Actress Raai Laxmi: భారత క్రికెట్ జట్టులోని అత్యుత్తమ ప్లేయర్లలో మహేంద్ర సింగ్ ధోనీ ఒకరు. భారత జట్టుకు ఎంతగానో సేవలందించిన ధోనీ ప్రస్తుతం అన్ని ఫార్మాట్ల క్రికెట్ నుంచి రిటైరై కేవలం ఐపీఎల్లో మాత్రమే ఆడుతున్నాడు. తన చిన్ననాటి ఫ్రెండ్ సాక్షిని పెళ్లి చేసుకున్న ధోనీ కుమార్తె జీవాతో కలిసి ప్రస్తుతం ప్రశాంతంగా జీవిస్తున్నాడు. ఇటీవల జరిగిన ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీలో భారత జట్టుకు ధోనీ మెంటార్గా కూడా వ్యవహరించాడు. అయితే క్రికెట్ కి , సినిమాకు అవినాభావ సంబంధం ఉంది. ఇక క్రికెటర్లకు, సినిమా హీరోయిన్ల మధ్య ప్రేమ వ్యవహారాలు ఉండడం సాధారణంగా మారిపోయింది. ఇప్పటికే చాలామంది క్రికెటర్లు, తాము ప్రేమించిన హీరోయిన్లను పెళ్లి చేసుకొని సంతషంగా ఉండగా.. మరికొంతమంది బ్రేకప్ చేసుకొని మరొకరిని వివాహం చేసుకున్నారు. అలా బ్రేకప్ చేసుకున్న జంటల్లో మహేంద్ర సింగ్ ధోని- లక్ష్మీ రాయ్ జంట కూడా ఒకటి.
2008లో ఐపీఎల్ జట్టు చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్గా ధోనీ ఉండగా.. అదే జట్టు బ్రాండ్ అంబాసిడర్ గా రాయ్ లక్ష్మీ వ్యవహరించింది. ఆ సమయంలోనే వారిద్దరి మధ్య ప్రేమ చిగురించింది. ఆ తర్వాత చాలా రోజులు డేటింగ్ లో ఉన్న వీరిద్దరూ కొన్ని కారణాల వలన బ్రేకప్ చెప్పుకున్నారు. ఇక మీడియా ముందు ఎప్పుడు ధోనితో బ్రేకప్ గురించి చెప్పని రాయ్ లక్ష్మి ఇటీవల తన బ్రేకప్ స్టోరీని రివీల్ చేసింది. ” ధోనితో బ్రేకప్ అయ్యాకా నేను చాలా కోల్పోయాను.. ఇప్పటికి ఆ ప్రేమ నా జీవితంలో ఒక మచ్చగా మిగిలిపోయింది. ఎవరైనా, ఎప్పుడైనా ధోని విషయం మాట్లాడితే.. అప్పుడు నా టాపిక్ కూడా వస్తుంది. రేపు నాకు పెళ్లి అయ్యి, పిల్లలు పుట్టినా ధోనితో నా అఫైర్ గురించి మాట్లాడుతూనే ఉంటారు” అంటూ చెప్పుకొచ్చింది. అంతేకాకుండా ” బ్రేకప్ అయ్యాకా కూడా ధోని, నేను మంచి స్నేహితులుగానే ఉన్నాం.. అతనంటే నాకు ఇప్పటికీ గౌరవం ఉంది అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం రాయ్ లక్ష్మీ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.