
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ సోమవారం విడుదల చేసిన బులిటెన ప్రకారం.. గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,901 కరోనా కేసులు నమోదయ్యాయి. 19 మంది మృతి చెందారు. దీంతో ఇప్పటి వరకు కేసుల సంఖ్య 8,08,924 గా ఉంది. ఇక మరణాల సంఖ్య 6,606గా ఉన్నట్లు బులిటెన్లో పేర్కొంది. ఇక 24 గంటల్లో 3,972 మంది కోలుకోగా ప్రస్తుతం 28,770 యాక్టివ్ కేసులు ఉన్నాయి. 24 గంటల్లో అత్యధికంగా చిత్తూరు జిల్లాలో నలుగరు మృతి చెందారు.