
కరోనా మహమ్మారికి ఎలాంటి ఫీలింగ్స్ లేవు. ముఖ్యంగా మతం ప్రాంతం లాంటి వ్యత్యాసాలను కరోనా పట్టించుకోదు. నిర్లక్ష్యంగా దొరికిరా.. కాటు వేయటానికి రెడీగా ఉంటుంది. ఇప్పటికే సామాన్యులతో పాటు ప్రముఖులనూ అది భయపెడుతుంది. డబ్బు ఉంటే వైద్యం.. కానీ కరోనాకి రెండూ ఉన్న మందే లేదు అన్న మాదిరిగా తయారయింది ప్రస్తుత పరిస్థితి. ఇప్పటికే మన తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులు కూడా కరోనా బారిన పడి.. బాధ పడుతున్నారు. టాలీవుడ్లోనూ నిర్మాత, నటుడు బండ్ల గణేష్ కూడా కరోనా బాధితుడే.
ఈ ఒక్క పనితో జాతీయస్థాయిలో హీరో అయిన జగన్
అయితే తెలుగు పరిశ్రమలో స్టార్ హీరోలు మాత్రం కరోనాకి దూరంగా జాగ్రత్తగా ఉంటున్నారు. కానీ బాలీవుడ్ టాప్ స్టార్ అమీర్ ఖాన్ అండ్ ఆయన ఫ్యామిలీ గత రెండు రోజులుగా కరోనా టెన్షన్ అనుభవిస్తున్నారు. తాజగా ఆమీర్ కరోనాకి సంబంధించి ట్వీట్ చేస్తూ.. తన తల్లిగారికి కూడా కరోనా టెస్ట్ చేయగా రిజల్ట్ నెగెటివ్ అని వచ్చిందని.. ఎంతో టెన్షన్ తరువాత ఆ వార్త ఆమీర్ కి భరోసా ఇచ్చిందని ఆయన మాటలను బట్టి అర్ధమవుతుంది. అమీర్ అభిమానులను ఉద్దేశించి.. తమ కై ప్రార్ధనలు చేసిన ఫ్యాన్స్ కి నా ప్రత్యేకమైన ధన్యవాదాలు’ అని తెలిపారు. నిజానికి ఎప్పుడైతే అమీర్ ఖాన్ వ్యక్తిగత సిబ్బందిలో కొందరికి కరోనా పోజిటివ్ అని వచ్చిందో.. అప్పుడే అమీర్ ఫ్యామిలీ మెంబర్స్ ఒక్కసారిగా టెన్షన్ తో భయపడిపోయారు.
వావ్.. కరోనాకు ఫేర్ వెల్ పార్టీ.. వైరల్ వీడియో
అమీర్ ఖాన్ సైతం చాల కంగారు పడ్డారని బాలీవుడ్ మీడియా రాసుకొచ్చింది. ఏది ఏమైనా అమీర్ ఖాన్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కరోనా టెస్ట్ చేయగా.. అందరికీ నెగిటివ్ అని వచ్చింది. ఇక ప్రస్తుతం అమీర్ ఖాన్ లాల్ సింగ్ చద్దా అనే సినిమా చేస్తున్నాడు. 1994లో వచ్చిన ఫారెస్ట్ గంప్ అనే హాలీవుడ్ మూవీకి రీమేక్ గా ఈ సినిమా వస్తుందని.. దర్శకుడు అద్వైత్ చందన్ ఈ సినిమాని హాలీవుడ్ రేంజ్ లో తెరకెక్కిస్తున్నారని తెలుస్తోంది.