Boyapati Srinu : యాక్షన్ చిత్రాల దర్శక దిగ్గజం బోయపాటి శ్రీను ‘అఖండ’తో అఖండమైన విజయాన్ని సాధించి ఫుల్ జోష్లో ఉన్నాడు. ప్రస్తుతం బోయపాటి శ్రీను రామ్ తో ఒక సినిమా చేస్తున్నాడు. అయితే, తాను తీసిన అఖండ సినిమా బాక్సాఫీస్ దగ్గర సునామీ కలెక్షన్లను రాబట్టింది. దాంతో స్టార్ హీరోలు బోయపాటికి పిలిచి మరీ ఛాన్స్ లు ఇవ్వడానికి రెడీగా ఉన్నారు.

కాగా తన తర్వాత సినిమాని రామ్ తో తీస్తున్నాడు. కాగా ఈ చిత్రానికి హీరో రామ్ కంటే ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్లు సమాచారం. శ్రీనివాస చిట్టూరి నిర్మించనున్న చిత్రానికి రామ్ రూ.9 కోట్లు తీసుకుంటే, బోయపాటి రూ.12 కోట్లు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రం తర్వాత బోయపాటి అల్లు అర్జున్తో సినిమా ప్లాన్ చేస్తున్నాడు.

మొత్తానికి, బోయపాటికి హీరో కంటే ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకోవడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయింది. రామ్ ప్రస్తుతం లింగుస్వామి దర్శకత్వంలో ‘ది వారియర్’ చేస్తున్నాడు. ఈ సినిమా కోసం రామ్ 12 కోట్లు తీసుకున్నాడు. అయితే, బోయపాటి సినిమా కోసం మాత్రం రామ్ తన రెమ్యునరేషన్ ను తగ్గించుకున్నట్లు తెలుస్తోంది.
మొత్తానికి రామ్ తో మూవీ ప్లాన్ చేస్తున్న బోయపాటి ? అంటూ ఓ వార్త తెగ హల్ చల్ చేస్తోంది. పైగా రామ్, ఎప్పటి నుండో మాస్ హీరోగా ఎలివేట్ అవ్వాలని ఆశ పడుతున్నాడు. కాకపోతే బోయపాటి రామ్ తో సినిమా చేయడానికి ఇంట్రెస్ట్ చూపించలేదు. అన్నట్టు బోయపాటి రామ్ కి ఒక కథ చెప్పాడు. కథ కూడా రామ్ కి బాగా నచ్చింది.
వీరిద్దరి కలయికలో సినిమా ఓకే అయిందని, త్వరలోనే అధికారిక ప్రకటన రానుందని వార్తలు వచ్చాయి. ఏది ఏమైనా అఖండ సినిమా రికార్డు కలెక్షన్స్ దక్కించుకోవడం, బోయపాటికి తిరుగులేకుండా పోయింది. ‘అఖండ’ సినిమా అత్యంత ప్రతిష్టాత్మకంగా భారీ అంచనాలతో వచ్చి మొదటి రోజు నుంచి బాక్సాఫీస్ దగ్గర సునామీ కలెక్షన్లను రాబట్టింది.