YS Sharmila : జగనన్నా అంటూ.. కంటతడిపెట్టిన షర్మిల

.రాజకీయ ప్రయోజనాల విషయంలో నీకంటే లబ్ధిదారుడు ఎవరని ప్రశ్నించారు. ఇప్పటికైనా తప్పుడు మాటలు మానుకోవాలని హితవు పలికారు. ఈ క్రమంలో ఆమె కుటుంబ పరిణామాలను తలచుకొని కంటతడి పెట్టారు. ప్రస్తుతం ఆమె వ్యాఖ్యలే సోషల్ మీడియాలో వైరల్ అ

Written By: NARESH, Updated On : May 10, 2024 10:27 pm

YS Sharmila Break Down to Tears in Press Meet

Follow us on

YS Sharmila : ఏపీలో పతాక స్థాయికి రాజకీయాలు చేరుకున్నాయి. పోలింగ్ కు మరో 48 గంటల వ్యవధి మాత్రమే ఉంది. నేటితో ప్రచార గడువు కూడా ముగియనుంది. రేపు సాయంత్రం నుంచి ఎటువంటి రాజకీయ విమర్శలకు తావులేదు. ఈ నేపథ్యంలోనే రాజకీయ ప్రత్యర్థుల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. జగన్ ఇటీవల టీవీ9 కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సొంత కుటుంబంలో వచ్చిన చీలిక, అందుకు షర్మిల కారణం అన్నట్టు జగన్ చెప్పుకొచ్చారు. రాజకీయకాంక్షతోనే ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరి.. తన ప్రత్యర్థులతో చేతులు కలిపారని కూడా జగన్ ఆరోపించారు. ఈ వ్యాఖ్యలకు గట్టిగానే కౌంటర్ ఇచ్చారు షర్మిల. కడప వేదికగానే విలేకరుల సమావేశంలో గట్టిగానే మాట్లాడారు.కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలో జగనన్నా అంటూ కంటతడి పెట్టారు.

అవినీతి కేసుల్లో జగన్ జైలుకెళ్ళినప్పుడు షర్మిల యాక్టివ్ రోల్ ప్లే చేశారు. జగన్కు మద్దతు తెలిపిన ఎమ్మెల్యేలు రాజీనామాతో ఉప ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో సైతం క్రియాశీలక పాత్ర పోషించారు. ఎమ్మెల్యే అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం చేశారు. ఇప్పుడు అదే విషయాన్ని గుర్తు చేస్తున్నారు షర్మిల. నన్ను రాజకీయాల్లోకి తెచ్చింది జగనన్న కాదా? జైల్లో ఉన్నప్పుడు నన్ను పాదయాత్ర చేయమన్నది మీరు కాదా? నా భర్త పిల్లలను వదిలేసి వేల కిలోమీటర్ల పాదయాత్ర చేశా. మీ భవిష్యత్తు కోసం నా కాలికి గాయమైనా వెనక్కి తగ్గలేదు. అప్పట్లో నా చుట్టూ వైసిపి ఉంది. హైజాక్ చేసే ఛాన్స్ ఉంది. అయినా చేశానా జగనన్న అంటూ షర్మిల గట్టిగానే ప్రశ్నించారు.

అటు కుటుంబ వ్యవహారాన్ని కూడా షర్మిల బయటపెట్టారు. కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమే రాజశేఖరరెడ్డి ఫోటోను వాడుకుంటున్నారని ఆరోపించారు. సాక్షి పత్రికలో పైన రాజశేఖర్ రెడ్డి ఫోటో, కింద వివేకానంద రెడ్డి పై దుష్ప్రచారం.. ఇదేనా? మీ విశ్వసనీత అంటూ నిలదీశారు షర్మిల. విలువలు, విశ్వసనీయతల గురించి మీరు మాట్లాడకూడదని తేల్చి చెప్పారు.రాజకీయ ప్రయోజనాల విషయంలో నీకంటే లబ్ధిదారుడు ఎవరని ప్రశ్నించారు. ఇప్పటికైనా తప్పుడు మాటలు మానుకోవాలని హితవు పలికారు. ఈ క్రమంలో ఆమె కుటుంబ పరిణామాలను తలచుకొని కంటతడి పెట్టారు. ప్రస్తుతం ఆమె వ్యాఖ్యలే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.