ఈ వెబ్ సైట్ లో పేర్లను నమోదు చేసుకోవడం ద్వారా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రస్తుతం అమలు చేస్తునన్ సంక్షేమ పథకాల బెనిఫిట్స్ ను పొందే అవకాశం ఉంటుంది. ప్రమాదవశాత్తు మరణిస్తే 2 లక్షల రూపాయల ఉచిత ప్రమాద బీమా పొందే అవకాశాలు ఉంటాయి. ప్రమాదంలో అంగవైకల్యం బారిన పడినా కూడా లక్ష రూపాయలు పొందే అవకాశం అయితే ఉంటుంది. ఎలాంటి డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేకుండా ఈ బెనిఫిట్స్ ను పొందవచ్చు.
ఇశ్రమ్ పోర్టల్లోకి వెళ్లి లాగిన్ కావడం ద్వారా ఈ బెనిఫిట్స్ ను పొందే అవకాశం అయితే ఉంటుంది. ఆధార్ నెంబర్, బ్యాంక్ అకౌంట్, ఆధార్ లింక్డ్ మొబైల్ నెంబర్ వివరాలను అందజేయడం ద్వారా స్కీమ్ యొక్క బెనిఫిట్స్ ను పొందే అవకాశం అయితే ఉంటుంది. ఈ వెబ్ సైట్ లో రిజిస్ట్రేషన్ పూర్తైన తర్వాత యూఏఎన్ నంబర్ ను సులభంగా పొందే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు.
ఈ స్కీమ్ లో చేరని సంఘటిత కార్మికులు వెంటనే రిజిష్టర్ చేయించుకుంటే మంచిది. అసంఘటిత కార్మికులకు ప్రయోజనం కేంద్రం కొత్త స్కీమ్ లను అమలు చేస్తుండటంపై కార్మికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.