Adivi Sesh: విభిన్నమైన కథాంశాలతో ప్రేక్షకులకు అద్భుతమైన థియేట్రికల్ అనుభూతి ని కలిగించాలని తపన పడే హీరోల్లో ఒకరు అడివి శేష్. క్యారెక్టర్ ఆర్టిస్టుగా, విలన్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ని ఏర్పాటు చేసుకున్న అడివి శేష్ , ఆ తర్వాత హీరో గా మారి వరుసగా బ్లాక్ బస్టర్ హిట్స్ ని అందుకుంటూ తనకంటూ ఒక ప్రత్యేకమైన స్టార్ ఇమేజ్ ని ఏర్పాటు చేసుకున్నారు. అడివి శేష్ సినిమా వస్తుందంటే చాలు , కళ్ళు మూసుకొని థియేటర్ కి వెళ్లిపోయే ఆడియన్స్ ఉన్నారు. అలాంటి ఆడియన్స్ కారణంగా ఆయన లేటెస్ట్ చిత్రం ‘డెకాయిట్’ కి డివైడ్ టాక్ వచ్చినప్పటికీ కూడా కమర్షియల్ గా పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. ఓవర్సీస్ లో కూడా మంచి వసూళ్లను రాబట్టి సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇక ఇప్పుడు ఆయన తన ఫోకస్ ని బాలీవుడ్ పై పెట్టారు.
త్వరలోనే ఆయన బాలీవుడ్ లోకి ఒక భారీ యాక్షన్ డ్రామా సినిమా చేయబోతున్నారు. రీసెంట్ గానే బ్లాక్ బస్టర్ ఇచ్చిన ఒక యంగ్ డైరెక్టర్ ఈ సినిమాకు పని చేస్తారట. ధర్మ ప్రొడక్షన్స్ పై కరణ్ జోహార్ ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నట్టు సమాచారం. అక్టోబర్ నెల నుండి ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లే అవకాశాలు ఉన్నాయట. ప్రస్తుతానికి అడివి శేష్ ‘గూఢచారి 2’ చిత్రం లో నటిస్తున్నారు. అయన కెరీర్ లో మైల్ స్టోన్ గా నిల్చిన ‘గూఢచారి’ చిత్రానికి ఇది రీమేక్. 100 కోట్లకు పైగా భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. వామికా గబ్బీ ఈ చిత్రం లో హీరోయిన్ గా నటిస్తోంది , ఇమ్రాన్ హష్మీ కీలక పాత్రలో నటిస్తున్నారు. వినయ్ కుమార్ సిరిగినీడి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.
శరవేగంగా షూటింగ్ కార్యక్రమాలను జరుపుకుంటున్న ఈ చిత్రం ఈ ఏడాది సెకండ్ హాఫ్ లోనే విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి. మొదటి భాగం అతి తక్కువ బడ్జెట్ తో తీసినప్పటికీ ప్రొడక్షన్ వాల్యూస్ వేరే లెవెల్ లో ఉండేలా చూసుకున్నావారు అడివి శేష్. ఆ చిత్రానికి కథ , స్క్రీన్ ప్లే అందించింది కూడా ఆయనే. ఈ చిత్రానికి కూడా ఆయన కథ , స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. మరి పార్ట్ 1 రేంజ్ లో ఈ సినిమా కూడా భారీ విజయం సాధిస్తుందో లేదో చూడాలి.
