Sakshi Media Court Case: ఏబీఎన్ ఆంధ్రజ్యోతి పై యుద్ధం ప్రకటించింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. కానీ ఇప్పుడు సాక్షి కి ( Sakshi media) షాక్ తగిలింది. తనకు అస్సలు సొంత ఫోన్ లేదు.. సొంత మీడియా లేదని చెబుతుంటారు జగన్ మోహన్ రెడ్డి. కానీ ఆయన అక్రమాస్తుల కేసుల్లో జగతి పబ్లికేషన్స్ సైతం కీలక భాగస్వామి. క్విడ్ ప్రో తో జగతి పబ్లికేషన్స్ లోకి భారీగా పెట్టుబడులు వచ్చాయంటూ అప్పట్లో అభియోగాలు మోపబడ్డాయి. అయితే జగతి పబ్లికేషన్స్ విషయంలో కోర్టు విధించిన ఆంక్షలు తొలగించాలని కోరుతూ దాఖలైన పిటీషన్ విషయంలో హైకోర్టు షాక్ ఇచ్చింది. ప్రతికూల ఆదేశాలు ఇచ్చింది.
* బ్యాంకు అకౌంట్లు ఫ్రీజ్..
దశాబ్ద కాలంగా జగన్మోహన్ రెడ్డి( Y S Jagan Mohan Reddy ) అక్రమాస్తుల కేసులు కొనసాగుతూ వచ్చాయి. అప్పట్లో విదేశీ పెట్టుబడులు, క్విడ్ ప్రోకో వ్యవహారాలపై సిబిఐ, ఇది లోతైన దర్యాప్తు చేశాయి. అప్పట్లోనే జగతి పబ్లికేషన్స్ బ్యాంక్ అకౌంట్ లను ఫ్రిజ్ చేశారు. అయితే సంస్థ అత్యవసర నిర్వహణకు సంబంధించి కొన్ని బ్యాంక్ అకౌంట్లకు మాత్రం అనుమతి ఇచ్చారు. అయితే అవి సరిపోవడం లేదని.. ఫ్రీజ్ చేసిన ఖాతాలను తమకు అప్పగించాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది సాక్షి. కేవలం ఆ ఖాతాలతో విదేశాలకు నిధులు తరలించుకోవాలని చూస్తున్నారన్న విమర్శలు బలంగా ఉన్నాయి.
* దశాబ్దాలుగా కేసు..
పుష్కర కాలంగా జగన్ అక్రమాస్తుల కేసులు విషయంలో అడుగు ముందుకు పడటం లేదు. అసలు కేసులో ట్రయల్ ప్రారంభం కాకుండా వాయిదాల మీద వాయిదాలు కోరడం, రకరకాల పిటిషన్లతో కాలయాపన చేయడం ద్వారా ప్రధాన నిందితులు గడువు పొందే ప్రయత్నం చేస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. ఇప్పటికే జప్తు చేసిన ఆస్తులు నేరపూరిత సంపాదనగా నిర్ధారించిన తరుణంలో.. నిందితులు కోర్టు ప్రక్రియను అపహాస్యం చేసేలా వ్యవహరిస్తున్నారన్న అభిప్రాయం వినిపిస్తోంది. నిందితులు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్లు, డిస్చార్జ్ పిటిషన్లను త్వరలోనే పరిష్కారం అయ్యే అవకాశాలు ఉన్నాయి. అయితే ఈ పరిస్థితులన్నీ చూస్తుంటే మాత్రం జగన్ అక్రమాస్తుల కేసులో ప్రధాన ట్రయల్ ప్రారంభించేందుకు సిబిఐ ప్రత్యేక కోర్టు సన్నాహాలు ప్రారంభించినట్లు కనిపిస్తోంది. చూడాలి మరి ఏం జరుగుతుందో.