Homeబిజినెస్UPI transactions dropped: యూపీఐ లావాదేవీలు దేశంలో ఎందుకు పడిపోయాయి? ఏమైంది?

UPI transactions dropped: యూపీఐ లావాదేవీలు దేశంలో ఎందుకు పడిపోయాయి? ఏమైంది?

UPI transactions dropped: కేంద్రంలో ఆగస్టు 22 నుంచి దేశంలో ఆన్‌లైన్‌ గేమ్స్‌ నిషేధించింది. రియల్‌ మనీ గేమింగ్‌ (ఆర్‌ఎంజీ) నిషేధం ప్రభావం డిజిటల్‌ చెల్లింపులపై పడింది. నేషనల్‌ పేమెంట్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎన్‌పీసీఐ) డేటా ప్రకారం, ఆగస్టులో యూపీఐ లావాదేవీల విలువ రూ.2,500 కోట్లు తగ్గింది. ఇది గేమింగ్‌ లావాదేవీలలో 25% క్షీణతను సూచిస్తుంది. జూలైలో రూ.25.08 లక్షల కోట్లుగా ఉన్న మొత్తం యూపీఐ లావాదేవీల విలువ ఆగస్టులో 24.85 లక్షల కోట్లకు పడిపోయింది. […]

UPI transactions dropped: కేంద్రంలో ఆగస్టు 22 నుంచి దేశంలో ఆన్‌లైన్‌ గేమ్స్‌ నిషేధించింది. రియల్‌ మనీ గేమింగ్‌ (ఆర్‌ఎంజీ) నిషేధం ప్రభావం డిజిటల్‌ చెల్లింపులపై పడింది. నేషనల్‌ పేమెంట్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎన్‌పీసీఐ) డేటా ప్రకారం, ఆగస్టులో యూపీఐ లావాదేవీల విలువ రూ.2,500 కోట్లు తగ్గింది. ఇది గేమింగ్‌ లావాదేవీలలో 25% క్షీణతను సూచిస్తుంది. జూలైలో రూ.25.08 లక్షల కోట్లుగా ఉన్న మొత్తం యూపీఐ లావాదేవీల విలువ ఆగస్టులో 24.85 లక్షల కోట్లకు పడిపోయింది. ఈ నిషేధం ఆన్‌లైన్‌ గేమింగ్‌ ప్లాట్‌ఫామ్‌లలో భారీ ఆర్థిక లావాదేవీలను సూచిస్తుంది.

గేమింగ్‌ బ్యాన్‌..
ప్రమోషన్‌ అండ్‌ రెగ్యులేషన్‌ ఆఫ్‌ ఆన్‌లైన్‌ గేమింగ్‌ బిల్, 2025, ఆగస్టు 22న రాష్ట్రపతి ఆమోదంతో చట్టంగా మారింది. ఈ చట్టం రియల్‌ మనీ గేమింగ్‌ను నిషేధించడంతో, డ్రీమ్‌ 11, మొబైల్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఎంపీఎల్‌), జూపీ వంటి ప్రముఖ ప్లాట్‌ఫామ్‌లు తమ రియల్‌ మనీ ఆధారిత సేవలను తక్షణమే నిలిపివేశాయి. ఈ సంస్థలు ఉచిత గేమింగ్, ఈ–స్పోర్ట్స్‌పై దృష్టి సారించేందుకు మార్పులు చేస్తున్నాయి. ఈ నిషేధం కేవలం 9 రోజులలోనే గేమింగ్‌ లావాదేవీలలో గణనీయమైన క్షీణతను తెచ్చింది, ఇది ఈ రంగం రియల్‌ మనీ గేమ్‌లపై ఎంతగా ఆధారపడి ఉందో స్పష్టం చేస్తుంది.

యూపీఐ లావాదేవీలపై ప్రభావం..
ఎన్‌పీసీఐ డేటా ప్రకారం, ఆగస్టులో గేమింగ్‌ విభాగంలో యూపీఐ లావాదేవీలు 351 మిలియన్‌ నుంచి 271 మిలియన్‌కు, విలువలో రూ.10,076 కోట్ల నుంచి రూ.7,441 కోట్లకు పడిపోయాయి. రియల్‌ మనీ గేమింగ్‌ వాలెట్‌ లోడింగ్‌లో 90% కంటే ఎక్కువ యూపీఐ ద్వారా జరిగేది, నెలవారీ రూ.10 వేల కోట్లకు పైగా లావాదేవీలు ఉండేవి. ఈ నిషేధం వల్ల నెలవారీ 25 కోట్ల లావాదేవీలు, సుమారు రూ.5,040 కోట్ల విలువ తగ్గుముఖం పట్టవచ్చని అంచనా. ఈ గణనీయమైన తగ్గుదల రియల్‌ మనీ గేమింగ్‌ రంగం డిజిటల్‌ చెల్లింపులలో కీలక పాత్ర పోషించినట్లు సూచిస్తుంది.

Also Read: దేశమా, మతమా ఏది ముఖ్యం అంబేద్కర్ ఏం చెప్పాడు?

వ్యసనంగా గేమింగ్‌..
ప్రభుత్వం ఈ నిషేధాన్ని అమలు చేయడానికి ప్రధాన కారణం రియల్‌ మనీ గేమింగ్‌ వల్ల కలిగే అడిక్షన్‌. ఆర్థిక నష్టాలు, సామాజిక ఒత్తిళ్లు. సుమారు 450 మిలియన్‌ మంది ఈ ప్లాట్‌ఫామ్‌లలో భాగమై, సంవత్సరానికి రూ.20 వేల కోట్ల నష్టాలను చవిచూసినట్లు ప్రభుత్వం పేర్కొంది. చిన్న మొత్తాల్లో(సగటున రూ.20) లావాదేవీలు జరిగినప్పటికీ, ఈ గేమ్‌లపై ఆధారపడిన వినియోగదారుల సంఖ్య గేమింగ్‌ అడిక్షన్‌ను స్పష్టం చేస్తుంది. ఈ నిషేధం ఈ సమస్యలను అరికట్టేందుకు ఉద్దేశించినప్పటికీ, వినియోగదారులు అంతర్జాతీయ బెట్టింగ్‌ సైట్ల వైపు మళ్లే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

రియల్‌ మనీ గేమింగ్‌ రంగం సంవత్సరానికి రూ.31 వేల కోట్ల ఆదాయాన్ని ఆర్జించి, రూ.20 వేల కోట్ల పన్నులను చెల్లించింది. ఈ నిషేధం వల్ల ప్రభుత్వానికి గణనీయమైన జీఎస్టీ, టీడీఎస్‌ ఆదాయ నష్టం ఏర్పడవచ్చు. అదనంగా, ఈ రంగం 2–4 లక్షల ఉద్యోగాలు ప్రమాదంలో ఉన్నాయి. పేమెంట్‌ గేట్‌వే సంస్థలైన రేజర్‌పే, పేయూ, క్యాష్‌ఫ్రీ వంటివి 15% ఆదాయ నష్టాన్ని ఎదుర్కొనే అవకాశం ఉంది. ఈ నిషేధం డిజిటల్‌ చెల్లింపుల రంగంతోపాటు ప్రకటనలు, కంటెంట్‌ క్రియేషన్, స్పాన్సర్‌షిప్‌లపై కూడా ప్రభావం చూపనుంది.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

Related News

Most Popular

Oktelugu Epaper