Uttar Pradesh : కారులో ఆ పనిచేస్తున్న ఒక యువతి, ఇద్దరు యువకులు.. సడన్ గా డివైడర్ ను ఢీకొట్టిన వాహనం.. స్థానికులు వెళ్లి చూడగా షాక్

కాన్పూర్ ప్రాంతానికి చెందిన ఓ మహిళకు చిన్నప్పుడే పెళ్లయింది. ఆమెకు నలుగురు పిల్లలు. ఈ క్రమంలో భర్తతో విభేదాలు పొడచూపాయి. దీంతో అతడు ఆ నలుగురు పిల్లల్ని వదిలేసి వేరే ప్రాంతానికి వెళ్లిపోయాడు. అప్పటినుంచి ఆ మహిళ తన పిక్రమంలో సాకుతూ వస్తోంది. ఇదే క్రమంలో ఇల్లు గడిచేందుకు ఆమె వేరే అవతారం ఎత్తింది.

Written By: Anabothula Bhaskar, Updated On : July 30, 2024 1:34 pm
Follow us on

Uttar Pradesh  : అది ఉత్తరప్రదేశ్ రాష్ట్రం. కాన్పూర్ నగరం. వచ్చి పోయే వాహనాలతో ఆ హైవే రద్దీగా ఉంది. ఈలోగా ఒకరు అత్యంత వేగంగా దూసుకు వెళ్తోంది. ఇదే క్రమంలో ఓ డివైడర్ ను ఢీ కొట్టింది. దీంతో స్థానికులు వెంటనే సంఘటనా స్థలం వద్దకు వెళ్లారు. ఆ కారులో ఉన్న వారిని బయటికి తీశారు. అయితే వారికి స్వల్ప గాయాలయ్యాయి. ఆ కారులో ఉన్న వారిని బయటకు తీస్తున్న క్రమంలో కనిపించిన దృశ్యాలు స్థానికులను దిగ్భ్రాంతికి గురిచేశాయి. వెంటనే వారు తమ కళ్ళు మూసుకున్నారు. ఇదెక్కడి ఘోరమంటూ వాపోయారు. అదే సమయంలో ఆ ప్రాంతానికి పోలీసులు రావడంతో అసలు విషయం వెలుగు చూసింది. పోలీసులు కూడా అక్కడి దృశ్యాలను చూసి వామ్మో ఇదేం పని అంటూ ఆశ్చర్యపోయారు. ఇదేం కర్మ రా బాబూ తమలో తామే మదనపడ్డారు.

ఏం జరిగిందంటే..

కాన్పూర్ ప్రాంతానికి చెందిన ఓ మహిళకు చిన్నప్పుడే పెళ్లయింది. ఆమెకు నలుగురు పిల్లలు. ఈ క్రమంలో భర్తతో విభేదాలు పొడచూపాయి. దీంతో అతడు ఆ నలుగురు పిల్లల్ని వదిలేసి వేరే ప్రాంతానికి వెళ్లిపోయాడు. అప్పటినుంచి ఆ మహిళ తన పిక్రమంలో సాకుతూ వస్తోంది. ఇదే క్రమంలో ఇల్లు గడిచేందుకు ఆమె వేరే అవతారం ఎత్తింది. ఇందులో భాగంగా పలువురు యువకులను తన ఇంటికి రప్పించుకునేది. పిల్లలు ఉండగానే ఆ పని చేసేది. ఆ వచ్చిన డబ్బులతోనే వారిని చదివిస్తూ ఉన్నది. ఈ క్రమంలో ఇద్దరు యువకులు ఆమెను సంప్రదించారు. ఇద్దరితో ఒకేసారి కావాలి అనడం.. భారీ డీల్ కావడంతో ఆమె ఒప్పుకుంది. ఇదే సమయంలో ఆమె వారితో కలిసి మద్యం తాగింది. ఆ మద్యం కూడా విపరీతంగా తాగింది. తన నలుగురు పిల్లల్ని ఆ కారులో కూర్చోబెట్టి.. ఆ ఇద్దరి యువకులతో శృంగారం చేయడం మొదలుపెట్టింది. కదులుతున్న కారులో ఇద్దరు యువకులు ఆమెతో శృంగారం చేయసాగారు. ఇదే సమయంలో ఆ కారు కాన్పూర్ సరిహద్దుల్లోకి ప్రవేశించింది. అదుపుతప్పి డివైడర్ ను ఢీకొట్టింది. దీంతో స్థానికులు వెంటనే ఆ ప్రాంతానికి చేరుకున్నారు. కారులో నుంచి వారందరినీ బయటకు తీశారు. అందులో నుంచి నలుగురు పిల్లలు, ఇద్దరు యువకులు, ఆ మహిళ బయటికి వచ్చారు. పిల్లలకు ఏమి కాకపోయినప్పటికీ.. ఆ ఇద్దరు యువకులు, మహిళకు గాయాలయ్యాయి. వారు తీవ్రమైన మత్తులో ఉన్నారు. ఒంటిపై నూలు పోగు కూడా లేదు. దీంతో ఆ దృశ్యాలను చూసి స్థానికులు ముక్కున వేలేసుకున్నారు. ఇదే సమయంలో పోలీసులు అక్కడికి చేరుకున్నారు. వైద్య పరీక్షలు నిమిత్తం ఆ ముగ్గురిని స్థానికంగా ఉన్న ఆసుపత్రికి తరలించారు. ఆ తర్వాత తమ అదుపులోకి తీసుకున్నారు.

కాన్పూర్ ప్రాంతం పారిశ్రామికంగా అభివృద్ధి చెందింది. ఈ నగరంలో ఈ తరహా సంఘటనలు ఇంతవరకు చోటు చేసుకోలేదని పోలీసులు చెబుతున్నారు. పోలీసులు అదుపులోకి తీసుకున్న ఆ నలుగురు పిల్లల వయసు పది నుంచి 8 ఏళ్ల మధ్య ఉంటుందని చెబుతున్నారు. ఆ పిల్లలు మొత్తం ఆ మహిళ సంతానమని, తండ్రి గురించి ఆ పిల్లల్ని అడిగితే.. వారిని వదిలి వెళ్ళిపోయాడని చెప్పారని పోలీసులు అంటున్నారు. అయితే పిల్లల ముందు అటువంటి పని చేయడాన్ని అ మహిళ సమర్ధించుకుంటున్నది. ఇలా చేయడం తప్పు కదా అని పోలీసులు అంటే.. వారికే ఎదురు ప్రశ్నలు వేస్తోంది.. వైద్య పరీక్షల్లో వారు ముగ్గురు పీకల దాకా మద్యం తాగినట్టు, మాదకద్రవ్యాలు కూడా స్వీకరించినట్టు తేలింది. అయితే ఆ మహిళ సిగరెట్లకు బానిస అయిందని.. పోలీసులను కూడా సిగరెట్లు అడుగుతోందని స్థానికులు అంటున్నారు. మొత్తానికి ఈ ఘటన కాన్పూర్ నగరంలో సంచలనం సృష్టించింది. అయితే ఈ కేసు కు సంబంధించి దర్యాప్తు జరుపుతున్నామని.. పూర్తి వివరాలను త్వరలోనే తెలియజేస్తామని పోలీసులు చెబుతున్నారు. అయితే ఆ నలుగురు పిల్లల్ని ప్రస్తుతం ప్రభుత్వ ఆధీనంలో నడిచే శిశు గృహాలకు తరలించామని పోలీసులు అంటున్నారు.