కలియుగం ‘క్లైమాక్స్‌’కు చేరిందా..

‘శివ’ నుంచి ప్రతి దశలోనూ వైవిధ్యాన్ని చాటుకుంటూ ముందుకెళ్తున్నాడు సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. తెలుగు నుంచి బాలీవుడ్‌కు వెళ్లి.. అక్కడా ఇండస్ట్రీని షేక్‌ చేసిన ఆర్జీవీ ఈ మధ్య వివాదాస్పద సినిమాలతో తరచూ వార్తల్లో నిలుస్తున్నాడు. అయినా ఎక్కడా తగ్గకుండా తనదైన స్టయిల్లో దూసుకెళ్తున్నాడు. అమెరికా పోర్న్ స్టార్ మియా మాల్కోవాతో జీఎస్‌టీ (గాడ్ సెక్స్‌ ట్రూత్‌) అనే షార్ట్‌ ఫిలింతో రెండేళ్ల కింద పెను సంచలనం సృష్టించాడు. ఇప్పుడు మియాతో పూర్తి స్థాయి […]

Written By: admin, Updated On : June 6, 2020 5:11 pm
Follow us on


‘శివ’ నుంచి ప్రతి దశలోనూ వైవిధ్యాన్ని చాటుకుంటూ ముందుకెళ్తున్నాడు సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. తెలుగు నుంచి బాలీవుడ్‌కు వెళ్లి.. అక్కడా ఇండస్ట్రీని షేక్‌ చేసిన ఆర్జీవీ ఈ మధ్య వివాదాస్పద సినిమాలతో తరచూ వార్తల్లో నిలుస్తున్నాడు. అయినా ఎక్కడా తగ్గకుండా తనదైన స్టయిల్లో దూసుకెళ్తున్నాడు. అమెరికా పోర్న్ స్టార్ మియా మాల్కోవాతో జీఎస్‌టీ (గాడ్ సెక్స్‌ ట్రూత్‌) అనే షార్ట్‌ ఫిలింతో రెండేళ్ల కింద పెను సంచలనం సృష్టించాడు. ఇప్పుడు మియాతో పూర్తి స్థాయి సినిమా తీశాడు. కరోనా కారణంగా అందరూ ఇళ్లలో లాక్‌డౌన్‌ అవగా.. ఆర్జీవీ మాత్రం ఈ మూవీతో పాటు కరోనా వైరస్‌ సినిమా కూడా తేసేశాడు.

‘క్లైమాక్స్’.. టీజర్, ట్రైలర్తో ఇప్పటికే కుర్రాళ్ల హార్ట్‌బీట్ పెంచేశాడు. ఈ రోజు రాత్రి 9 గంటకు ఈ మూవీని ఆన్‌లైన్‌లో విడుదల చేస్తున్నాడు. తాజాగా ఈ సినిమాలోని మరో క్లిప్‌ను కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన రాము… ఈ మూవీ రాత్రి 9 గంటల నుంచి RGVWorld.in / ShreyasET లో అందుబాటులో ఉంటుందని రూ.100 చెల్లించి చూడొచ్చని తెలిపాడు. ప్రపంచ తొలి ఆన్‌లైన్ థియేటర్ను ఎంజాయ్‌ చేయాలని ట్వీట్ చేశాడు. సినిమాను ఎలా చూడాలో వరుస ట్వీట్స్‌లో వివరిస్తున్నాడు. అంతేకాదు.. ‘హారర్ సినిమాలను సాధారణంగా చీకటితో ఉన్న భయంకర ప్రదేశాల్లో తీస్తారు.. కానీ, మియా మాల్కోవాతో తీసిన ఈ సినిమా మాత్రం ఎడారిలో పగటిపూట పూర్తి వెలుతురులో తీసిన మొట్టమొదటి సినిమా’ అని వర్మ పేర్కొన్నాడు.

సినిమాను ప్రమోట్ చేయడంలో ఎప్పుడూ ముందుండే ఆర్జీవీ.. క్లైమాక్స్‌నూ తనదైన శైలిలో ప్రమోట్ చేస్తున్నాడు. సోషల్ మీడియాలో వస్తున్న ట్రోల్స్‌, మిమ్స్‌ను కూడా అందుకు వాడుకుంటున్నాడు. ఈ క్రమంలో క్లైమాక్స్ ట్రైలర్కు.. పలు సినిమాల్లో బ్రహ్మానందం, అలీతో రియాక్షన్‌ను జోడించి క్రియేట్ చేసిన మిమ్‌ను ఆర్జీవీ తన ట్విట్టర్, ఇన్‌స్టాలో షేర్ చేశాడు. సుబ్రమణ్యం ఫర్ సేల్ సినిమాలో ‘కలియుగం క్లైమాక్స్‌కు చేరిందా’ అంటూ బ్రహ్మానందం చెప్పే డైలాగ్‌తో మొదలయ్యే మిమ్‌ ఆసక్తికరంగా ఉంది.