Homeఆంధ్రప్రదేశ్‌Jagan: హాట్ టాపిక్.....

Jagan: హాట్ టాపిక్.. జగన్ కోర్టుకు వస్తారా? లేదా?

Jagan: జగన్( Y S Jagan Mohan Reddy ) సీబీఐ కోర్టుకు హాజరవుతారా? లేదా? ఎందుకు హాజరు కావడానికి ఇష్టపడడం లేదు? హాజరైతే మునుపటి మాదిరిగా వారం వారం విచారణ ఎదుర్కోవాల్సి ఉంటుందా? ఇప్పుడు అందరిలో మెదులుతున్న అంశం ఇదే. కొద్ది రోజుల కిందట విదేశీ పర్యటన ముగించుకొని జగన్మోహన్ రెడ్డి ఏపీకి చేరుకున్న సంగతి తెలిసిందే. ఆయనపై అవినీతి కేసులు ఉన్న తరుణంలో విదేశాలకు వెళ్లేటప్పుడు కోర్టు అనుమతి తప్పనిసరి. అయితే కోర్టు అనుమతి ఇచ్చిన నేపథ్యంలో తిరిగి వచ్చిన వెంటనే.. కోర్టుకు హాజరుకావాలని ఆదేశించింది. అయితే ఇప్పుడు తాను హాజరు కాలేనంటూ అదే కోర్టులో పిటిషన్ దాఖలు చేయడం విశేషం. అయితే జగన్మోహన్ రెడ్డి ఎందుకు భయపడుతున్నారు అన్నది ఇప్పుడు చర్చ. కోర్టుకు హాజరుకాబడాన్ని ఆయన అవమానంగా భావిస్తున్నారా అన్న టాక్ కూడా వినిపిస్తోంది. లేకుంటే కోర్టు ఏదైనా కఠిన ఆదేశాలు ఇస్తుందన్న అనుమానం ఉందా? ఇప్పుడు దీనిపైనే చర్చ నడుస్తోంది.

Also Read: బలగం వేణు ఏడ్చేశాడు.. నేను ఒకటే మాట చెప్పాను.. తేజ బయటపెట్టిన నిజం…

* 2019 వరకు కోర్టులో హాజరు..
అక్రమాస్తుల కేసుల్లో 2012లో అరెస్టయ్యారు జగన్మోహన్ రెడ్డి. దాదాపు 16 నెలల పాటు ఆయన రిమాండ్ ఖైదీగా ఉండిపోయారు. బెయిల్ పై బయటకు వచ్చిన ఆయన ప్రతి శుక్రవారం కోర్టుకు హాజరు కావాలని ఆదేశించింది న్యాయస్థానం. అది మొదలు 2019 ఎన్నికల వరకు ఆయన హాజరవుతూనే ఉన్నారు. గతంలో పాదయాత్ర చేసినప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి ప్రతి శుక్రవారం విరామం ఇచ్చేవారు. హైదరాబాదులోని నాంపల్లి సిబిఐ కోర్టుకు హాజరయ్యేవారు. కానీ 2019 ఎన్నికల్లో ఆయన గెలవడం.. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించాక పాలనాపరమైన అంశాల్లో బిజీగా ఉన్నందున.. కోర్టుకు హాజరు విషయంలో తనకు మినహాయింపు కావాలని కోరారు జగన్మోహన్ రెడ్డి. దీంతో కోర్టు మినహాయింపు ఇచ్చింది.

* విదేశీ పర్యటనకు అనుమతి..
ఇటీవల జగన్మోహన్ రెడ్డి లండన్ పర్యటనకు( London tour) వెళ్లారు. సిపిఐ కోర్టుకు దరఖాస్తు చేసుకున్నారు. విదేశాలకు వెళ్లేందుకు అనుమతి కావాలని కోరారు. కోర్టు అంగీకారం తెలపడంతో పాటు తిరిగి వచ్చిన వెంటనే కేసు విచారణకు హాజరు కావాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. ఈనెల 14న జగన్ కోర్టు విచారణకు హాజరు కావాల్సి ఉంది. అయితే ఇంతలోనే సిబిఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు జగన్మోహన్ రెడ్డి. తాను హాజరైతే భద్రతాపరమైన అంశాలతో పాటు ప్రోటోకాల్ పాటించాల్సి ఉంటుందని.. ప్రభుత్వంపై భారం పడుతుందని.. అందుకే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తనను విచారించాలని ఆయన ప్రత్యేక పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై కోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుందో చూడాలి. గత 13 సంవత్సరాలుగా జగన్ పై మోపిన అక్రమాస్తుల కేసు విచారణ ముందుకు సాగడం లేదు. కనీసం కోర్టులో ట్రైల్ కూడా రాలేదు. దీనిపై cbi గట్టిగానే ఉంది. ఇప్పుడు కూడా కోర్టుకు జగన్మోహన్ రెడ్డి తప్పక హాజరు కావాల్సిందేనని పట్టుబడుతోంది. కానీ జగన్ మాత్రం ససేమిరా అంటున్నారు. మరి చూడాలి ఇవి వ్యవహారం ఎలా ముగింపు నకు వస్తుందో?

Get notified whenever we post something new!

Continue reading

Tammineni Family: పోలీసుల కళ్ళుగప్పి.. పరారీలో తమ్మినేని ఫ్యామిలీ!

Tammineni Family: ఉమ్మడి రాష్ట్రంలోనే సీనియర్ మోస్ట్ లీడర్ తమ్మినేని సీతారాం. తెలుగుదేశం పార్టీలో ఒక వెలుగు వెలిగిన ఆయన సుదీర్ఘకాలం మంత్రిగా పనిచేశారు. తర్వాత వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరి ఒకసారి ఎమ్మెల్యే అయ్యారు. స్పీకర్ వంటి రాజ్యాంగబద్ధ పదవిని చేపట్టారు. అటువంటి నేత అరెస్టు భయంతో ఇప్పుడు కుటుంబ సభ్యులతో సహా...

AP School Hair Cut Rules: విద్యార్థులకు సరికొత్త హెయిర్ స్టైల్స్.. అలా వస్తామంటే కుదరదు!

AP School Hair Cut Rules: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రేపు తల్లికి వందనం నిధులను తల్లుల ఖాతాల్లో జమ చేయనుంది. ఈ పరిస్థితుల్లో పిల్లల విషయంలో మరో నిర్ణయం ప్రకటించింది. ఏపీలో ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో చదువుతున్న బాలురుకు ఒకే తరహాలో హెయిర్ కట్ విధించాలని విద్యాశాఖ కొత్త మార్గదర్శకాలను...

Talliki Vandanam: తల్లికి వందనం: కొద్ది గంటల్లోనే.. రూ.13 వేలు.. పేరు ఉందో లేదో చూసుకోండి!

Talliki Vandanam: ఏపీలో మరో ప్రతిష్టాత్మక పధకం అమలుకు ప్రభుత్వం సన్నాహాలు పూర్తి చేసింది. కీలక నిర్ణయం తీసుకుంది. రేపు లబ్ధిదారుల ఖాతాలో నిధులు జమ చేయనుంది. తొలి విడత నిధుల విడుదల చేసే అర్హుల జాబితాను గ్రామ/ వార్డు సచివాలయాల్లో అందుబాటులో ఉంచుతున్నారు. మరోవైపు ఈ ఏడాది లబ్ధిదారుల సంఖ్య పెరగనుంది. కొత్తగా...

Enjoy exclusive access to all of our content

Get an online subscription and you can unlock any article you come across.

Enjoy the benefits of exclusive reading

Exit mobile version