Photo Story: వీరిద్దరు బావ బామ్మర్దులు.. ఇద్దరూ స్టార్ హీరోలే.. ఎవరో చెప్పండి చూద్దాం..

టాలీవుడ్ ఇండస్ట్రీలో కొన్ని కుటుంబాల పేర్లు పాపులర్ అయ్యాయి. వీటిలో అక్కినేని, దగ్గుబాటి కుటుంబం. అక్కినేని నాగేశ్వర్ రావు మొదటి తరం హీరోగా రాణించి ఫేమస్ అయ్యారు. ఆ తరువాత ఆయన కుమారుడు నాగార్జున స్టార్ అయ్యారు.

Written By: Srinivas, Updated On : May 9, 2023 10:17 am

Photo Story

Follow us on

Photo Story: రంగం ఏదైనా రాణించాలంటే కాస్త సపోర్టు ఉండాలి. ఈ సపోర్టు తండ్రి నుంచి వస్తే ఇంకా బాగుంటుంది. అందుకే చాలా మంది యూత్ తండ్రి చెప్పిన బాటలోనే నడిచేందుకు ఇష్టపడుతుంటారు. సినిమా రంగం ఆసక్తిగా ఉండడంతో కొందరు తండ్రులు వద్దనా ఏదోలా ఎంట్రీ ఇవ్వడానికి ఆసక్తి చూపుతుంటారు. అయితే వారు రాణిస్తారా? లేదా? అనేది తరువాత అంశం. అలా చాలా మంది ఇప్పుడు చిత్ర సీమలో తండ్రి వారసత్వంతో వచ్చిన వాళ్లు ఉన్నారు. వీరిలో కొందరు తండ్రుల వలె స్టార్లుగా మారాగా.. మరికొందరు మాత్రం స్టార్ డం కోసం కష్టపడుతున్నారు. ఈ తరుణంలో ఇద్దరు వారసుల ఫొటో ఒకటి వైరల్ గా మారుతోంది.

టాలీవుడ్ ఇండస్ట్రీలో కొన్ని కుటుంబాల పేర్లు పాపులర్ అయ్యాయి. వీటిలో అక్కినేని, దగ్గుబాటి కుటుంబం. అక్కినేని నాగేశ్వర్ రావు మొదటి తరం హీరోగా రాణించి ఫేమస్ అయ్యారు. ఆ తరువాత ఆయన కుమారుడు నాగార్జున స్టార్ అయ్యారు. ఇప్పుడు నాగార్జున కుమారులు చైతన్య, అఖిల్ లు స్టార్ డం కోసం కష్టపడుతున్నారు. అటు దగ్గుబాటి కుటుంబానికి కూడా ఇండస్ట్రీలో స్పెషల్ ఇమేజ్ ఉంది. ప్రముఖ నిర్మాత రామనాయుడు ఎన్నో సినిమాలు తీశారు. ఆ తరువాత ఆయన కుమారుడు సురేష్ నిర్మాతగా మారగా.. మరో కుమారుడు వెంకటేష్ హీరో అయిన విషయం తెలిసిందే.

సినిమా పరిశ్రమలో అక్కినేని, దగ్గుబాటి ప్రముఖులు కలిసి పనిచేసినందున వీరి మధ్య బంధుత్వం ఏర్పడింది. అక్కినేని నాగేశ్వర్ రావు కుమారుడు నాగార్జున, రామానాయుడు కూతురు లక్ష్మిలు పెళ్లి చేసుకున్నారు. వీరికి నాగచైతన్య అనే కుమారుడు జన్మించారు. ఆయన జోష్ సినిమాతో ఫిల్మ్ ఎంట్రీ ఇచ్చాడు. త్వరలో ఆయన నటించిన ‘కస్టడి’ రిలీజ్ కాబోతుంది. అటు వెంకటేశ్ ఇప్పటికీ హీరోగా కొనసాగుతున్నాడు. ఆయన సోదరుడు ప్రముఖ నిర్మాత సురేష్ కుమారుడు రానా కూడా ఇప్పుడు సినిమాల్లో కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఇటీవల బాబాయ్ వెంకటేశ్, రానా కలిసి రానా నాయుడు అనే వెబ్ సిరీస్ లో నటించారు.

అక్కినేని నాగచైతన్య, రానా లు బావ బామ్మర్దులు అవుతారు. వీరు చిన్న వయసులో ఉన్నప్పుడు అక్కినేని, దగ్గుబాటి కటుంబం కలిసి మెలిసి ఉండేది. ఫంక్షన్లకు, ఇతర కార్యక్రమాల్లో అంతా కలిసి సందడి చేసేవారు. ఈ సమయంలో రానా, నాగచైతన్యను కలిసి ఆడుకునేవారు. ఈ సమయంలో వారు ఓ ఫొటో దిగారు. అయితే అది చాలా రోజుల తరువాత ఇప్పుడు బయటపడింది. దీనిని సోషల్ మీడియాలో పెట్టడంతో అది వైరల్ గామారింది.అక్కినేని నాగార్జున, లక్ష్మీలు విడాకులు తీసుకున్న తరువత రెండు కుటుంబాలు కొన్ని రోజుల పాటు దూరమయ్యాయి. కానీ ఇప్పుడు నాగచైతన్య అటు మామయ్య, ఇటు తండ్రితో కలిసి సినిమాలు తీస్తున్నాడు.