Homeఎంటర్టైన్మెంట్ఆ దేశం నుంచి గోల్డెన్​ వీసా పొందిన తొలి మహిళా నటిగా త్రిష రికార్డు!

ఆ దేశం నుంచి గోల్డెన్​ వీసా పొందిన తొలి మహిళా నటిగా త్రిష రికార్డు!

తన అందం, అభినయంతో ప్రేక్షకుల మనసు దోచుకుని దక్షిణాదిలోనే ఎక్కువ ఫాలోయింగ్​ ఉన్న హీరోయిన్​ త్రిష. సహాయనటిగా సినీరంగ ప్రవేశం చేసి.. ఆ తర్వాత వరుసగా హీరోయిన్​ అవకాశాలను అందుకుంది ఈ ముద్దుగుమ్మ. టాలీవుడ్​లోని టాప్​ హీరోలందరితో స్క్రీన్​ షేర్​ చేసుకుంది. మరోవైపు తమిళంలోనూ టాప్​ హీరోయిన్​గా నిలిచింది. నాలుగు పదుల వయసు వస్తున్నా త్రిషకు క్రేజ్​ మాత్రం తగ్గట్లేదు. అయితే, గత కొన్నిరోజులుగా తెలుగు చిత్ర పరిశ్రమకు దూరంగా ఉంటూ వస్తోంది ఈ అమ్మడు. తాజాగా, తన సెకండ్​ ఇన్నింగ్స్​ను స్టార్ట్​ చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవలే 96 మూవీలో సినిమాలోకి రీ ఎంట్రీ ఇచ్చిన త్రిష. తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది.

ఇదిలా ఉండగా, త్రిషకు అరుదైన గౌరవం లభించింది. యునైటెడ్​ అరబ్​ ఎమిరేట్స్​ ప్రభుత్వం జారీ చేసే గోల్డెన్​ వీసా ఆమెను వరించింది. ఈ వీసా అందుకున్న తొలి తమిళ నటిగా త్రిష రికార్డు క్రియేట్ చేసింది. ఈ విషయాన్ని తానే స్వయంగా ట్విట్టర్ ద్వారా ప్రకటించింది. యూఏఈ  నుంచి గోల్డెన్ వీసా అందుకున్న తొలి నటిని తానే కావడం ఆనందంగా ఉందన్నారు త్రిష. ఇప్పటికే ఈ వీసాను ఫర్హాన్ ఖాన్, షారూఖ్ ఖాన్, బోనీ కపూర్, అర్జున్ కపూర్, మోహన్ లాల్ మమ్ముట్టి, దుల్కర్ సల్మాన్, నేహా కక్కర్, అమాల్ మాలిక్, కేఎస్ వంటి ప్రముఖులు అందుకున్నారు. ఈ వీసా ఉన్నవారు సూదీర్ఘకాలం వరకు యూఏఈలో ఉండవచ్చు.

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.
RELATED ARTICLES

Most Popular