Homeఆంధ్రప్రదేశ్‌ysr statue vandalism : వైయస్సార్ విగ్రహాల ధ్వంసం వెనుక వైసిపి.. వెలుగులోకి సంచలన నిజాలు..

ysr statue vandalism : వైయస్సార్ విగ్రహాల ధ్వంసం వెనుక వైసిపి.. వెలుగులోకి సంచలన నిజాలు..

ysr statue vandalism : వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఏ చిన్న అవకాశాన్ని కూడా జారవిడుచుకోవడం లేదు. ఏడాది కిందట జరిగిన డీఎస్సీలో అక్రమాలు జరిగాయి అంటూ ఇప్పుడు రోడ్డుపైకి వచ్చి నిరసన తెలుపుతోంది. మరోవైపు రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయి అంటూ ఆరోపిస్తోంది. ఈ క్రమంలో నంద్యాలలో వైయస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహ ధ్వంసం ఘటనకు సంబంధించి కూటమి ప్రభుత్వంపై ఆరోపణలు చేయడం ప్రారంభించింది. అయితే ఈ విషయంలో అడ్డంగా బుక్కయింది. ఆ విగ్రహాన్ని ధ్వంసం చేసింది సొంత పార్టీ కార్యకర్త అని తేలడంతో డిఫెన్స్ లో పడిపోయింది. కూటమి మీద దూకుడు రాజకీయాలు చేస్తున్న క్రమంలో… ఆ పార్టీ వెనుక ముందు చూసుకోవడం లేదు. నంద్యాలలో ఇదే పరిస్థితి ఎదురు కావడంతో నాలుక కరుచుకుంది.

* రెండు రోజుల కిందట ధ్వంసం..
నంద్యాల నడిబొడ్డున ఉన్న రాజశేఖర్ రెడ్డి విగ్రహాన్ని శనివారం ఓ వ్యక్తి ధ్వంసం చేశారు. తలభాగాన్ని వేరుచేసి తనతో తీసుకెళ్లిపోయారు. అయితే ఈ వార్త వ్యాపించడంతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నేతలు స్పందించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణిస్తున్నాయని.. ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. అంతటితో ఆగకుండా విగ్రహ ధ్వంసం వెనుక కూటమి హస్తం ఉందని ఆరోపించడం ప్రారంభించారు. అయితే పోలీసులు రంగంలోకి దిగి.. నిందితుడిని పట్టుకున్నారు. వైసీపీలో విభేదాలతో జంబులయ్య అనే కార్యకర్త ఈ ఘాతుకానికి పాల్పడ్డారని పోలీస్ విచారణలో తేలింది. దీంతో ఎలా స్పందించాలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి తెలియడం లేదు.

* డీఎస్సీ పై అలానే..
గత ఏడాది డీఎస్సీ నిర్వహించిన సంగతి తెలిసిందే. 16,347 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేశారు. అయితే ఇప్పుడు డీఎస్సీ నియామకాల్లో అక్రమాలు జరిగాయి అంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది. ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన రిజర్వేషన్లు, రోస్టర్ పాయింట్లు, ఇతరత్రా అంశాలను పరిగణలోకి తీసుకొని ఈ ఉపాధ్యాయ నియామక ప్రక్రియ జరిగింది. పూర్తి పారదర్శకంగా జరిపినట్లు ప్రభుత్వం స్పష్టం చేస్తూ వాటి వివరాలు కూడా సమర్పించింది. దీంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీరుపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. ఇప్పుడు ఇలా విగ్రహం ధ్వంసం అయిందో లేదో.. కనీసం విచారించకుండా కూటమి పనే అంటూ అనుమానించడం ప్రారంభించింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. సొంత పార్టీ కార్యకర్త ఇలా చేశారని తెలియడంతో ఆ పార్టీ నేతలు షాక్ అవుతున్నారు. నంద్యాలలో పార్టీలో అంతర్గత విభేదాలతోనే ఈ పరిణామం జరిగిందని తెలియడంతో పార్టీ అధినాయకత్వం సీరియస్ గా తీసుకుంది. మరి ఎలాంటి చర్యలకు ఉపక్రమిస్తుందో చూడాలి.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular