Homeఎడ్యుకేషన్SSC Exams 2025 : పదో తరగతి పరీక్షల్లో మార్పు.. కీలక నిర్ణయం తీసుకున్న తెలంగాణ...

SSC Exams 2025 : పదో తరగతి పరీక్షల్లో మార్పు.. కీలక నిర్ణయం తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం

SSC Exams 2025 :  తెలంగాణలోని పదో తరగతి పరీక్షల విధానంలో కీలక మార్పులు జరగనున్నాయి. ఈమేరకు ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఇంతకాలం ఉన్న ఇంటర్నల్‌ మార్కులను విధానాన్ని పూర్తిగా రద్దు చేసింది. ఇప్పటి వరకు 80 మార్కులకు వార్షిక పరీక్షలు జరగగా, 20 ఇంటర్నల్‌ మార్కులు కేటాయించారు. అయితే తాజా నిర్ణయంతో 100 మారు‍్కలకు వార్షిక పరీక్షలు జరగనున్నాయి. 2024-25 విద్యా సంవత్సరం నుంచే ఈ నిర్ణయం అమలు చేయనున్నారు. మరోవైపు పరీక్ష ఫీజుల చెల్లింపు జరుగుతోంది. డిసెంబర్‌ 5 వరకు ఎలాంటి ఫైన్‌ లేకుండా ఫీజు చెల్లించారు. రూ.50 ఫైన్‌తో డిసెంబర్‌ 12 వరకు ఫీజు చెల్లించొచ్చు. ఇక రూ.200 ఫైన్‌తో డిసెంబర్‌ 19 వరకు ఫీజు చెల్లించే అవకాశం ఉంది. రూ.500 ఫైన్‌తో డిసెంబర్‌ 30 వరకు ఫీజు చెల్లించే అవకాశం ఉంది.

పారదర్శకత లోపించడంతో..
పాఠశాలలు ఇంటర్నల్‌ మార్కులు వేసే అకాశం ఉండడంతో యాజమాన్యాలు ఇష్టానుసారం మార్కులు వేసుకుంటున్నారు. విద్యార్థులు చదువులో వెనుకబడినా 15 పైగా ఇంటర్నల్‌ మార్కులు వేస్తున్నారు. దీంతో జీపీఏలలో తేడా వస్తోంది. ప్రతిభ ఉన్న విద్యార్థులు నష్టపోతున్నారు. ఈ నేపథ్యంలో ఇంటర‍్నల్‌ మార్కులను పూర్తిగా ఎత్తివేయాలని ప్రభుత‍్వం నిర్ణయించింది.

ఫీజు ఇలా..
రెగ్యులర్‌ విద్యార్థులకు అన్ని పేపర్లకు కలిపి రూ.125 ఫీజు చెల్లించాలి. మూడు పేపర్లలోపు ఉంటే రూ.110 చెల్లించాలి. మూడు పేపర్ల కన్నా ఎక్కువ ఉంటే రూ.123 చెల్లించాలి. ఒకేషనల్‌ విద్యార్థులు అదనంగా రూ.60 చెల్లించాలి. https://www.bse.telangana.gov.in/ వెబ్‌సైట్‌లో ఫీజుకు సంబంధించిన పూర్తి వివరాలు ఉన్నాయి. ఇక పరీక్ష ఫీజుల చెల్లింపులో ఇబ్బందులను, పాఠశాలలపై భారం తగ్గించేలా ప్రభుత్వ పరీక్షల విభాగం చర్యలు చేపట్టింది. ఆన్‌లైన్‌లో పరీక్షల ఫీజులు చెల్లించే అవకాశం కల్పించింది. పరీక్షల ఫీజు చెల్లించాలంటే.. విద్యార్థులు చదివే పాఠశాల ప్రధానోపాధ్యాయుడికి ఫీజు కట్టాలి. గతంలో హెచ్‌ఎంలు లేదా పాఠశాల సిబ్బంది బ్యాంకుకు వెళ్లి చలానా తీసేవారు. ఇదంతా పని భారంగా మారింది. ఈ సమసయలకు చెక్‌ పెట్టేలా వెబసైట్‌లో ఆన్‌లైన్‌ పేమెంట్‌ ఆప్షన్‌ తీసుకొచ్చింది. ప్రాధానోపాధ్యాయులకు కేటాయించే వివరాల ద్వారా లాగిన్‌ అవుతారు. నేరుగా ఆన్‌లైన్‌లోనే ఫీజు చెల్లిస్తారు. ఫీజు చెలి‍్లంచిన 24 గంటల్లోపు స్టేటస్‌ అప్‌డేట్‌ అవుతుంది. https://bse.telangana.gov.in/SSCADMFRFY/Account/Login.aspx లింక్‌పై క్లిక్ చేసి ప్రాసెస్ చేసుకోవాల్సి ఉంటుంది.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
RELATED ARTICLES

Most Popular