Homeప్రవాస భారతీయులుPeacock Restaurant Riyadh Branch: కరీంనగర్ నుంచి రియాద్...అంతర్జాతీయ మార్కెట్‌లోకి మన రుచులు

Peacock Restaurant Riyadh Branch: కరీంనగర్ నుంచి రియాద్…అంతర్జాతీయ మార్కెట్‌లోకి మన రుచులు

Peacock Restaurant Riyadh Branch: కరీంనగర్‌ అనగానే ఒకప్పుడు మావోయిస్టుల అడ్డాగా, ఉద్యమాల గడ్డగా గుర్తుకువచ్చేది. తర్వాత తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర పోరాటానికి కేంద్రంగా మారింది. ప్రత్యేక రాష్ట్ర ఆవిర్భావం తర్వాత నగరం వేగంగా అభివృద్ధి చెందుతోంది. ముఖ్యంగా ఇక్కడ హోటళ్లు, రెస్టారెంట్లు.. నగర వాసులకు భిన్న రుచులు అందిస్తున్నాయి. ఈ క్రమంలో కరీంనగర్, హైదరాబాదీ రుచులు ఇప్పుడు విదేశీయులకు అందబోతున్నాయి. కరీంనగర్‌కు చెందిన ప్రముఖ రెస్టారెంట్‌ పీకాక్, సౌదీ అరేబియా రాజధాని రియాద్‌లో తన తొలి అంతర్జాతీయ శాఖను ప్రారంభించింది. ఈ కొత్త శాఖ సంప్రదాయ భారతీయ రుచులను సౌదీలోని భారతీయ ప్రవాసులతోపాటు స్థానికులకు అందించడమే కాక, భారతీయ సంస్కృతిని ప్రోత్సహించడంలోనూ కీలక పాత్ర పోషిస్తోంది. రియాద్‌లోని అల్‌–మలాజ్‌ ప్రాంతంలో ఆగస్టు 8, 2025న ప్రారంభమైన పీకాక్‌ రెస్టారెంట్, సంప్రదాయ హైదరాబాదీ వంటకాలను సౌదీ రాజధానికి తీసుకొచ్చింది. ఈ శాఖ ప్రారంభోత్సవానికి సౌదీ అరేబియాలోని భారత రాయబారి డాక్టర్‌ సుహెల్‌ ఖాన్‌ హాజరై, ఈ సందర్భాన్ని ప్రత్యేకంగా గుర్తించారు. భారతీయ ప్రవాసులతోపాటు సౌదీ స్థానికులు కూడా ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Also Read: పులివెందుల ఉప ఎన్నిక.. 442 ఓట్లు దాటితే చాలు.. చంద్రబాబు పెద్ద ప్లాన్!

రెండు దశాబ్దాలుగా హోటల్‌ రంగంలో..
1996లో కరీంనగర్‌లో మొహమ్మద్‌ అఖ్తర్‌ అలీ పీకాక్‌ రెస్టారెంట్‌ స్థాపించారు. హైదరాబాదీ వంటకాల ప్రామాణికత, ఆతిథ్యంతో ప్రసిద్ధి చెందింది. రియాద్‌ శాఖ భారతీయ, ఇండో–చైనీస్, తందూరీ, కాంటినెంటల్‌ వంటకాలతో పాటు సంప్రదాయ స్వీట్లు మరియు స్నాక్స్‌ను అందిస్తోంది. ఈ వైవిధ్యమైన మెనూ భారతీయ సంస్కృతిని సౌదీ సమాజానికి పరిచయం చేయడంలో సహాయపడుతుంది. భారత రాయబార కార్యాలయం ఈ రెస్టారెంట్‌ను భారతీయ సంస్కృతిని ప్రోత్సహించే, ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేసే వేదికగా గుర్తించింది.

రియాద్‌ ఎంపిక వెనుక కారణాలు..
పీకాక్‌ గ్రూప్‌ ఆఫ్‌ హోటల్స్‌ అండ్‌ రెస్టారెంట్స్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ మొహమ్మద్‌ అస్గర్‌ అలీ ప్రకారం, రియాద్‌లో వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వాతావరణం, ప్రామాణిక హైదరాబాదీ వంటకాల కోసం ఉన్న డిమాండ్‌ ఈ నగరాన్ని ఎంపిక చేయడానికి కారణం. ‘‘అనేక మంది అతిథులు హైదరాబాదీ రుచులను కోల్పోతున్నారు. మా లక్ష్యం ప్రామాణిక రుచులను అందించడం మరియు సౌకర్యవంతమైన వాతావరణాన్ని సృష్టించడం’’ అని అస్గర్‌ తెలిపారు. ఈ రెస్టారెంట్‌ భారతీయ ప్రవాసులకు సొంత ఇంటి రుచులను అందించడంతోపాటు స్థానికులకు కొత్త రుచి అనుభవాన్ని అందిస్తోంది.

100 మంది డైనర్లకు సీటింగ్‌ సామర్థ్యం, అదనంగా 120 మందికి బ్యాంకెట్‌ హాల్‌తో, పీకాక్‌ రెస్టారెంట్‌ కుటుంబాలు, సామాజిక కార్యక్రమాలకు అనువైన స్థలంగా ఉంది. ఈ సౌకర్యాలు రియాద్‌లోని విభిన్న ఆహార సంస్కృతికి హైదరాబాదీ వారసత్వాన్ని జోడిస్తాయి. అలాగే భారతీయ వంటకాల శ్రేష్ఠతను ప్రదర్శిస్తాయి.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
RELATED ARTICLES

Most Popular