Homeఆంధ్రప్రదేశ్‌Crime News : మేనమామ భార్యపై అల్లుడి కన్ను.. చివరికి ఏం జరిగిందంటే..

Crime News : మేనమామ భార్యపై అల్లుడి కన్ను.. చివరికి ఏం జరిగిందంటే..

Crime News : రోజురోజుకు మనుషుల్లో విలువలు తగ్గిపోతున్నాయి. వావీవరుసలు కాలగర్భంలో కలిసిపోతున్నాయి. శారీరక సుఖం కోసం బంధాలు, బంధుత్వాలు మటుమాయమైపోతున్నాయి. చివరికి అవి హత్యలకు దారి తీస్తున్నాయి. అటువంటి సంఘటనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఉమ్మడి అనంతపురం జిల్లాలో కళ్యాణదుర్గం మున్సిపాలిటీ పరిధిలోని కూరాకుల తోటలో జరిగింది. కూరాకుల తోటలో ఇటీవల వన్నూర స్వామి (35) అనే వ్యక్తి హత్యకు గురయ్యాడు. ఈ సంఘటన ఉమ్మడి అనంతపురం జిల్లాలో సంచలనం కలిగించింది. పోలీసులు పలు కోణాల్లో దర్యాప్తు చేయగా దిమ్మతిరిగే వాస్తవాలు వెలుగు చూశాయి.

కళ్యాణదుర్గం మున్సిపాలిటీ పరిధిలోని కూరాకుల తోటకు చెందిన వన్నూరు స్వామి, భార్య నివాసం ఉంటున్నారు. వారి ఇంట్లో స్వామి అక్క కుమారుడు (17 సంవత్సరాలు) కూడా ఉంటున్నాడు. ఈ క్రమంలో స్వామి భార్యకు, అతడి మేనల్లుడికి వివాహేతర సంబంధం ఏర్పడింది. పలుమార్లు భర్త లేని సమయంలో ఆమె మేనల్లుడితో శారీరక సుఖం అనుభవించేది. అయితే ఒక రోజు వారిద్దరూ ఏకాంతంగా ఉండగా స్వామి చూశాడు. భార్యను నిలదీశాడు. ఈ క్రమంలో రెండు కుటుంబాల మధ్య గొడవలు జరుగుతున్నాయి.. గత నెల 28న మద్యం తాగుదామని స్వామిని అతడి మేనల్లుడు పిలిచాడు. గొడవలు జరుగుతున్న నేపథ్యంలో తాను రాలేనని స్వామి చెప్పేశాడు. దీంతో స్వామి భార్య బలవంతం చేయడంతో అతడు వెళ్ళాడు. స్వామికి పీకల దాకా మద్యం తాగించిన అతడి మేనల్లుడు.. తన వెంట తెచ్చుకున్న కత్తితో అతడి గొంతు కోశాడు. తీవ్రంగా రక్తస్రావం జరిగి స్వామి అక్కడికక్కడే కన్నుమూశాడు. అయితే దీనిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ తర్వాత వారిదైన శైలిలో దర్యాప్తు చేయగా అసలు విషయం వెలుగు చూసింది.

స్వామి మేనల్లుడు, అతని భార్య కలిసి ఉండాలని నిర్ణయించుకున్నారు. ఇందులో భాగంగానే స్వామి అడ్డును తొలగించుకోవాలనుకున్నారు. ముందుగా వేసుకున్న ప్రణాళిక ప్రకారం.. స్వామిని మద్యం తాగుదామని అతడి మేనల్లుడు పిలిచాడు. స్వామి వెళ్లకుండా అలాగే ఉండడంతో అతని భార్య బలవంతం చేసింది. స్వామికి మద్యం తాగించి అతని మేనల్లుడు కత్తితో గొంతు కోశాడు. హత్య చేసిన అనంతరం అతడు అక్కడి నుంచి పారిపోయాడు. ఈ ఘటన ఉమ్మడి అనంతపురం జిల్లాలో సంచలనం సృష్టించడంతో.. పోలీసులు ఈ కేసును అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. రెండు బృందాలుగా విడిపోయి.. సెల్ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా పట్టుకున్నారు. ఆ తర్వాత వారిదైన శైలిలో విచారించగా.. అతడు అసలు విషయాలు చెప్పేశాడు. నిందితుడిని రిమాండ్ కు తరలించారు. హత్యకు ఉపయోగించిన కత్తిని స్వాధీనం చేసుకున్నారు. నిందితుడి భార్యను కూడా అరెస్టు చేశారు.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.
RELATED ARTICLES

Most Popular