Homeఎంటర్టైన్మెంట్పవన్ కళ్యాణ్ త్వరలో రాబోయే 5 సినిమాలు.. వివరాలు

పవన్ కళ్యాణ్ త్వరలో రాబోయే 5 సినిమాలు.. వివరాలు

 

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన రాజకీయ ఆశయాలను సాధించడానికి ఒకప్పుడు నటన నుండి విశ్రాంతి తీసుకొని రాజకీయాలలోనే ఉండిపోయారు. చాలా కాలం తరువాత పవన్ కళ్యాణ్ టాలీవుడ్ కి మళ్ళీ ఎంట్రీ ఇచ్చేసాడు. ఈ సారి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరింత దూకుడుగా ఉన్నట్లు తెలుస్తోంది. రాబోయే కొన్నేళ్లలో ఆయన నటించనున్న ఐదు సినిమాలు త్వరలో విడుదల కానున్నాయి.

 

Read More: మరోసారి రంగంలోకి దిగిన మెగాస్టార్ చిన్నల్లుడు..!

 

ఈ ఐదు చిత్రాలు పిఎస్‌పికె 26, పిఎస్‌పికె 27, పిఎస్‌పికె 28, పిఎస్‌పికె 29 మరియు పిఎస్‌పికె 30. వీటిలో ప్రతి ఒక్కటి ఫాన్స్ ని చాలా ఆకట్టుకునేవిగా ఉన్నాయి. 2020 మరియు 2022 మధ్య లో ఈ అయిదు చిత్రాలను విడుదలకు పవన్ కళ్యాణ్ ప్లాన్ చేస్తే, ప్రతి మూడు నెలలకు ఒక చిత్రం విడుదల అవుతుంది. ప్రస్తుత హీరోలలో మరే ఇతర హీరో ఈ ఘనత సాధించలేదు.

 

పిఎస్‌పికె 26

సూపర్ హిట్ చిత్రం పింక్ బాలీవడ్ లో ఎన్నో ప్రశంసలు అందుకోవడం తో తెలుగు రీమేక్‌లో అమితాబ్ బచ్చన్ పాత్రను పోషించడానికి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అనుమతి ఇచ్చారు. తాత్కాలికంగా పిఎస్‌పికె 26 అని పిలువబడే ఈ చిత్రం వేధింపులకు గురైన ముగ్గురు అమ్మాయిల కథను మేరుకు నడుస్తుంది.ఈ చిత్రానికి వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తుండగా బోనీ కపూర్ సహకారంతో దిల్ రాజు నిర్మిస్తున్నారు. హిందీ లో నటించిన తావేసీ పన్నూ, కృతి కుల్హారీ మరియు ఆండ్రియా తారియాంగ్ పాత్రలను తెలుగులో నివేదా థామస్, అంజలి మరియు అనన్య నాగల్ల పోషిస్తున్నారు. ఇంకా పేరు పెట్టని ఈ ప్రాజెక్ట్ ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది, మే 15 న ఈ చిత్రాన్ని విడుదల చేయాలని మేకర్స్ లక్ష్యంగా పెట్టుకున్నారు.

 

Read More: పవర్ స్టార్ కి జోడి గా కియారా అద్వాని..?

 

పిఎస్‌పికె 27

పవన్ తన 27 వ ప్రాజెక్ట్ కోసం చిత్రనిర్మాత క్రిష్ జగర్లముడితో జతకట్టడానికి సిద్ధంగా ఉన్నాడు,ఈ సినిమా ప్రాజెక్టు జనవరి 29 న ఎ.ఎం.రత్నం కార్యాలయంలోకి వెళ్లినట్లు తెలుస్తోంది,ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ఫిబ్రవరి 4 నుండి కిక్‌స్టార్ట్ అవుతుందని తెలిసింది. ఎ.ఎం.రత్నం తన సొంత బ్యానర్ శ్రీ సూర్య మూవీస్ సమర్పణంలో ఈ ప్రాజెక్టును చేయనున్నారు.

 

పిఎస్‌పికె 28

హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న చిత్రంలో కూడా పవన్ కనిపించనున్నారు, పవన్ కళ్యాణ్ హరీష్ శంకర్ ఇద్దరి కాంబినేషన్ లో గతంలో గబ్బర్ సింగ్ వచ్చింది ఇది అందరికి తెలిసిందే . దీనితో భిమానులు వీరి ఇద్దరి కాంబినేషన్ కోసం ఎదురు చూస్తున్నారు, త్వరలో వీరి కాంబినేషన్ లో రాబోయే చిత్రం కమర్షియల్ ఎంటర్టైనర్ అని తెలుస్తోంది. ఈ పిఎస్‌పికె 28 ను మైత్రి మూవీ మేకర్స్ నిర్మించనున్నారు.

 

పిఎస్‌పికె 29

మరో ప్రతిభావంతుడైన దర్శకుడు గౌతమ్ టిన్ననురితో కలిసి పవన్ కళ్యాణ్ పనిచేయనున్నారు. రాబోయే ప్రాజెక్ట్ కోసం మజిలి దర్శకుడు గౌతమ్ టిన్ననురి పవన్ సంప్రదించినట్లు తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో కనిపించే ఈ చిత్రం గురించి తెలుసుకోవడానికి అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

 

Read More: 19వ శతాబ్దపు మహిళగా సమంతా.. ఫోటో అదుర్స్

 

పిఎస్‌పికె 30

రాజకీయ యాక్షన్-డ్రామా కోసం పవన్ కళ్యాణ్ మరోసారి పూరి జగన్నాధ్‌తో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారని తెలుస్తోంది.
సన్నిహితం గా ఉండే వీరు ఇద్దరు తరుచు కలుస్తా ఉంటారు ఐతే ఈ సారి కలిసినప్పుడు పవన్ కు కథను చెప్పాడు , స్టోరీ నచ్చడం తో పవన్ చాలా ఇంట్రెస్ట్ చూపడమే కాకుండా ఓకే చెప్పేసాడు.

admin
adminhttps://oktelugu.com/
Editor, He is Working from Past 3 Years in this Organization, He is the incharge of News content and Looks after the overall Content Management.
RELATED ARTICLES

Most Popular