https://oktelugu.com/

డ్రగ్స్ కేసులో టాలీవుడ్ నటి అరెస్టు

టాలీవుడ్ పరిశ్రమను డ్రగ్స్ కేసులు వెంటాడుతున్నాయి. తాజాగా ముంబైలోని ప్రముఖ హోటల్ లో డ్రగ్స్ దందా నడుస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో ఆ హోటల్ పై పోలీసులు రైడ్ చేయగా టాలీవుడ్ నటిని గుర్తించారు. ఆమెతో పాటు చాంద్ మహ్మద్ అనే వ్యక్తిని కూడా అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 400 గ్రాముల సరుకును అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దీని ధర రూ.8 నుంచి రూ.10 లక్షల వరకు ఉంటుందని అంచనా వేశారు. కాగా […]

Written By: , Updated On : January 3, 2021 / 09:12 PM IST
Tollywood drug case

Tollywood drug case

Follow us on

Tollywood drug case

టాలీవుడ్ పరిశ్రమను డ్రగ్స్ కేసులు వెంటాడుతున్నాయి. తాజాగా ముంబైలోని ప్రముఖ హోటల్ లో డ్రగ్స్ దందా నడుస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో ఆ హోటల్ పై పోలీసులు రైడ్ చేయగా టాలీవుడ్ నటిని గుర్తించారు. ఆమెతో పాటు చాంద్ మహ్మద్ అనే వ్యక్తిని కూడా అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 400 గ్రాముల సరుకును అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దీని ధర రూ.8 నుంచి రూ.10 లక్షల వరకు ఉంటుందని అంచనా వేశారు. కాగా ఇప్పటికే డ్రగ్స్ కేసులో రకుల్ ప్రీత్ సింగ్ విచారణను ఎదుర్కొన్నారు. గతంలో పలువురు నటులు సైతం విచారణకు హాజరయ్యారు. తాజాగా నటి అరెస్టు కావడంతో టాలీవుడ్ పరిశ్రమలో కలకలం రేపింది.