Adbhutam: జాంబి రెడ్డి సినిమాతో యంగ్ హీరోగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుని.. తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిన హీరో తేజ సజ్జా. ప్రస్తుతం తేజ హీరోగా మల్లిక్ రామ్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమా అద్భుతం. ఈ సినిమాను చంద్రశేఖర్ మొగుళ్ల నిర్మిస్తున్నారు. ఈ సినిమాతో రాజశేఖర్, జీవిత కుమార్తె శివానీ హీరోయిన్గా తెలుగు తెరకు పరిచయం కానుంది. శివాని రాజశేఖర్ ఇప్పటికే పలు క్రేజీ సినిమాల్లో హీరోయిన్గా ఎంపికైన సంగతి తెలిసిందే. కాగా, ఆమె నటించబోతున్న సినిమాల్లో తొలి సినిమా అద్భతం కావడం విశేషం.

ప్రసాంత్ వర్మ కథ, మల్లిక్ రామ్ దర్శకత్వం ప్రతిభ, తేజ సజ్జ నటన, శివాని అందచందాలతో అద్భుతం సినిమా ప్రేక్షకులను కట్టిపడేస్తుందని నిర్మాత చంద్రశేఖర్ అంటున్నారు. మరోవైపు, మిర్చి కిరణ్, తులసి, శివాజీ రాజా తదితరులు ఈ సినిమాలో ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి రాథన్ సంగీతం అందిస్తుండంగా.. ఈ నెల 19న డిస్నీ ప్లస్ హాట్స్టార్లో విడుదలకు సిద్ధమైంది.
ఇటీవల కాలంలో దాదాపు చిన్న, పెద్ద సినిమాలన్నీ ఓటీటీలవైపే మొగ్గు చూపుతున్నాయి. పెద్ద హీరోలు కూడా థియేటర్లకంటే ఆన్లైన్ ప్లాట్ఫామ్లోనే సినిమాలను విడుదల చేసేందుకు మక్కువ చూపుతున్నారు. ఈ క్రమంలోనే అద్భుతం సినిమా కూడా ఓటీటీ వేదికైన హాట్స్టార్లో స్ట్రీమింగ్ చేసేందుకు దర్శక నిర్మాతలు సిద్ధమయ్యారు. కాగా, తేజ తన చిన్నతనంలో చిరంజీవి, ఎన్టీఆర్ వంటి స్టార్ హీరోలకు చిన్నప్పటి క్యారక్టర్లో నటించిన విషయం తెలిసిందే.