JEE Mains Admit Cards& 2025: జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ లేదా JEE మెయిన్ భారతదేశంలో ప్రసిద్ధి చెందిన, అత్యంత కఠినమైన పరీక్షలలో ఒకటి. విద్యార్థులు వివిధ డొమైన్లలో ఇంజనీరింగ్ కోర్సులను అందించే ప్రతిష్టాత్మక విశ్వవిద్యాలయాలు, కళాశాలల్లో ప్రవేశం పొందడానికి ఈ పరీక్ష నిర్వహించబడుతుంది. ఈ పరీక్షకు సిద్ధంగా ఉండటానికి, ప్రయత్నించడానికి నెలలు లేదా తయారీ, సంవత్సరాల బలం అవసరం. విద్యార్థులు తమ కలల కళాశాలలు లేదా కోర్సులలోకి ప్రవేశించే ముందు అనేక దశలను దాటాలి. ఫస్ట్ఫేజ్ జేఈఈ మెయిన్ 2025 కోసం రిజిస్ట్రేషన్ ముగిసింది. ఆ తర్వాతది 2025, జనవరి 10న విడుదల చేయబడిన సిటీ ఇంటిమేషన్ స్లిప్. ఇప్పుడు అడ్మిట్ కార్డ్ విడుదలైంది. ఇది పరీక్షా కేంద్రంలోకి ప్రవేశించడానికి, పరీక్ష రాయడానికి ముఖ్యమైన పత్రాలలో ఒకటి. . ఈ పత్రం ఫలితం విడుదలయ్యే వరకు బహుశా ఆ తర్వాత అడ్మిషన్ కోసం మీకు సహాయపడుతుంది. ఇక జేఈఈ మెయిన్ 2025 సెషన్–1 పరీక్షకు రంగం సిద్ధమైన నేపథ్యంలో పరీక్షలు రాసే విద్యార్థులకు ఎన్టీఏ కీలక సూచనలు చేసింది.
ఇవి వెంట తీసుకెళ్లాలి..
– పరీక్ష కేంద్రానికి వెళ్లే సమయంలో అడ్మిట్ కార్డు(Admit card)తోపాటు ఎన్టీఏ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకున్న డిక్లరేషన్ ఫాం కచ్చితంగా నింపాలి. అడ్మిట్ కార్డు లేకపోతే పరీక్ష కేంద్రంలోకి అనుమతించరు.
– పరీక్ష రాసే విద్యార్థులు తమ ధ్రువీకరణను నిర్ధారించేలా ఫొటో గుర్తింపు కార్డు(Photo Identity Card) తీసుకెళ్లాలి. ఎన్టీఏ సూచించిన డ్రైవింగ్ లైసెన్స్, పాన్కార్డు, ఆధార్ కార్డు, పాస్పోర్టు, రేషన్కార్డు, ఫొటో ఉన్న బ్యాంకు పాస్బుక్, 12వ తరగతి అడ్మిట్ కార్డు ఏదైనా ఒకటి ఉండాలి.
– ఇక ప్రతీ విద్యార్థి పరీక్ష కేంద్రానికి ఒక పాస్పోర్టు సైజ్ ఫొటో(Pass port Size Photo) తీసుకెళ్లాలని. ఆన్లైన్లో దరఖాస్తు చేసినప్పుడు అప్లోడ్ చేసిన ఫొటోనే తీసుకెళ్లాలి.
– విద్యార్థుల తమ వెంట ట్రాన్స్పరెంట్గా ఉండే బాల్పాయింట్ పెన్ను తీసుకెల్లాలి.
– విద్యార్థులు దివ్యాంగులైతే పీడబ్ల్యూడీ(PWD) సర్టిఫికెట్ తప్పనిసరిగా తమ వెంట తీసుకోళ్లాలి.
మరికొన్ని కొన్ని కీలక సూచనలివే..
– అడ్మిట్ కార్డులో ఇచ్చిన సూచనలు తప్పనిసరిగా విద్యార్థులు చదవాలి.
– పరీక్ష సమయానికి రెండు గంటల ముందే కేంద్రాలకు చేరుకోవలి. అడ్మిట్ కార్డు(Admit Cards)లో ఉన్న సమయానికి మీకు కేటాయించిన కేంద్రంలో రిపోర్టు చేయాలి. పరీక్ష హాల్ తెరవగానే కేటాయించిన సీట్లో కూర్చొని పరీక్ష రాసేందుకు సిద్ధంగా ఉండాలి.
– పరీక్షకు వెళ్లే సమయంలో ట్రాఫిక్ జామ్, రైలు/బస్సు వంటి కారణాలతో ఆలస్యం కాకుండా చూసుకోవాలి. లేదంటే కేంద్రానికి సమయానిక చేరుకోలేరు. ఇక కేంద్రంలో ఇన్విజిలేటర్లు ఇచ్చే సూచనలు మిస్ అవుతారు.
– కేంద్రంలో ఏదైనా సాంకేతిక సమస్య సాయం/ఎమర్జెనీ, పరీక్షకు సంబంధించిన ఇబ్బంది ఎదురైతే సూపరింటెండెంట్/ఇన్విజిలేటర్ను సంప్రదించాలి.
– కంప్యూటర్లో మీరు ఎంపిక చేసుకున్న సబ్జెక్టు ప్రకారం ప్రశ్నపత్రం వచ్చిందా లేదా చూసుకోవాలి. వేరే సబ్జెక్టు పత్రం వస్తే వెంటనే ఇన్విజిలేటర్ దృష్టికి తీసుకెళ్లాలి.
కంప్యూటర్ ఆధారిత పరీక్షలకు సంబంధించిన సందేహాలు నివృత్తి చేసుకోవడానికి జేఈఈ(మెయిన్) వెబ్సైట్లోని హెల్ప్లైన్ నంబర్లలో సంప్రదించాలి.
పరీక్ష కేంద్రం వద్ద వీటికి నో ఎంట్రీ..
ఇక పరీక్ష కేంద్రాల్లోకి చిరుతిళ్లు, జామెట్రీ/పెన్సిల్ఞాక్స్, హ్యాండ్ బ్యాగు, పర్సు, పేపర్లు/స్టేషనరీ, ప్రింటెడ్ మెటీరియల్, వాటర్ బాటిల్, మొబైల్/ఇయర్ ఫోన్/మైక్రోఫోన్/పేజర్, కాలిక్యులేటర్, డాక్కుపెన్, కెమరా, టేప్ రికార్డర్ వంటివి అనుమతించరు. ఎక్కువ పాకెట్స్ ఉన్న దుస్తులు కూడా వేసుకోవద్దు. నగలు, మెటాలిక్ వస్తువుల పరీక్ష కేంద్రాల్లోకి తీసుకెళ్లడం నిషేధం.