spot_img
Homeఆంధ్రప్రదేశ్‌Vangaveeti Radhakrishna: వంగవీటి రాధాకు ఏమైంది? ఎందుకీ దుస్థితి?

Vangaveeti Radhakrishna: వంగవీటి రాధాకు ఏమైంది? ఎందుకీ దుస్థితి?

Vangaveeti Radhakrishna: వంగవీటి మోహన్ రంగ.. ఈ పేరులోనే ఒక వైబ్రేషన్ ఉంది. కాపు ఉద్యమ నేతగా సుపరిచితుడు అయినా.. బడుగు, బలహీన వర్గాలకు అండగా నిలబడ్డారు. విజయవాడ రాజకీయాల్లో ఎంట్రీ ఇచ్చి.. ఉమ్మడి రాష్ట్ర రాజకీయాలను శాసించే స్థాయికి ఎదిగారు. ఎమ్మెల్యేగా ఎన్నికయింది ఒకసారే అయినా.. తెలుగు రాజకీయాలనే షేక్ చేసే స్థాయికి చేరారు. కానీ ప్రత్యర్థుల చేతిలో హత్యకు గురయ్యారు. లేకుంటే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యే వారిని ఇప్పటికీ చెప్పుకుంటారు. ఆయన వారసుడిగా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన రాధాకృష్ణ.. సరైన రాజకీయ నిర్ణయాలు తీసుకోవడంలో విఫలం చెందడంతో యాక్టివ్ పాలిటిక్స్ కు దూరంగా ఉన్నారు. పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన తొలి ఎన్నికల్లో గెలిచినా.. మరో రెండు ఎన్నికల్లో ఓడిపోయారు. మరో రెండు ఎన్నికల్లో ఏ పార్టీ టికెట్ దక్కకుండా పోయారు. అయితే దీనికి రాధాకృష్ణ స్వయంకృతాపమే కారణం.

వంగవీటి, దేవినేని కుటుంబాల మధ్య దశాబ్దాల వైరం కొనసాగుతోంది. తండ్రి అకాల మరణ సమయానికి రాధ విద్యార్థి జీవితంలో ఉన్నారు. అనూహ్యంగా ఆయనను 2004లో రాజకీయాల్లోకి తెచ్చారు వైయస్ రాజశేఖర్ రెడ్డి. అప్పటివరకు కాలేజీ జీవితంలో ఉన్న రాధ తొలిసారిగా అసెంబ్లీలో అడుగు పెట్టారు. అయితే అదే సమయంలో తన తండ్రి ప్రత్యర్థి దేవినేని నెహ్రూకు.. హైదరాబాదులో ఆస్తి వివాదం పరిష్కరించి భారీగా ఆర్థిక లబ్ధి చేకూరేలా వైయస్ రాజశేఖర్ రెడ్డి వ్యవహరించారని రాధాకృష్ణ భావించారు. దానిని అవమానకరంగా భావించి… అప్పుడే పురుడు పోసుకున్న ప్రజారాజ్యం పార్టీలో చేరారు. రాజశేఖర్ రెడ్డి వద్దని వారించినా వినలేదు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం నుంచి ప్రజారాజ్యం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. వైసిపి ఆవిర్భావంతో ఆ పార్టీలో చేరారు. 2014 ఎన్నికల్లో విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. దీంతో వరుసగా రెండు ఎన్నికల్లో ఓటమి చవి చూడడంతో రాధా పరిస్థితి అగమ్య గోచరంగా మారింది.

2019 ఎన్నికల్లోవిజయవాడ తూర్పు నియోజకవర్గ టికెట్ కోసం పట్టుపట్టారు రాధా. జగన్ మాత్రం మచిలీపట్నం ఎంపీ సీటు ఇస్తానని ఆఫర్ ఇచ్చారు. దానిని అవమానంగా భావించిన రాధా వైసీపీని వీడారు. తెలుగుదేశం పార్టీలో చేరారు. ఆ పార్టీ స్టార్ క్యాంపెయినర్ గా మారారు. కానీ ఎన్నికల్లో టిడిపి ఓడిపోయింది. వైసీపీ అధికారంలోకి వచ్చింది. అయితే గత ఐదు సంవత్సరాలుగా ఆయన టిడిపిలోనే ఉన్నారు. అంటీ ముట్టనట్టుగా కొనసాగుతున్నారు. వైసీపీకి చెందిన కొడాలి నాని వల్లభనేని వంశీ మోహన్ తో స్నేహంగా మెలిగారు. అలాగని వైసీపీలో చేరలేదు. లోకేష్ పాదయాత్రలో సైతం పాల్గొన్నారు. టిడిపి సైతం ఎక్కడా అకామిడేట్ చేయలేదు. అటు జనసేన నేతలతో సైతం సమావేశమయ్యారు. బిజెపి నేతలతో భేటీ జరిపారు. కానీ ఏ పార్టీ కూడా రాధాను పరిగణలోకి తీసుకోలేదు. అయితే కొన్ని నియోజకవర్గాల్లో కూటమి అభ్యర్థులకు మద్దతుగా రాధా ప్రచారం చేస్తున్నారు. అయితే రాధాకు టిడిపి నాయకత్వం నుంచి గట్టి హామీ లభించి ఉంటుందన్న టాక్ నడుస్తోంది. అయితే యాక్టివ్ రాజకీయాలకు రాధా దూరం కావడం మాత్రం అభిమానులకు రుచించడం లేదు. రాధా పరిస్థితి చూసి వారు బాధపడుతున్నారు.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Most Popular

Azim Premji : జీవితానికి సంబధించి అజీమ్ ప్రేమ్ జీ చెప్పిన 5 సూత్రాలివే..

Azim Premji : భారతదేశ ప్రముఖ పారిశ్రామికవేత్త అజీమ్ ప్రేమ్‌జీ వ్యాపార రంగంలో ఎన్నో విజయాలు సాధించారు. ఆయన ధనవంతుడైనప్పటికీ సాదాసీదా జీవనశైలి, క్రమశిక్షణకు ఎంతో ప్రాధాన్యత ఇస్తారు. యువతకు, వ్యాపారవేత్తలకు స్ఫూర్తినిచ్చేలా...

Yasho Sagar : రాత్రికి రాత్రే స్టార్‌డమ్.. ‘ఉల్లాసంగా ఉత్సాహంగా’ హీరో విషాదాంతం.. ఇప్పటికీ మిస్టరీయేనా?

Yasho Sagar : ఒక హీరో కి అయినా , హీరోయిన్ కి అయినా కేవలం ఒకటి రెండు సినిమాలతో కలలో కూడా ఊహించని గుర్తింపు దక్కడం అనేది ఒక అదృష్టం. పదుల...

Jana Nayagan collections : 2వ రోజు దారుణంగా పడిపోయిన ‘జన నాయగన్ ‘ వసూళ్లు.. ఎంత గ్రాస్...

Jana Nayagan collections : తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ నటించిన లేటెస్ట్ చిత్రం 'జన నాయగన్ ' నిన్న ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదలైంది. 'భగవంత్' కేసరి కి రీమేక్ గా...

Infosys : ఏఐ విజృంభిస్తున్న వేళ.. ఇన్ఫోసిస్ కీలక నిర్ణయం.. ఇకపై జరిగేది అదే

Infosys : టెక్నాలజీలో రోజురోజుకు కొత్త కొత్త మార్పులు వస్తున్నాయి. నిన్న ఉన్న టెక్నాలజీ నేటికీ పాతగా మారిపోతుంది. నేడు ఉన్న టెక్నాలజీ రేపటికి మరుగున పడిపోతోంది. అందువల్లే టెక్నాలజీ యుగంలో ఎప్పుడు...

Jantar Mantar : జంతర్ మంతర్ వద్ద రామనామం.. ఇది అసలు ఊహించలేదుగా..

Jantar Mantar : సాధారణంగా రాముడి నామం మీద పేటెంట్ రైట్స్ మొత్తం బిజెపికి ఉంటాయి. ఎందుకంటే ఆ పార్టీ రాముడి నామం జపించడంలో ఏమాత్రం వెనుకాడదు. పైగా ఆ పార్టీకి సెక్యులర్...
Oktelugu Epaper
Exit mobile version