Homeఆంధ్రప్రదేశ్‌AP Election Survey 2024: ఏపీలో ఆ పార్టీదే అధికారం.. తేల్చిన ఎన్డీటీవీ సర్వే!

AP Election Survey 2024: ఏపీలో ఆ పార్టీదే అధికారం.. తేల్చిన ఎన్డీటీవీ సర్వే!

AP Election Survey 2024: ఏపీ, తెలంగాణతోపాటు పది రాష్ట్రాల్లో జరిగిగే లోక్‌సభ ఎన్నికలతోపాటు, ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు గురువారం(ఏప్రిల్‌ 18న) నోటిఫికేషన్‌ విడుదలైంది. దీంతో ఇక ప్రీపోల్‌ సర్వేలు, ఇతర సర్వేలు అన్నీ నిలిచిపోనున్నాయి. ఎన్నికల పూర్తయ్యే వరకు అంటే జూన్‌ 1వ తేదీ వరకు ఎలాంటి ఎగ్జిట్, ఒపీనియన్‌ పోల్స్‌ నిర్వమించకూడాదు, నిర్వహించినా ఫలితాలు ప్రకటించకూడదు. అయితే నోటిఫికేషన్‌కు ముందు ఏపీలో వివిధ సర్వే సంస్థలతో కలిపి ఎన్డీటీవీ సర్వే నిర్వహించింది. పోల్‌ ఆఫ్‌ పోల్స్‌ రిపోర్టు కూడా విడుదల చేసింది. దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల సందడి మొదలైన నేపథ్యంలో ఇప్పటికే పలు జాతీయ, ప్రాంతీయ సంస్థలు సర్వేలు నిర్వహించాయి. జాతీయ, ప్రాంతీయ మీడియా ఛానెళ్లు కూడా ఫలితాలను అంచనా వేసే ప్రయత్నం చేశాయి. ఫలితాలను కూడా వెల్లడించాయి. వాటిలో మెజారిటీ సర్వేలు ఏపీలో వైపీపీ మళ్లీ అధికారంలోకి వస్తుందని తెల్చాయి. మరోసారి ఏపీలో జగన్‌ సీఎం అవుతారని తెలిపాయి.

ఎన్డీటీవీ సర్వే ఫలితాలు ఇలా..
ఇక తాజాగా ఎన్డీటీవీ నిర్వహించిన సర్వే ఫలితాలు కూడా వైసీపీకే జై కోట్టాయి. ఈ పోల్‌ ఆఫ్‌ పోల్స్‌ లో ఏబీపీ, జీన్యూస్, ఇండియా టీవీ, టైమ్స్‌ వంటి ఛానెళ్లు ఇచ్చిన సర్వే రిపోర్టులను కలిపి ఎన్డీటీవీ ఫలితాలను వెల్లడించింది. ఏపీలో మరోసారి ఫ్యాన్‌ గిరా గిరా తిరగబోతుందని తెలిపింది. టీడీపీ – బీజేపీ – జనసేన పార్టీలు కూటమిగా పోటీ చేసిన విజయం వైసీపీనే వరిస్తుందని పేర్కొంది.

లోక్‌సభ సీట్లు 16.. అసెంబ్లీ సీట్లు 112..
పోల్‌ ఆఫ్‌ పోల్స్‌ సర్వేలో భాగంగా రానున్న లోక్‌సభ ఎన్నికల్లో అధికార వైసీపీ 16 ఎంపీ సీట్లు గెలుచుకుంటుందని తెలిపింది. కూటమి 9 స్థానాలు దక్కే అవకాశం ఉందని పేర్కొంది. అసెంబ్లీ ఎన్నికల్లోనూ దాదాపు ఇలాంటి ఫలితాలే వస్తాయని అంచనా వేసింది. యావరేజ్‌గా చూసుకుంటే… అధికార వైసీపీ 112 అసెంబ్లీ స్థానాల్లో విజయం సాధిస్తుందని తేల్చింది. టీడీపీ–బీజేపీ–జనసేన కూటమి 63 సీట్లు మాత్రమే వస్తాయని తెలిపింది.

మళ్లీ అధికారంపై వైసీపీ ధీమా..
ఇదిలా ఉంటే మరోసారి అధికారంలోకి వస్తామని వైసీపీ నేతలు ధీమాగా చెబుతున్నారు. కరోనా సమయంలోనూ సంక్షేమం ఆపకపోడం, ప్రజలకు వైద్యం మెరుగు పర్చడం, గతంలో ఎన్నడూ లేనివిధంగా 4 ఓడరేవులు, 6 షిప్‌ ల్యాండింగ్‌ సెంటర్లు, 10 షిపిగ్‌ హార్బర్లు, 3 ఇండస్ట్రీయల్‌ కారిడార్లు, 10 ఇండస్ట్రీయల్‌ నోడ్స్‌తో పారిశ్రామిక ప్రగతి సాధించామని చెబుతున్నారు. వీటి ఫలితంగానే మరోమారు అధికారం తమదే అని నొక్కి చెబుతున్నారు. ఈ క్రమంలోనే తాజా పోల్‌ ఆఫ్‌ పోల్స్‌ ఫలితాలు కూడా ఏపీలో మళ్లీ జగనే అనే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
Exit mobile version