spot_img
Homeబిజినెస్Hyundai IPO: నేడు హ్యుందాయ్ ఐపీఓ ప్రారంభం.. కచ్చితంగా తెలుసుకోవాల్సిన విషయాలివే

Hyundai IPO: నేడు హ్యుందాయ్ ఐపీఓ ప్రారంభం.. కచ్చితంగా తెలుసుకోవాల్సిన విషయాలివే

Hyundai IPO: దక్షిణ కొరియా ఆటోమొబైల్ తయారీదారు హ్యుందాయ్ మోటార్ ఇండియా ఐపీవో (ప్రారంభ పబ్లిక్ ఆఫర్) సబ్‌స్క్రిప్షన్ ఈరోజు 15 అక్టోబర్ 2024న పెట్టుబడిదారుల కోసం తెరవబడుతుంది. దాని ఐపీవో గ్రే మార్కెట్‌లో ప్రకంపనలు సృష్టించింది. సాధారణ పెట్టుబడిదారుల కోసం ఐపీవో సబ్‌స్క్రిప్షన్ తెరవడానికి ముందు, ఆటోమోటివ్ కంపెనీ యాంకర్ ఇన్వెస్టర్ల నుండి సుమారు రూ. 8,315 కోట్లను సేకరించింది. హ్యుందాయ్ మోటార్ ఇండియా ఐపీవో సబ్‌స్క్రిప్షన్ 17 అక్టోబర్ 2024న ముగుస్తుంది. సాధారణ పెట్టుబడిదారులు ఈ రెండు రోజుల్లో మాత్రమే దాని షేర్లలో డబ్బును పెట్టుబడి పెట్టగలరు. ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే, సాధారణ పెట్టుబడిదారుడు కంపెనీ షేర్లను కొనుగోలు చేసి సుమారు రూ. 27,870 కోట్ల ఐపీవోలో డబ్బును పెట్టుబడి పెట్టాలా.. పెడితే లాభాలు వస్తాయా ? బ్రోకరేజ్ సంస్థలు, మార్కెట్ నిపుణులు ఏమి చెబుతున్నారో తెలుసుకుందాం .?

హ్యుందాయ్ మోటార్ ఇండియా ఐపీవో ప్రైస్ బ్యాండ్
హ్యుందాయ్ మోటార్ ఇండియా ఐపీవో ధర బ్యాండ్ రూ. 1865-1960గా నిర్ణయించబడింది. ఇష్యూ ధర ప్రకారం.. హ్యుందాయ్ మోటార్ ఇండియా మార్కెట్ విలువ సుమారు 19 బిలియన్ డాలర్లు. ఈ మార్కెట్ వాల్యుయేషన్ ఆటోమోటివ్ కంపెనీ మాతృ సంస్థ హ్యుందాయ్ మోటార్ కంటే చాలా ఎక్కువ. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, హ్యుందాయ్ మోటార్ ఇండియా షేర్ల ధర ఆదాయ నిష్పత్తి దాని మాతృ సంస్థ హ్యుందాయ్ మోటార్ కంటే ఎక్కువగా ఉంది. బ్రోకరేజ్ సంస్థ ఈక్విటాస్ ఇన్వెస్ట్‌మెంట్ నివేదిక ప్రకారం.. హ్యుందాయ్ మోటార్ ఇండియా ధరల సంపాదన నిష్పత్తి 27 రెట్లు… అయితే దక్షిణ కొరియాలో ఉన్న దాని మాతృ సంస్థ హ్యుందాయ్ మోటార్ ధర ఆదాయ నిష్పత్తి 5 రెట్లు మాత్రమే. స్టాక్ మార్కెట్‌లో లిస్ట్ అయిన తర్వాత, హ్యుందాయ్ మోటార్ ఇండియా మార్కెట్ క్యాపిటలైజేషన్ అంటే దాని మాతృ సంస్థలో 42 శాతానికి సమానంగా ఉంటుంది. భారతదేశంలో హ్యుందాయ్ మోటార్ ఇండియా పురోగతికి అవకాశాలు అపారంగా ఉన్నాయని హ్యుందాయ్ మోటార్ ఇండియా చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ (CFO) తరుణ్ గార్గ్ చెప్పారు.

భారతదేశపు అతిపెద్ద ఐపీవో
హ్యుందాయ్ మోటార్ ఇండియా ఐపీవో భారతదేశపు అతిపెద్ద ఐపీవో. దీని పరిమాణం రూ.27,870 కోట్లు. అంతకుముందు, లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్‌ఐసి) సుమారు రూ. 22,000 కోట్ల ఐపీవోను ప్రారంభించింది, ఇది ఆ సమయంలో అతిపెద్ద ఐపీవో. హ్యుందాయ్ మోటార్ ఇండియా మాతృ సంస్థ 14.2 కోట్ల షేర్లను విక్రయిస్తోంది. ఈ ఐపీవో నుండి సేకరించిన మొత్తం దక్షిణ కొరియాలో ఉన్న హ్యుందాయ్ మోటార్ ఖాతాకు వెళ్తుంది. భారతదేశంలో కార్యకలాపాలను విస్తరించడానికి కంపెనీ ఈ మొత్తాన్ని ఉపయోగించదు.

రూ.8,315 కోట్లు సమీకరణ
ఐపీవో సబ్‌స్క్రిప్షన్ ప్రారంభానికి ముందు, హ్యుందాయ్ మోటార్ ఇండియా తన యాంకర్ పెట్టుబడిదారుల నుండి సోమవారం, అక్టోబర్ 14, 2024 నాడు రూ. 8,315 కోట్లను సేకరించింది. బీఎస్ ఈ వెబ్‌సైట్‌లో ఇచ్చిన సమాచారం ప్రకారం. న్యూ వరల్డ్ ఫండ్ ఇంక్., సింగపూర్ ప్రభుత్వం, ఫిడిలిటీ ఫండ్స్, బ్లాక్‌రాక్ గ్లోబల్ ఫండ్స్, జేపీ మోర్గాన్ ఫండ్స్, హెచ్ డీఎఫ్ సీ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ, ఎస్ బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ వంటి కంపెనీలు పెద్ద పెట్టుబడిదారులుగా ఉన్నాయి. వాటికి వాటాలు కేటాయించబడ్డాయి. ఎస్ ఐసీ రూ. 21,000 కోట్ల ఐపీవోను అధిగమించి ఇది భారతదేశపు అతిపెద్ద ఐపీవో అవుతుంది.

బ్రోకరేజ్ సంస్థల అభిప్రాయం ఏమిటి ?
దేశంలోని చాలా బ్రోకరేజీ సంస్థలు హ్యుందాయ్ మోటార్ ఇండియా ఐపీవోకి ‘సబ్‌స్క్రైబ్’ చేసుకోవాలని సలహా ఇస్తున్నాయి. బలమైన వృద్ధి అవకాశాలు, బలమైన ఆర్థిక స్థితి , మంచి ఎస్ యూవీ ఉత్పత్తి కారణంగా కంపెనీ ఐపీవో పెట్టుబడిదారుల నుండి మద్దతు పొందుతుందని బ్రోకరేజ్ సంస్థలు భావిస్తున్నాయి. ఈ ఐపీవో నుండి పరిమిత లిస్టింగ్ లాభాన్ని ఆశిస్తున్నామని ఐసీఐసీఐ సెక్యూరిటీ తెలిపింది. అయితే, లిస్టింగ్ తర్వాత, ఈ స్టాక్ మధ్య నుండి దీర్ఘకాలంలో రెండంకెల రాబడిని ఇవ్వగలదని భావిస్తున్నారు. ఎస్ బీఐ సెక్యూరిటీస్ ఈ ఐపీవో కి ‘లాంగ్ టర్మ్ కోసం సబ్స్క్రయిబ్’ రేటింగ్‌ను కూడా ఇచ్చింది. హ్యుందాయ్ మోటార్ ఇండియా ఐపీవోలో డబ్బును పెట్టుబడి పెట్టమని సలహా ఇచ్చింది.

Mahi
Mahihttp://oktelugu.com
Mahendra is a Senior Political Content writer who has very good knowledge on Business stories. He is a senior journalist with good command on writing articles with good narative.
RELATED ARTICLES

Most Popular