Homeఆంధ్రప్రదేశ్‌TDP Rajya Sabha Seats 2026: టిడిపి రాజ్యసభ పదవులు వారికే.. చంద్రబాబు ఉక్కిరి బిక్కిరి!

TDP Rajya Sabha Seats 2026: టిడిపి రాజ్యసభ పదవులు వారికే.. చంద్రబాబు ఉక్కిరి బిక్కిరి!

TDP Rajya Sabha Seats 2026: తెలుగుదేశం పార్టీలో రాజ్యసభ పదవులకు విపరీతమైన పోటీ ఉంది. రకరకాల పేర్లు తెరపైకి వస్తున్నాయి.. ఆశావాహులు పెద్ద ఎత్తున చంద్రబాబును కలుస్తున్నారు. తమకు అవకాశం కల్పించాలని కోరుతున్నారు. అయితే చంద్రబాబు చివరి నిమిషం వరకు తేల్చే మనిషి కాదు. అన్ని రకాల సామాజిక సమీకరణలను పరిగణలోకి తీసుకుని నిర్ణయం తీసుకుంటారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ నుంచి అవకాశం ఎవరికీ అనేది చంద్రబాబుతో పాటు లోకేష్ కు మాత్రమే తెలుస్తుంది. కానీ అది బయటపడదు కూడా. చివరివరకు గోప్యత ప్రదర్శించి.. అన్ని రకాల సమీకరణలను పరిగణలోకి తీసుకొని.. పార్టీకి ప్రయోజనం కలిగించే నిర్ణయాలే ఉంటాయి చంద్రబాబు నుంచి. ఇప్పుడు కూడా రాజ్యసభ పదవుల విషయంలో చంద్రబాబు పెద్ద కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. రకరకాల సమీకరణలను పరిగణలోకి తీసుకుంటున్నారు. జూన్ 8 నాటికి ఒక నిర్ణయానికి రానున్నారు.

– సామాజిక వర్గాలకు ప్రాధాన్యం..
చంద్రబాబు సామాజిక వర్గాలకు ప్రాధాన్యం ఇస్తారు. ఇప్పుడు రాజ్యసభ విషయంలో సైతం సామాజిక సమీకరణలను పరిగణలోకి తీసుకుంటారు. ఒకవేళ జనసేన లింగమనేని రమేష్ కు కేటాయిస్తే కమ్మ సామాజిక వర్గానికి టిడిపి నుంచి అవకాశం లేదు. ఒకవేళ జనసేన వేరే వర్గానికి ఇస్తే మాత్రం కమ్మ సామాజిక వర్గానికి టిడిపిలో ఛాన్స్ దక్కడం ఖాయం. ప్రముఖంగా కంభంపాటి రామ్మోహన్ రావు, గల్లా జయదేవ్, దేవినేని ఉమామహేశ్వరరావు లాంటి వారు ఆ సామాజిక వర్గం నుంచి ఆశావహులుగా ఉన్నారు. మరోవైపు బీసీలకు ఇవ్వాలనుకుంటే యనమల రామకృష్ణుడు ముందు వరుసలో ఉంటారు. లేకుంటే స్పీకర్ అయిన పాత్రుడు కుమారుడు విజయ్ పేరును పరిగణలోకి తీసుకునే అవకాశం ఉంది.

* సతీష్ కు మరో ఛాన్స్..
అయితే టిడిపి నుంచి పదవి విరమణ చేస్తున్న సానా సతీష్ కు మరోసారి ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉంది. ఆయన లోకేష్ కు అత్యంత సన్నిహితుడు. పైగా కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. అందుకే ఈసారి అతనికి కొనసాగింపు ఉంటుంది. మిగతా రెండు పదవులు మిగిలితే.. అందులో బీసీలకు కానీ.. కమ్మ సామాజిక వర్గం వారికి కానీ కేటాయించే ఛాన్స్ కనిపిస్తోంది. అయితే మిగిలిన ఒక్కగా నొక్క రాజ్యసభ పదవి ఈసారి బీసీ మహిళకు కేటాయించే ఛాన్స్ కనిపిస్తోంది. మొన్ననే మహానాడులో మహిళలకు ప్రాధాన్యం కల్పిస్తామని కీలక ప్రకటన చేశారు. పైగా వచ్చే ఎన్నికల్లో పార్లమెంట్ బిల్లుతో సంబంధం లేకుండా 33 శాతం మంది మహిళల కి టికెట్లు ఇస్తామని నారా లోకేష్ ప్రకటన చేశారు. అందుకే ఈసారి బీసీ మహిళకు రాజ్యసభ సీటు ఇస్తారని తెలుస్తోంది. చూడాలి మరి ఏం జరుగుతుందో..

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version