Homeబిజినెస్India Cements : టేకోవర్‌ ఎఫెక్ట్‌.. ఇండియా సిమెంట్స్‌ నుంచి శ్రీనివాసన్‌ నిష్క్రమణ.. కారణం ఏంటంటే..?

India Cements : టేకోవర్‌ ఎఫెక్ట్‌.. ఇండియా సిమెంట్స్‌ నుంచి శ్రీనివాసన్‌ నిష్క్రమణ.. కారణం ఏంటంటే..?

India Cements : దేశంలోని ప్రముఖ సిమెంటు పరిశ్రమ అయిన ఇండియా సిమెంట్స్‌లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ సంస్థను ఆదిత్య బిర్లా గ్రూపు కొనుగోలు చేసింది. దీంతో మొన్నటి వరకు అల్ట్రాటెక్‌కు అనుబంధ సంస్థా ఉన్న ఇండియా సిమెంట్స్‌ ఇప్పుడు బిర్లా అనుబంధ సంస్థగా మారింది. దీంతో ఇండియా సిమెంట్స్‌ వైస్‌ చైర్మన్‌ – ఎండీ పదవికి ఎన్‌ శ్రీనివాసన్‌ బుధవారం(డిసెంబర్‌ 25న) రాజీనామా చేశారు. ఆయన సీఎంగా కూడా ఆగిపోతారు. అతని కుమార్తె రూపా గురునాథ్, భార్య చిత్రా శ్రీనివాసన్‌ కూడా వరుసగా హోల్‌టైమ్‌ డైరెక్టర్‌ మరియు నాన్‌–ఇండిపెండెంట్‌ డైరెక్టర్‌గా తమ రాజీనామాలను సమర్పించారు.

చరిత్ర ఇదీ..
1946లో స్వాతంత్య్రానికి ఒక సంవత్సరం ముందు తన తండ్రి టీఎస్‌.నారాయణస్వామి సహ–స్థాపన చేసిన ఇండియా సిమెంట్స్‌తో శ్రీనివాసన్‌ యొక్క 50 ఏళ్ల అనుబంధానికి ఇది తెర పడిపోయింది. మరొక సహ వ్యవస్థాపకుడు ఎస్‌ఎన్‌ఎన్‌.శంకరలింగ అయ్యర్‌. వారి ఒకేలాంటి రాజీనామా లేఖలలో, శ్రీనివాసన్‌ అతని కుటుంబ సభ్యులు ఉద్యోగులకు కృతజ్ఞతలు తెలిపారు. కొత్త మేనేజ్‌మెంట్‌కు శుభాకాంక్షలు తెలియజేశారు. 1968లో తన తండ్రి మరణించిన వెంటనే ఇండియా సిమెంట్స్‌లో చేరిన శ్రీనివాసన్‌ 1979లో కో–ప్రమోటర్లతో తన పోరాటంలో తారాస్థాయికి చేరుకున్నప్పుడు బోర్డు నుంచి తొలగించబడ్డాడు. అయినప్పటికీ, అతను తిరిగి వచ్చాడు. 1989, సెప్టెంబరులో మేనేజింగ్‌ డైరెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించాడు. కంపెనీ 1989లో సంవత్సరానికి 1.3 మిలియన్‌ టన్నుల సామర్థ్యం కలిగిన రెండు ప్లాంట్ల నుంచి∙తమిళనాడు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో 10 సిమెంట్‌ ప్లాంట్‌లుగా విస్తరించింది. 15.5 మిలియన్‌ టన్నుల సామర్థ్యంతో రాజస్థాన్‌. 2002–03లో రూ. 1,033 కోట్ల నుంచి టర్నోవర్‌లో ఐదు రెట్లు పెరిగి ఎఫ్‌వై 24లో రూ. 5,112 కోట్ల టర్నోవర్‌ను ఆయన నాయకత్వంలో సాధించింది.

ఆర్థికమస్యలు..
అయితే, దక్షిణ భారతదేశంలోని అతిపెద్ద సిమెంట్‌ తయారీదారులలో ఒకటైన కంపెనీ ఇటీవలి త్రైమాసికాల్లో ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటోంది. ఈ ఏడాది జూలైలో, భారతదేశపు అతిపెద్ద నిర్మాణ సామగ్రి తయారీదారు బిర్లా శ్రీనివాసన్‌ మరియు అతని కుటుంబంతో వారి సిమెంట్‌ వ్యాపారాన్ని రూ. 3,954 కోట్లకు కొనుగోలు చేసేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారు.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
RELATED ARTICLES

Most Popular