టీడీపీపై మంత్రి బొత్స సంచలన వ్యాఖ్యలు

ఆంధ్రప్రదేశ్ మంత్రి బొత్స సత్యనారాయణ టీడీపీ పై వ్యంగాస్త్రాలు సంధించారు. బీసీల కోసం టీడీపీ చేసిన ఒక్క పనిని చెప్పాలంటూ సవాల్ విసిరారు. బీసీల ఆదరణకు ఎన్నో సంక్షేమ పథకాలు చేపడుతున్న జగన్ ప్రభుత్వాన్ని విమర్శించే హక్కు టీడీపీ నాయకులకు లేదన్నారు. బీసీల సంక్షేమం కోసం తాజాగా 56 కార్పొరేషన్లను ఏర్పాటు చేయడం వారికి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారో తెలుసుకోవాలన్నారు. ఇలా ఏర్పాటు చేయడం చారిత్రాత్మక నిర్ణయమని మంత్రి అన్నారు. బీసీలకు ఆదరణ పథకం పేరుతో అదే […]

Written By: Suresh, Updated On : October 18, 2020 3:21 pm
Follow us on

ఆంధ్రప్రదేశ్ మంత్రి బొత్స సత్యనారాయణ టీడీపీ పై వ్యంగాస్త్రాలు సంధించారు. బీసీల కోసం టీడీపీ చేసిన ఒక్క పనిని చెప్పాలంటూ సవాల్ విసిరారు. బీసీల ఆదరణకు ఎన్నో సంక్షేమ పథకాలు చేపడుతున్న జగన్ ప్రభుత్వాన్ని విమర్శించే హక్కు టీడీపీ నాయకులకు లేదన్నారు. బీసీల సంక్షేమం కోసం తాజాగా 56 కార్పొరేషన్లను ఏర్పాటు చేయడం వారికి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారో తెలుసుకోవాలన్నారు. ఇలా ఏర్పాటు చేయడం చారిత్రాత్మక నిర్ణయమని మంత్రి అన్నారు. బీసీలకు ఆదరణ పథకం పేరుతో అదే పని మీరు కూడా చేయాలని చంద్రబాబుకు సూచించారు. కాగా బీసీ కార్పొరేషన్లకు చైర్మన్లను నియమించడంపై రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ నాయకులు సంబరాలు చేసుకుంటున్నారు.