Homeబిజినెస్Electrical Vehicle: ఎలక్ట్రిక్ బైక్ కొనేవారికి శుభవార్త.. భారీగా తగ్గనున్న ధరలు?

Electrical Vehicle: ఎలక్ట్రిక్ బైక్ కొనేవారికి శుభవార్త.. భారీగా తగ్గనున్న ధరలు?

Electrical Vehicle: ఇప్పుడంతా ఎలక్ట్రిక్ యుగం అన్నట్లుగా మారింది. పెట్రోల్, డీజిల్ వాహనాల స్థానంలో ఈవీలు సందడి చేస్తున్నాయి. వాతావరణ కాలుష్యంతో పాటు సులువుగా ప్రయాణించేందుకు అనుకూలంగా ఉండే ఎలక్ట్రిక్ వాహనాల తయారీకి ప్రభుత్వం సైతం ప్రోత్సాహం అందిస్తోంది. ఇప్పటికే ఫేమ్ 2 ద్వారా కేంద్ర ప్రభుత్వం పలు ప్రోత్సాహకాలను ఈవీల ఉత్పత్తి సంస్థలకు అందించింది. ఇప్పుడు ఫేమ్ 3 ద్వారా మరిన్ని రాయితీలు ప్రకటించే అవకాశం ఉందన్న వార్తలు వినిపిస్తున్నాయి.

2024 మార్చి నెలతో ఫేమ్ 2 ఇప్పటికే ముగిసింది. ప్రస్తుతం ఎలక్షన్ కారణంగా ఫేమ్ 3 గురించిన నిర్ణయం నిలిచిపోయింది. కొత్త ప్రభుత్వం వచ్చాక దీనిపై నిర్ణయం తీసుకోనున్నారు. ఇప్పటి వరకు ఫేమ్ 2 పథకం కింద ఎలక్ట్రిక్ స్కూటర్ల అమ్మకంపై 15 శాతం రాయితీ అందించింది. ఇప్పుడు ఫేమ్ 3ని అమలు చేయనున్నారు. దీని కోసం కేంద్ర ప్రభుత్వం రూ. 500 కోట్లు వెచ్చించనుంది. ఫేమ్ 2 కింద వేల ఎలక్ట్రిక్ బస్సుల కొనుగోలుకు రాయితీ కల్పించింది. ఫేమ్ 3 కింద ఎలాంటి వాహనాలపై రాయితీ ఉంటుందోననేది తెలియాల్సి ఉంది.

కొన్ని వర్గాల సమాచారం ప్రకారం ఫేమ్ 3లో ఎలక్ట్రిక్ కార్లపై తగ్గింపు ఉండకపోవచ్చని తెలుస్తోంది. హైబ్రిడ్ కార్లపై సబ్సిడీ ఉంటుందని అంటున్నారు. ఈ తరుణంలో ఎలక్ట్రిక్ స్కూటర్లపై రాయితీ ఇస్తారా? అన్న చర్చ సాగుతోంది. ప్రస్తుతం ఈఎంపీఎస్ కింద ఈవీ స్కూటర్ కొంటే రూ.10 వేల వరకు డిస్కౌంట్ వస్తుంది. త్రీ వీలర్ పై రూ.50 వేల వరకు రాయితీని పొందవచ్చు. మరి కొత్త ప్రభుత్వం ఈ వెహికల్స్ రాయితీ ఎలా ఉంటుందో చూడాలి.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.
RELATED ARTICLES

Most Popular