Pawan Kalyan- Bheemla Nayak: పవర్ స్టార్ పవన్ కల్యాణ్, రానా దగ్గుబాటి కాంబినేషన్లో రూపొందుతున్న సినిమా ‘భీమ్లా నాయక్’. కాగా ఫిబ్రవరి 25న భీమ్లా నాయక్ జాతర షురూ అవుతున్న విషయం తెలిసిందే. అయితే ఏపీలో టికెట్ రేట్లపై ఇంకా స్పష్టత రాలేదు. అయినా సరే రావడం పక్కా అంటున్నాడు భీమ్లా. నిన్న ఏపీ సినిమా టికెట్ ధరల కమిటీ సమావేశం పూర్తవగా ఇంకా ఓ స్పష్టత ఇవ్వలేదు. వారం రోజుల్లో టికెట్ రేట్లపై తమ ప్రతిపాదనలు ప్రభుత్వానికి ఇస్తామన్నారు సభ్యులు.
Pawan Kalyan- Bheemla Nayak
దీంతో టికెట్ రేట్లు ఎలా ఉన్నా, ఇక విడుదలకు ఆగేది లేదన్నట్టే చిత్ర బృందం ఉంది. ఎలాంటి పరిస్థితిలో అయినా ఈ నెల 25న భీమ్లా నాయక్ చిత్రాన్ని విడుదల చేస్తామని ఇప్పటికే చిత్ర బృందం ప్రకటించింది కూడా. ఈ తరుణంలో చివరి షెడ్యూల్ లో మిగిలి ఉన్న సన్నివేశాలను హైదరాబాద్ రామోజీ ఫిలింసిటీలో గత కొన్ని రోజులుగా చిత్ర బృందం చిత్రీకరిస్తున్నారు.
Also Read: హిజాబ్ వ్వవహారంలో బాధ్యులపై చర్యలుంటాయా?
హీరో పవన్ కల్యాణ్ కూడా ఈ చిత్రీకరణలో పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో, షూటింగ్ నేటితో పూర్తయిందని చిత్ర దర్శకుడు సాగర్ కె చంద్ర సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. పవన్ కల్యాణ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రంలో రానా కీలక పాత్ర పోషిస్తున్నా.. ఇది పవన్ కళ్యాణ్ సినిమాలాగే ప్రమోట్ అవుతుంది. ఇక ఫైనల్ కాపీని వీక్షించిన చిత్రబృందం సినిమాలో కొన్ని మార్పులు చేయాలని భావిస్తోందట.
Pawan Kalyan- Bheemla Nayak
గతంలో తొలగించిన సీన్లలో కొన్నింటిని మళ్లీ జోడించనుందట. మొత్తం 10 నుంచి 12 నిమిషాల నిడివి ఉన్న సీన్లను జోడిస్తున్నారని సమాచారం. మొత్తానికి
భీమ్లా నాయక్’లో కొత్తగా 12 నిమిషాల సీన్లు యాడ్ కాబోతున్నాయి.
Also Read: అసెంబ్లీ సమావేశాలకు బద్దకమేనా ప్రజాప్రతినిధులూ?