ఢిల్లీకి బయలుదేరిన ఏపీ సీఎం జగన్

ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఢిల్లీకి బయలుదేరారు. మంగళవారం మధ్యాహ్నం గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న ఆయన సాయంత్రం 5 గంటల వరకు ఢిల్లీకి చేరుకుంటారు. రాత్రి 9 గంటలకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో భేటీ అవుతారు. పోలవరం ప్రాజెక్టు తదితరు అంశాలపై కేంద్ర మంత్రులతో చర్చిస్తారు. రాష్ట్ర పునర్విభజన చట్టంలో అపరిష్క్రుతంగా ఉన్న సమస్యల పరిష్కారం, ఇతర అంశాలపై చర్చించనున్నారు. వరదలతో నష్టపోయిన ఏపీకి పరిహారం చెల్లించాల్సిందిగా రెండు రోజుల కిందటే కేంద్రానికి […]

Written By: Suresh, Updated On : December 15, 2020 3:21 pm

ysjaganmohanreddy

Follow us on

ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఢిల్లీకి బయలుదేరారు. మంగళవారం మధ్యాహ్నం గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న ఆయన సాయంత్రం 5 గంటల వరకు ఢిల్లీకి చేరుకుంటారు. రాత్రి 9 గంటలకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో భేటీ అవుతారు. పోలవరం ప్రాజెక్టు తదితరు అంశాలపై కేంద్ర మంత్రులతో చర్చిస్తారు. రాష్ట్ర పునర్విభజన చట్టంలో అపరిష్క్రుతంగా ఉన్న సమస్యల పరిష్కారం, ఇతర అంశాలపై చర్చించనున్నారు. వరదలతో నష్టపోయిన ఏపీకి పరిహారం చెల్లించాల్సిందిగా రెండు రోజుల కిందటే కేంద్రానికి లేఖ రాసిన జగన్ ఇప్పుడు అమిత్ షాను కలవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. కాగా తెలంగాణ సీఎం కేసీఆర్ పర్యటన ముగిసిన వెంటనే ఏపీ సీఎం ఢిల్లీకి వెళ్లడంపై ఆసక్తికరంగా మారింది.