అరె.. పెద్ద మనసు చాటుకున్న బాలయ్య !

నట సింహం నందమూరి బాలకృష్ణది చిన్న పిల్లల మనస్తత్వం అయినప్పటికీ, ఆయన మనసు మాత్రం స్వచ్ఛమైన వెన్న లాంటిది అని చెబుతూ ఉంటారు ఇండస్ట్రీలో. ఎవరైనా ఆపదలో ఉన్నారని తెలిస్తే చాలు, వాళ్ళు తనను సాయం చేయమని అడగకపోయినా.. బాలయ్య వెంటనే వారికి సాయం చేస్తారని, ఆయనలో సేవా గుణం ఎక్కువ అని టాక్ ఉంది. దానికి తగ్గట్లుగానే బాలయ్య బాబు కూడా ఎప్పటికప్పుడు తన సేవను ప్రదర్శిస్తూనే ఉన్నారు. తాజాగా ఎంతో మందికి మేలు చేసే […]

Written By: admin, Updated On : May 21, 2021 6:32 pm
Follow us on


నట సింహం నందమూరి బాలకృష్ణది చిన్న పిల్లల మనస్తత్వం అయినప్పటికీ, ఆయన మనసు మాత్రం స్వచ్ఛమైన వెన్న లాంటిది అని చెబుతూ ఉంటారు ఇండస్ట్రీలో. ఎవరైనా ఆపదలో ఉన్నారని తెలిస్తే చాలు, వాళ్ళు తనను సాయం చేయమని అడగకపోయినా.. బాలయ్య వెంటనే వారికి సాయం చేస్తారని, ఆయనలో సేవా గుణం ఎక్కువ అని టాక్ ఉంది.

దానికి తగ్గట్లుగానే బాలయ్య బాబు కూడా ఎప్పటికప్పుడు తన సేవను ప్రదర్శిస్తూనే ఉన్నారు. తాజాగా ఎంతో మందికి మేలు చేసే పని చేసి, తన పెద్ద మనసును చాటుకున్నారు. కరోనా వచ్చినప్పటి నుండి బాలయ్య పలు సేవా కార్యక్రమాలు చేస్తూనే ఉన్నారు. సెకెండ్ వేవ్ వచ్చిన తరువాత కూడా కరోనా రోగులకు అండగా 20 లక్షలు ఖర్చు పెట్టి పేదలకు మెడిసిన్ తో పాటు మెడికల్ సదుపాయాలను సమకూర్చాడు.

మళ్ళీ తాజాగా తన నియోజకవర్గ ప్రజలలో కొంతమంది కరోనా సోకి బెడ్స్ దొరకక ఇబ్బందులు పడుతుంటే, ఆ కరోనా రోగుల కోసం హిందీ పూర్ లోని తన గెస్ట్ హౌస్ లో బెడ్స్ ను ఏర్పాటు చేసి, వారికి వైద్యం చేయిస్తున్నాడు. ప్రస్తుతం హిందూపురం నియోజకవర్గం ప్రజలలో ఎవరికీ కరోనా సోకినా, వారికీ అండగా నిలబడుతున్నాడు బాలయ్య. ప్రతి ఎమ్మెల్యే బాలయ్య బాబులా సేవ చేస్తే..

ఇక వైద్యం అందక చనిపోయే కరోనా పేషంటే ఉండడేమో. మొత్తానికి బాలయ్య చేస్తోన్న సేవ కార్యక్రమాలు గురించి తెలిసి, బాలయ్య అభిమానులతో పాటు సాధారణ ప్రేక్షకులు కూడా సోషల్ మీడియాలో తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తూ బాలయ్యను పొగుడుతూ కామెంట్స్ పెడుతున్నారు. ఇక ప్రస్తుతం బాలకృష్ణ హీరోగా ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా దర్శకుడు బోయపాటి కాంబోలో “అఖండ” అనే చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే.