Allu Arjun: బిగ్ బ్రేకింగ్ : అల్లు అర్జున్ కేసులో సరికొత్త ట్విస్ట్..సంచలన తీర్పు ఇచ్చిన అమరావతి హైకోర్టు!

కేసు ని ప్రస్తుతానికి కొట్టేయలేదు కానీ, అల్లు అర్జున్ కి కాస్త ఉపశమనం ఇచ్చే తీర్పుని ప్రకటించింది హై కోర్టు. ఈ కేసు విషయం లో అల్లు అర్జున్ కి వచ్చే నెల 6వ తేదీన నోటీసులు జారీ చేస్తామని, అప్పటి వరకు ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకోరాదని పోలీసులను ఆదేశించింది.

Written By: Vicky, Updated On : October 25, 2024 5:15 pm

Allu Arjun(8)

Follow us on

Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గడిచిన సార్వత్రిక ఎన్నికల సమయంలో ప్రచారం ముగిసే చివరి రోజున నంద్యాలకి వెళ్లి అప్పటి వైసీపీ ఎమ్మెల్యే శిల్ప రవి కిషోర్ రెడ్డి ఇంటికి వెళ్లి, తన మద్దతుని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ ఘటన రాజకీయాల్లో పెను దుమారమే రేపింది. అల్లు అర్జున్ పై తీవ్రమైన వ్యతిరేకత ఏర్పడింది. గడిచిన నాలుగు నెలల నుండి సోషల్ మీడియా లో పవన్ కళ్యాణ్ అభిమానులు అల్లు అర్జున్ ని ఏ రేంజ్ లో ట్రోల్ చేస్తున్నారో మనమంతా చూస్తూనే ఉన్నాం. ఇదంతా పక్కన పెడితే ఆయన నంద్యాల కి వెళ్లిన రోజు అభిమానులు వేల సంఖ్యలో హాజరయ్యారు. శిల్పా రవి ఇంటి వద్ద అభిమానుల కోలాహలం ని కట్టడి చేయడానికి పోలీసులకు చాలా కష్టమైంది. ఆరోజు సెక్షన్ 144 అమలు లో ఉంది. రూల్స్ ప్రకారం ఆరోజు జన సమీకరణ చేయకూడదు. కానీ అల్లు అర్జున్ చేయడంతో ఆయనపై పోలీస్ కేసు నమోదైంది. అయితే తాను ఎలాంటి జనసమీకరణ చేయలేదని, కేవలం తన స్నేహితుడికి మద్దతు పలికేందుకు మాత్రమే అతని ఇంటికి వెళ్లానని, ఉద్దేశపూర్వకంగా రూల్స్ ని అతిక్రమించి జన సమీకరణ చేయలేదని, తన కేసుపై నమోదైన ఈ కేసు ని కొట్టివేయాల్సిందిగా ఇటీవలే అల్లు అర్జున్ అమరావతి హై కోర్టులో క్వాష్ పిటీషన్ దాఖాలు చేసాడు.

కేసు ని ప్రస్తుతానికి కొట్టేయలేదు కానీ, అల్లు అర్జున్ కి కాస్త ఉపశమనం ఇచ్చే తీర్పుని ప్రకటించింది హై కోర్టు. ఈ కేసు విషయం లో అల్లు అర్జున్ కి వచ్చే నెల 6వ తేదీన నోటీసులు జారీ చేస్తామని, అప్పటి వరకు ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకోరాదని పోలీసులను ఆదేశించింది. దీంతో అల్లు అర్జున్ అభిమానులు కాస్త ఊపిరి పీల్చుకున్నారు. అలాగే పొరపాటున జరిగిన ఈ సంఘటన ని అర్థం చేసుకొని, కేసు ని కొట్టివేయాల్సిందిగా అభిమానులు సోషల్ మీడియా ద్వారా కోర్టుని కోరుతున్నారు. మరి ఏమి జరగబోతుందో, రాబోయే రోజుల్లో ఈ కేసు ఎన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి.

ఇది ఇలా ఉండగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన లేటెస్ట్ చిత్రం ‘పుష్ప 2 : ది రూల్’ ఈ ఏడాది డిసెంబర్ 5వ తారీఖున ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల అవ్వబోతున్న సంగతి తెలిసిందే. ముందుగా ఈ చిత్రాన్ని డిసెంబర్ 6న విడుదల చేయాలనీ అనుకున్నారు, కానీ బయ్యర్స్ స్పెషల్ రిక్వెస్ట్ చేయడంతో ఒకరోజు వెనక్కి వెళ్ళింది. విడుదలకు ముందే వెయ్యి కోట్ల రూపాయలకు పైగా ప్రీ రిలీజ్ బిజినెస్ ని జరుపుకున్న ఈ చిత్రం, మొదటి రోజే 300 కోట్ల రూపాయిల గ్రాస్ ఓపెనింగ్ పై కన్నేసింది. ఇప్పటి వరకు ఏ ఇండియన్ సినిమాకి కూడా ఈ స్థాయి గ్రాస్ వసూళ్లు రాలేదు. #RRR చిత్రానికి కూడా 230 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి, కానీ ఈ చిత్రానికి మొదటి రోజు ఏకంగా 300 కోట్ల రూపాయిలు వస్తాయని అంటున్నారంటే అంచనాలు ఏ రేంజ్ లో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు .