‘ప్రయాణం’.. ‘ఉసరవెల్లి’ సినిమాల్లో నటించింది. అయితే ఇటీవల ఆమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ దర్శకుడు అనురాగ్ పై లైంగిక ఆరోపణలు చేసింది. తన సినిమాలో నటించాలంటే తనకు పడకసుఖం అందించాలని వేధించినట్లు పేర్కొంది. ఇదంతా ఇండస్ట్రీలో కామన్ అనేలా మాట్లాడటంతో అతడికి ఏదో ఒకటి చెప్పి అక్కడి నుంచి తప్పించుకున్నట్లు పాయల్ ఘోష్ ఆరోపించడం సంచలనంగా మారింది.
పాయల్ ఘోష్ వ్యాఖ్యలు ఇండస్ట్రీలో దుమారం రేపడంతో కొందరు అనురాగ్ కు మద్దతుగా మరికొందరు పాయల్ కు మద్దతుగా నిలిచారు. కంగనా రనౌత్.. ఒకరిద్దరు మినహా మిగిలిన వారంతా అనురాగ్ కు మద్దతుగా నిలిచారు. ఇక అనురాగ్ పై లైంగిక వేధింపులు ఆరోపణలు వచ్చిన తొలినాళ్లలోనే తాప్సీ ఆయనకు మద్దతుగా నిలిచింది. కాగా ఇటీల సీనియర్ నటి కస్తూరి కూడా అనురాగ్ కు మద్దతుగా మాట్లాడటంతోపాటు తాను కూడా లైంగిక వేధింపులకు గురైనట్లు చెప్పడం గమనార్హం.
తాప్పీ మరోసారి అనురాగ్ కు మద్దతు నిలిచింది. పాయల్ పేరెత్తకుండా.. ఆమె చేసిన ఆరోపణల గురించి ప్రస్తావించకుండా కశ్యప్కు మద్దతు ఇవ్వడం ఆసక్తిని రేపుతోంది. అనురాగ్ లైంగిక ఆరోపణలు విని తాను మనోవేదనకు గురయ్యానట్లు చెప్పింది. ఆయన అలాంటి వ్యక్తి కాదని.. తనకు తెలిసిన వ్యక్తుల్లో కశ్యపే అతిపెద్ద ఫెమినిస్టు అంటూ కితాబిచ్చింది.
Also Read: ఓటీటీలో సినిమా ప్లాప్ అయితే డబ్బులు వెనక్కి?
కశ్యప్ లైంగిక వేధింపులు ఆరోపణలు నిజమైతే తనతో అన్ని సంబంధాలు తెంచుకుంటానంటూ తాప్సీ శపథం చేసింది. దశాబ్దాల అణచివేత తర్వాత మహిళలకు మీటూ ఉద్యమం వరంలా లభించిందని తాప్సీ తెలిపింది. తమ బాధను.. జరిగిన అన్యాయాలను చెప్పుకునే అవకాశం మహిళలకు లభించందని.. అయితే దీనిని తప్పుదారి పట్టిస్తే మాత్రం అసలుకే మోసం వస్తుందంటూ పాయల్కు పరోక్షంగా చురకలు అంటించింది.