Duvvada Srinivas : దువ్వాడ.. ఈ రేంజ్ లో దువ్వేశావా? మరీ ఓపెన్ గానా.. వైరల్ వీడియో

నెలరోజుల క్రితం ఏపీ రాజకీయాలలో వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్, ఆ పార్టీ నాయకురాలు మాధురి సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. మీడియా మొత్తం వీరి చుట్టే తిరిగింది. జాతీయ మీడియా సైతం వీరికి ప్రాధాన్యం ఇవ్వక తప్పలేదు. ఫేస్ బుక్, ట్విట్టర్, ఇన్ స్టా.. ఇలా ఏ సామాజిక మాధ్యమం చూసుకున్నా వీరే హాట్ టాపిక్ గా నిలిచారు.

Written By: Anabothula Bhaskar, Updated On : October 6, 2024 9:48 pm

Duvvada Srinivas

Follow us on

నెలరోజుల క్రితం ఏపీ రాజకీయాలలో వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్, ఆ పార్టీ నాయకురాలు మాధురి సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. మీడియా మొత్తం వీరి చుట్టే తిరిగింది. జాతీయ మీడియా సైతం వీరికి ప్రాధాన్యం ఇవ్వక తప్పలేదు. ఫేస్ బుక్, ట్విట్టర్, ఇన్ స్టా.. ఇలా ఏ సామాజిక మాధ్యమం చూసుకున్నా వీరే హాట్ టాపిక్ గా నిలిచారు. ఈ క్రమంలోనే మాధురి రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ఆ తర్వాత కోలుకున్నారు. అయితే దువ్వాడ శ్రీనివాస్ భార్య, పిల్లలు గొడవ చేయడంతో ఈ వ్యవహారం మరింత రచ్చకెక్కింది.. ఇది సహజంగానే వైసిపికి ఇబ్బందికరంగా మారింది. ఆ తర్వాత దువ్వాడ శ్రీనివాస్ వైసీపీ సమావేశంలో కనిపించారు. మాధురి భర్త సీన్లోకి ఎంట్రీ ఇచ్చినప్పటికి.. ఆయన తన భార్యనే వెనకేసుకొచ్చారు. అయితే దువ్వాడ శ్రీనివాస్ తాను సంపాదించిన ఆస్తులను మాధురి పేరు మీద రాశారని అప్పట్లో ఆయన భార్య ఆరోపించారు. ఇప్పటికీ ఈ వివాదం సద్దుమణగనప్పటికీ.. ఏదో ఒక రూపంలో మీడియాలో సంచలనం సృష్టిస్తూనే ఉంది. తాజాగా దువ్వాడ శ్రీనివాస్, మాధురి ఒక వీడియోలో కనిపించారు. ఆ వీడియో సామాజిక మాధ్యమాలలో సంచలనంగా మారింది. దీంతో మళ్లీ మీడియా వీరి చుట్టూ తిరగడం మొదలుపెట్టింది.

ఏకంగా ప్రమోషన్ల వరకు వచ్చారు

శ్రీనివాస్ – మాధురి ఓ ప్రమోషనల్ వీడియోలో కనిపించారు. ముందుగా బైక్ పై శ్రీనివాస్ – మాధురి వచ్చారు. శ్రీనివాస్ వెనకాల కూర్చున్న మాధురి.. ఆయనను గట్టిగా పట్టుకున్నారు. శ్రీనివాస్ వేగంగా ఎలక్ట్రికల్ స్కూటీ డ్రైవ్ చేశారు. ఆ తర్వాత మాధురి కూడా ఎలక్ట్రికల్ స్కూటీని సింగల్ గా డ్రైవ్ చేశారు. అయితే వీరిద్దరి ఎపిసోడ్ అప్పట్లో మీడియాలో సంచలనంగా మారింది. దీంతో ఒక్కసారిగా వీరిద్దరూ ఫేమస్ అయిపోయారు. ఫలితంగా పలు కంపెనీలు వీరితో ప్రమోషనల్ వీడియోలు చేయిస్తున్నాయి. అందులో ఓ ఎలక్ట్రికల్ స్కూటీ కంపెనీ వీరిద్దరితో ప్రమోషనల్ వీడియో రూపొందించింది. ఆ కంపెనీ వీరిద్దరికి భారీగానే రెమ్యూనరేషన్ ఇచ్చినట్టు తెలుస్తోంది. దీంతో వీరిద్దరూ జంటగా ఆ కంపెనీకి ప్రమోషన్ చేశారు. అయితే మొన్నటిదాకా విడివిడిగా ఉంటున్నామని చెప్పిన వీరు.. ఇప్పుడు కలిసే ఉంటున్నారని తెలుస్తోంది. ఈ లెక్కన చూస్తే మాధురి తన మొదటి భర్తతో విడిపోయినట్టేనని.. శ్రీనివాస్ కూడా తన మొదటి భార్యకు పూర్తిగా దూరమైనట్టేనని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. టిడిపి శ్రేణులు ఈ వీడియోను పదేపదే సామాజిక మాధ్యమాలలో పోస్ట్ చేస్తున్నారు. “దువ్వాడ.. ఈ రేంజ్ లో దువ్వేశావా? మరీ ఓపెన్ గానా.. మీడియాలో మరోసారి ట్రెండ్ అయిపోతున్నారు. ఇక మిమ్మల్ని ఆపేవాడు ఎవడూ లేడు. దూసుకుపోండి వేగంగా.. రెచ్చిపోండి ఆకాశమే హద్దుగా.. రాజకీయాలలో విలువలు నాశనమయ్యాయి. దీనికి నిదర్శనమే ఈ వీడియో” అంటూ టిడిపి శ్రేణులు సామాజిక మాధ్యమాలలో ఘాటుగా వ్యాఖ్యానిస్తున్నాయి.