ఆంధ్రప్రదేశ్‌Pawankalyan : టీడీపీని పవన్ చిత్తు చేస్తారా.. బీజేపీకి ప్లస్ గా నిలుస్తారా?

Pawankalyan : టీడీపీని పవన్ చిత్తు చేస్తారా.. బీజేపీకి ప్లస్ గా నిలుస్తారా?

Pawankalyan : ఏపీలో ఇప్పుడు పవన్ సెంటరాఫ్ అట్రాక్షన్. రాజకీయాలు పవన్ చుట్టూ తిరుగుతున్నాయి. ఆయన కోర్టులో నడుస్తున్నాయి. బంతి ఎటువైపు తంతే అటువైపే అన్నట్టు సాగుతున్నాయి. అయితే ఆ బంతి ఎటువైపు? ఎలా నెట్టుతారు? అన్నదే ఇప్పుడు ప్రశ్న. అయితే ఇందులో ఎన్నో చిక్కుముళ్లు.. అవరోధాలు ఉన్నాయి. వాటన్నింటినీ ఎలా దాటి వెళతారన్నదే ఇప్పుడు అసలు సిసలైన ప్రశ్న. పార్టీ ఆవిర్భవించి సుదీర్ఘ కాలం అవుతున్న దక్కని రాజకీయ ఫలాలు ఒక వైపు, వైసీపీ ఆరాచక పాలన నుంచి విముక్తి కల్పించాలన్న లక్ష్యం మరోవైపు, రాజ్యాధికారానికి దూరంగా ఉన్న ఒక వర్గం కలలను దరి చేర్చే అవకాశం ఒక వైపు.. ఇలా ఎన్నెన్నో సందేహాలు నడుస్తున్నాయి. వాటన్నింటికీ రేపటి ఎన్డీఏ మిత్రపక్ష సమావేశాల్లో జవాబు దొరుకుతుందని ఏపీ ప్రజలు ఆశగా ఎదురుచూస్తున్నారు.

పవన్ కు ఎన్డీఏ మిత్రపక్షాల సమావేశానికి ఆహ్వానం అందింది. అంటే బీజేపీ తమకు నమ్మదగిన మిత్రుడిగా భావిస్తోంది. గతంలో ఎన్డీఏలో పనిచేసిన పార్టీలకు ఆహ్వానించినా.. టీడీపీని పక్కనపెట్టడం అంటే ఏపీలో బీజేపీ మరో ఆలోచనతో ఉందని తెలుస్తోంది. అది కచ్చితంగా జనసేనతో మాత్రమే కలిసి వెళ్లాలని అర్ధమవుతోంది. అయితే ఇందుకు పవన్ అంగీకరిస్తారా? లేదా? అనేదే ప్రశ్న. పవన్ ముందు చాలారకాలుగా చిక్కుముళ్లు ఉన్నాయి. జనసేన ఆవిర్భవించి దాదాపు పుష్కరకాలం అవుతోంది. చెప్పుకోదగ్గ విజయాలేవీ ఆ పార్టీ ఖాతాలో లేవు. ఈసారి కానీ రాజకీయంగా ప్రభావం చూపకుంటే శ్రేణుల్లో ధైర్యం కొరవడే అకాశం ఉంది.

బీజేపీ, జనసేన కలిసి పోటీ చేస్తే చెప్పుకోదగ్గ ఓట్లు, సీట్లు వచ్చే అవకాశముందా? క్షేత్రస్థాయిలో బీజేపీకి నాయకత్వం ఉందా? బూత్ స్థాయిలో నిలబడే వారు ఉన్నారా? అన్న అనుమానాలు పవన్ ను వెంటాడుతున్నాయి. టీడీపీకి దూరం చేసుకుంటే అది వైసీపీకి లాభం చేకూర్చినట్టవుతుందని పవన్ బలంగా నమ్ముతున్నారు. పోనీ రెండోస్థానంలోనైనా నిలబడగలిగే శక్తి రెండు పార్టీలకు ఉంటుందా? అంటే అదీ అనుమానమే. అటు జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కూటమి ఏకమవుతోంది. బీజేపీకి సవాల్ విసురుతోంది. ఒకవేళ జాతీయ స్థాయిలో బీజేపీ బలం తగ్గితే ఆ ప్రభావం ఏపీపై స్పష్టంగా పడుతోంది. అటువంటి సమయంలో తట్టుకోవడం చాలా కష్టమని పవన్ భావిస్తున్నారు.

పొరపాటున మరోసారి వైసీపీ అధికారంలోకి వస్తే ఏపీ రావణకాష్టంగా మారుతుందని పవన్ భావిస్తున్నారు. వైసీపీ ఏలుబడిలో రాష్ట్రం నాశనమైందని ఆందోళన వ్యక్తం చేశారు. అందుకే ఎట్టి పరిస్థితుల్లో వైసీపీని అధికారంలోకి రానివ్వనని శపధం చేశారు. ఇప్పుడు ఆ మాట తప్పుతారా? వైసీపీ మరోసారి అధికారంలోకి వస్తే పవన్ విశ్వసనీయత పై దెబ్బతుగులుంది. చేజేతులా వైసీపీని పవనే గెలిపించారని టీడీపీతో పాటు విపక్షాలు ఆరోపిస్తాయి. అది అసలుకే ఎసరు వస్తుంది. పోనీ 2024 ఎన్నికల్లో త్యాగానికి సిద్ధపడి.. 2029 ఎన్నికల్లో బీజేపీ, జనసేన కూటమి అధికారంలోకి వస్తుందని ఢిల్లీ పెద్దలు వైట్ వాష్ చేసినా అది సాధ్యమేనా అన్న ప్రశ్న వెంటాడుతోంది. ఇప్పటికే మోదీ ప్రభ తగ్గుతోంది. మూడోసారి అధికారంలోకి వస్తే తప్పకుండా ప్రజా వ్యతిరేకత రెట్టింపు అవుతోంది. ఇలా అన్నిరకాల విశ్లేషణలు చేసుకునే పవన్ రేపటి సమావేశంలో నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Most Popular

Himalayan Disaster: హిమాలయాల్లో విపత్తు.. వాతావరణ మార్పులతో ముప్పు!

Himalayan Disaster: ఇటీవల జమ్మూ కశ్మీర్‌లోని పూంఛ్, రాజౌరీ జిల్లాల్లో కుంభవృష్టి, వరదలు, కొండచరియలు విధ్వంసం సృష్టించాయి. ఇంతకు ముందు డోడా, కిష్వార్‌ ప్రాంతాల్లో కూడా ఇలాంటి ఘటనలు జరిగాయి. ఉత్తరాఖండ్, హిమాచల్‌...

Divvela Madhuri: దువ్వాడను అడ్డంగా బుక్ చేసిన జాఫర్.. ఇచ్చిపడేసిన దివ్వెల మాధురి..వీడియో వైరల్..

Divvela Madhuri: సోషల్ మీడియా లో బాగా పాపులారిటీ ని సంపాదించుకున్న జంటలలో దువ్వాడ శ్రీనివాస్ - దివ్వెల మాధురి జంట ఒకటి. పొలిటికల్ నేపథ్యం ఉన్నటువంటి దువ్వాడ శ్రీనివాస్ తన భార్య...

Tollywood Directors: రైటర్ గా ఫెయిల్ అయి డైరెక్టర్ గా సక్సెస్ అయిన దర్శకులు వీళ్లే…

Tollywood Directors: సినిమా ఇండస్ట్రీలో కొంతమంది రచయితలు తమకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను ఏర్పాటు చేసుకుంటారు. సినిమా సక్సెస్ లో వాళ్ళు కీలకపాత్ర వహిస్తూ ఉంటారు. ప్రతి సీన్ ను వాళ్ళు...

Jana Nayagan: ఓవర్సీస్ లో నిరాశపరుస్తున్న ‘జన నాయగన్’ అడ్వాన్స్ బుకింగ్స్.. ఇంత తక్కువ గ్రాస్ ఊహించలేదు..

Jana Nayagan: తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ హీరో గా నటించిన చివరి చిత్రం 'జన నాయగన్ ' మరో రెండు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. జనవరి 9 న విడుదల అవ్వాల్సిన...

PNB Recruitment 2026: 545 ఉద్యోగాలు.. స్థిరమైన కెరీర్‌కు అవకాశం.. త్వరపడండి

PNB Recruitment 2026: పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ (పీఎన్‌బీ) ఇటీవల 545 లోకల్‌ బ్యాంక్‌ ఆఫీసర్‌ (ఎల్‌వోబీ) ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ వెలువరించింది. ఇది డిగ్రీ పూర్తి చేసి, బ్యాంకింగ్‌ రంగంలో కనీసం ఒక...
Oktelugu Epaper
Exit mobile version