spot_img
Homeఎడ్యుకేషన్దేశంలోని నిరుద్యోగులకు శుభవార్త.. ఆ కోర్సులు నేర్చుకునే ఛాన్స్.?

దేశంలోని నిరుద్యోగులకు శుభవార్త.. ఆ కోర్సులు నేర్చుకునే ఛాన్స్.?

Courses
దేశంలోని నిరుద్యోగులకు ప్రయోజనం చేకూర్చే విధంగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ రంగ సంస్థలలో ఒకటైన ఈ-గవర్నెన్స్ సంస్థ ద్వారా గ్రామీణ ప్రాంతానికి చెందిన విద్యార్థులు టెక్నికల్ కోర్సులు నేర్చుకునే అవకాశాన్ని కేంద్రం కల్పిస్తోంది. ఆసక్తి ఉన్న నిరుద్యోగులు, విద్యార్థులు 3డీ ప్రింటింగ్, సైబర్ భద్రత కోర్సులను నేర్చుకునే అవకాశాన్ని కేంద్రం కల్పిస్తూ ఉండటం గమనార్హం.

Also Read: ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త.. రెండు కీలక నిర్ణయాలు..?

కేంద్రం ఇందుకోసం ఫ్రాన్స్ దేశానికి చెందిన ఎకోల్ సుపీరియర్ రాబర్ట్ డి సార్బన్ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకుంది. సీఎస్‏సీ అకాడమీ కేంద్రాల ద్వారా గ్రామీణ నిరుద్యోగులు, విద్యార్థులు ఈ కోర్సులను నేర్చుకోవచ్చు. దేశవ్యాప్తంగా ఉన్న సీఎస్‏సీ అకాడమీ కేంద్రాల ద్వారా ఈ కోర్సులలో జాయిన్ కావడంతో పాటు నేర్చుకునే అవకాశం ఉంటుంది. సమీపంలోని సీఎస్‏సీ అకాడమీ కేంద్రాలను సందర్శించి ఈ కోర్సులకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు.

Also Read: ఏపీలో డీఎస్సీ రాసేవాళ్లకు అలర్ట్.. ఆ సిలబస్ లో మార్పు..?

సీఎస్‏సీ ఎండీ దినేశ్ త్యాగి దినేష్ త్యాగి మాట్లాడుతూ గ్రామీణ యువతకు టెక్నికల్ కోర్సులు అందుబాటులోకి తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ కోర్సులను అందుబాటులోకి తెచ్చినట్టు వెల్లడించారు. యువత ఈ కోర్సుల్లో శిక్షణ తీసుకోవడం వల్ల వారిలో నైపుణ్యాలతో పాటు వారికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరుగుతాయని కేంద్రం భావిస్తోంది. ఎకోల్ సుపీరియర్ సంస్థ నాన్ ప్రొఫీట్ కంపెనీ కావడంతో యువతకు ప్రయోజనం చేకూరుతోంది.

మరిన్ని వార్తలు కోసం: విద్య / ఉద్యోగాలు

ప్రస్తుతం దేశంలో 5,000 సీఎస్‏సీ అకాడమీ కేంద్రాలు అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుతం టెక్నికల్ కోర్సులు ఈ కేంద్రాలలోని నిరుద్యోగులకు అందుబాటులోకి రానున్నాయి. కేంద్రం సీఎస్‏సీ అకాడమీ కేంద్రాల సంఖ్యను భారీగా పెంచాలని భావిస్తోంది.

Kusuma Aggunna
Kusuma Aggunnahttps://oktelugu.com/
Kusuma Aggunna is a Senior Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues.
Exit mobile version