Actress Nayanathara: సినీ పరిశ్రమలో మంచి సక్సెస్ అందుకున్న తరువాత బిజినెస్ రంగంలో దూసుకుపోతూ ఉంటారు హీరోలు హీరోయిన్స్. ఇది ఇండియా లోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా ఇదే జరుగుతుంది. కత్రినా కైఫ్, దీపికా, అలియా భట్, రకుల్ ప్రీత్ సింగ్, సమంత, నయన, తాప్సీ వంటి తారలు బిజినెస్ రంగంలో రాణిస్తున్నా విషయం తెలిసిందే. అయితే తాజాగా మరో కొత్త వ్యాపారంలోకి అడుగుపెట్టింది లేడీ సూపర్ స్టార్ నయన్. ది లిప్బామ్ కంపెనీ పేరుతో నయనతార… చర్మవ్యాధి నిపుణురాలు అయిన రేణిత రాజన్ కలిసి తాజాగా ఓ బ్యూటీ రిటైల్ బ్రాండ్ను ప్రారంభించింది.
ఈ సందర్భంగా రేణిత రాజన్ మాట్లాడుతూ … మా ఇద్దరికీ మంచి పరిచయం ఉంది అలానే నయనపై నాకు చాలా నమ్మకముంది. అందుకే ఈ బ్రాండ్ ఎంటర్ప్రెన్యూర్షిప్లో భాగమయ్యాం. ‘ది లిప్బామ్ కంపెనీ’ కి సంబంధించి గత కొన్నేళ్లుగా మా ఇద్దరి మధ్య చర్చలు నడుస్తున్నాయి. కాకపోతే కరోనా కారణంగా కాస్త ఆలస్యమైంది. ఈ బ్యూటీ బ్రాండ్ను ప్రారంభించడం సంతోషంగా ఉంది అని రాజన్ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు విజయ్ సేతుపతి నయనతార సమంత జంటగా నటిస్తున్న చిత్రం కాత్తువక్కుల రెండు కాదల్ ” త్వరలోనే విడుదలకు సిద్ధంగా ఉంది. అలానే మెగాస్టార్ తో గాడ్ ఫాదర్’లో నటిస్తోంది. త్వరలో తమిళ దర్శకుడు విఘ్నేష్ శివన్ నయనతార వివాహ బంధంతో ఒక్కటి అవ్వనున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. మరిన్ని ప్రాజెక్టులో నయనతార సంతకాలు చేశారని సమాచారం.