Homeబిజినెస్TVS iQube electric scooter: ఒక్కసారి చార్జింగ్ చేస్తే 445 కిలోమీటర్ల మైలేజ్.. ఈ స్కూటర్...

TVS iQube electric scooter: ఒక్కసారి చార్జింగ్ చేస్తే 445 కిలోమీటర్ల మైలేజ్.. ఈ స్కూటర్ గురించి వెంటనే తెలుసుకోండి..

TVS iQube electric scooter: పట్టణ, నగరాల్లో ఉండేవారి జీవనశైలి ఇప్పుడు మారిపోయింది. ఒకప్పుడు బైక్స్ కొనేవారు ఇప్పుడు స్కూటర్లను కొనుగోలు చేయడంలో ఆసక్తి చూపుతున్నారు. చిన్నచిన్న అవసరాలకు తోపాటు తక్కువ దూరం ప్రయాణించాలని అనుకునేవారు స్కూటర్లు తమకు అనుకూలంగా ఉంటాయని భావిస్తున్నారు. వీరి డిమాండర్ దృష్టిలో ఉంచుకొని కొన్ని కంపెనీలు సైతం నేటితరం వినియోగదారులను ఆకట్టుకునే విధంగా పర్యావరణానికి అనుకూలమైన ఎలక్ట్రిక్ స్కూటర్లను అందుబాటులోకి తీసుకువస్తున్నాయి. అయితే వీటిలోనూ మంచి కంపెనీకి చెందిన స్కూటీలను కొనుగోలు చేయాలని చూస్తున్నా వారికి TVS కంపెనీ అద్భుతమైన అవకాశాన్ని అందించింది. ఈ కంపెనీకి చెందిన ఓ స్కూటర్ ఒక్కసారి చార్జింగ్ చేస్తే 445 కిలోమీటర్ల మైలేజ్ ని అందిస్తుంది. ఇంతకీ ఆ స్కూటర్ ఏది? దాని వివరాల్లోకి వెళితే..

2026 ఏడాదిలో కొత్త స్కూటర్లను తీసుకురావాలని లక్ష్యాల్ని పెట్టుకున్న టీవీఎస్ కంపెనీ.. iQube అనే మోడల్ ను అప్డేట్ చేస్తూ తీసుకురావాలని నిర్ణయించుకుంది. ఇది గతంలో కంటే ఇప్పుడు టెక్నాలజీ తో పాటు బ్యాటరీ పవర్ లో కూడా మెరుగైన సామర్థ్యాన్ని పొందే అవకాశం ఉంటుంది. అలాగే ఇందులో ఆకట్టుకునే స్మార్ట్ ఫీచర్లు కూడా ఉండనున్నాయి. ఇందులో భాగంగా ఈ స్కూటర్లో 4.4 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ ను ఉంచనున్నారు. దీనిని ఒక్కసారి చార్జింగ్ చేస్తే 445 కిలోమీటర్ల వరకు మైలేజ్ అందిస్తుంది. అలాగే గంటకు 78 కిలోమీటర్ల వేగంతో ప్రయాణం చేస్తుంది. మైలేజ్ విషయంలో ప్రత్యేక ప్లాన్ ఉన్నవారికి ఇది బాగా సపోర్ట్ గా ఉంటుంది.

టీవీఎస్ ఐక్యూట్ కొత్త స్కూటర్ నగరాల్లో ప్రయాణించే వారికి అనుగుణంగా ఉంటుంది. ఎందుకంటే దీనిపై డ్రైవ్ చేసేవారు స్మార్ట్ లుక్ తో కనిపిస్తారు. సొగసైనా బాడీతో పాటు దీని నిర్మాణం ప్రత్యేకంగా ఉండనుంది. అలాగే స్మూత్ డ్రైవింగ్ ఉండటంతో దీనిపై ప్రయాణం చేసే సమయంలో ప్రత్యేక అనుభూతి కలుగుతుంది. ఈ స్కూటర్లో స్మార్ట్ ఫీచర్లు ఆకట్టుకొని ఉన్నాయి. ఇందులో TTF డిస్ప్లే నువ్వు చూడొచ్చు. ఇది తక్కువ నిర్వహణ కూడా ఉండనుంది. అలాగే దీనిని రూ.65,000 ప్రారంభ ధరతో విక్రయించడంతో మధ్యతరగతి ప్రజలకు బడ్జెట్ స్కూటర్ గా పేర్కొంటున్నారు. ఈ మొత్తాన్ని ఒకేసారి కాకుండా ఈ అమ్మాయి ద్వారా కూడా చెల్లించేందుకు అవకాశం ఉంది.

ప్రస్తుత కాలంలో పెట్రోల్ ధరలు పెరగడంతో పాటు పర్యావరణ కాలుష్యం విపరీతంగా ఉన్న సమయంలో టీవీఎస్ కు చెందిన ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ వినియోగదారులకు సపోర్టుగా ఉండనుంది. అలాగే ఈ స్కూటర్ చార్జింగ్ చేయడానికి అన్ని విధాలుగా సహకరిస్తుంది. ప్రతిసారి చార్జింగ్ చేయకుండా ఒకసారి చార్జింగ్ చేస్తే ఎక్కువ మైలేజ్ ఇచ్చే అవకాశం ఉన్నందున రోజువారి వినియోగదారులకు సపోర్ట్ గా ఉంటుంది.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version