spot_img
Homeఎంటర్టైన్మెంట్సోనూ సూద్‌ క్రేజ్‌ అంతా ఇంతా కాదు..!

సోనూ సూద్‌ క్రేజ్‌ అంతా ఇంతా కాదు..!

Sonu Sood
కరోనా లాక్‌డౌన్‌ ఏమోకానీ ఏ హీరోకు.. ఏ రాజకీయ నేతకు దక్కని ఫేమ్‌ దక్కింది బాలీవుడ్‌ నటుడు సోనూసూద్‌. ఆయన రీల్‌ లైఫ్‌ హీరో కాదు.. ఇప్పుడు రియల్‌ లైఫ్‌లోనూ హీరో అయ్యాడు. లాక్‌డౌన్‌లో ప్రజలు పడిన ఇబ్బందులు తీర్చిన గొప్ప నటుడు సోనూసూద్‌. ఇప్పుడు సోనూసూద్‌కు ఆ రాష్ట్రం.. ఈ రాష్ట్రం అంటూ తేడా లేదు.. ఏ రాష్ట్రానికి వెళ్లినా.. ఏ ప్రదేశానికి వెళ్లినా ఆయనకు అందే గౌరవం వేరు.

Also Read: రివ్యూ : క్రాక్ – ఓన్లీ మాస్ కు మాత్రమే !

‘వదల బొమ్మాళీ’ అంటూ రీల్‌ విలన్‌గా అభిమానులను ఆకట్టుకున్న విలక్షణ నటుడు సోనూ సూద్‌ కరోనా సంక్షోభం సమయంలో తన పెద్ద మనసుతో రియల్‌ హీరోగా అవతరించారు. దీంతో దేశవ్యాప్తంగా ఆయనకు ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ విపరీతంగా పెరిగింది. అందుకే ఆయన ఎక్కడ కనిపించినా కూడా వదల బొమ్మాళీ తరహాలో వెంటాడుతున్నారు. కానీ.. వీరంతా వెంటాడుతున్నది మాత్రం తాము అభిమానించే రియల్‌ హీరోమీద ఉన్న అంతులేని అభిమానంతో. తాజాగా షిర్డీలో చోటు చేసుకున్న ఆసక్తికరమైన పరిణామం గురించి తెలుసుకోవాలి.

సోనూసూద్‌ షిరిడీ సాయి ఆలయాన్ని దర్శించుకున్నారు. సోనూ సూద్ రాకతో ఆలయ అధికారులు, అర్చకులు, పోలీసులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. దీంతో అక్కడ అభిమానుల కోలాహలం నెలకొంది. సోనూ వచ్చారనే వార్త తెలియగానే భక్తులతో పాటు అక్కడి ప్రజలు పెద్ద ఎత్తున ఆలయానికి తరలివచ్చారు. సోనూని చూడగానే ‘రియల్ హీరో, రియల్ హీరో’.. ‘లవ్‌యూ సార్’.. అంటూ నినాదాలు చేశారు. ఫొటోలు క్లిక్‌మనిపిస్తూ వారంతా సందడి చేశారు. దీంతో సోనూ అందరికీ ధన్యవాదాలు తెలిపారు.

Also Read: ‘వేదాంతం రాఘవయ్య’ మొదలయ్యాడు !

లాక్‌డౌన్‌లో చేదోడువాదోడుగా నిలిచిన సోనూ.. లాక్‌డౌన్‌ ముగిశాక కూడా ఇంకా సాయం అందిస్తూనే ఉన్నారు.దీనికి బాధితుల కృతజ్ఞతలతోపాటు, పలువురి ప్రశంసలను కూడా సొంతం చేసుకున్నారు. ఇటీవల ఆచార్య యూనిట్‌ సభ్యులకు 100 స్మార్ట్‌పోన్లను ఉచితంగా అందించిన సంగతి తెలిసిందే. కాగా.. మెగాస్టార్ చిరంజీవి ‘ఆచార్య’ చిత్రంలో సోనూ కీలక పాత్రలో నటిస్తున్నారు. అలాగే సోనూ సూద్ ప్రత్యేక పాత్రలో నటించిన ‘అల్లుడు అదుర్స్’ ఈ సంక్రాంతికి విడుదల కానుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్

Srinivas
Srinivashttps://oktelugu.com/
Srinivas is a Political Reporter working with us from last one year. He writes articles on latest political updates happening in both Telugu States. He has the experience of more than 15 years in Journalism.
Exit mobile version