Homeఆంధ్రప్రదేశ్‌Vizag investment: కోయంబత్తూర్ కు కాకుండా విశాఖకు.. తమిళ తంబీల బాధ అదే!

Vizag investment: కోయంబత్తూర్ కు కాకుండా విశాఖకు.. తమిళ తంబీల బాధ అదే!

Vizag investment: దావోస్ లో( davos ) ప్రపంచ పెట్టుబడుల సదస్సు జరుగుతోంది. ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల నుంచి ప్రతినిధులు హాజరయ్యారు. పరిశ్రమలతో పాటు సంస్థల ప్రతినిధులు సైతం పాల్గొన్నారు. అయితే ఈసారి ఇండియాలోని పలు రాష్ట్రాల నుంచి ముఖ్యమంత్రులతో పాటు కీలక మంత్రులు వెళ్లారు. దాదాపు పదికి పైగా పెవీలియన్లు ఏర్పాటు చేశారు. అయితే ఇవన్నీ ఒకే చోట ఉండడం విశేషం. మరోవైపు దక్షిణాది రాష్ట్రాల మధ్య పెట్టుబడుల కోసం ఆసక్తికర పోటీ నడుస్తోంది. ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల మధ్య పోటీ ఆరోగ్యకరంగా ఉంది. అయితే భారీ ఆఫర్ వచ్చింది. విశాఖలో లక్ష కోట్లతో పెట్టుబడులు పెట్టేందుకు ఆర్ఎంజెడ్ సంస్థ ముందుకు రావడం హాట్ టాపిక్ అవుతుంది. అయితే పొరుగున ఉన్న తమిళనాడు వాసులు ఈ అవకాశం చేజారిపోవడంపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అందుకు సంబంధించి ఓ ట్వీట్ వైరల్ అవుతోంది.

దిగ్గజ సంస్థ ముందుకు..
ఆంధ్రప్రదేశ్ కు( Andhra Pradesh) మరో భారీ పెట్టుబడి వచ్చింది. విశాఖలో ఆర్ఎంజెడ్ సంస్థ.. కాపులుప్పాడలో ఫేజ్ 1 ఐటీ పార్కులో జిసిసి పార్కు ఏర్పాటు చేయనుంది. ఆ సంస్థ ఎండి మనోజ్ మెండాతో మంత్రి నారా లోకేష్ చర్చలు జరిపారు. రాబోయే పదేళ్లలో దాదాపు పది మిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టనున్నట్లు ఆయన ప్రకటించారు. అయితే దక్షిణాది రాష్ట్రాలకు కాదని.. ఏపీకి పెట్టుబడులు రావడం పై.. చెన్నై అప్డేట్స్ పేరుతో ఉన్న ఓ ఎక్స్ అకౌంట్ నుంచి ఆసక్తికర ట్వీట్ చేశారు.’ బెంగళూరు, హైదరాబాద్ లు చెన్నై ను వెనక్కి నెట్టినట్టేనా? కోయంబత్తూర్ ను విశాఖపట్నం వెనక్కి నెట్టేసింది. దీనికి కారణం ఆఫీసుల కోసం అవసరమైన స్థలం దొరకక పోవడమే. విశాఖపట్నం ఆర్ఎం జెడ్, సత్వా, రహేజా వంటి పెద్ద రియల్ ఎస్టేట్ కంపెనీలను ఆకర్షించగలిగింది. కానీ మన తమిళనాడు ప్రభుత్వం చెన్నైలో కూడా ఈ కంపెనీలను తీసుకురాలేకపోయింది. మరో మంచి అవకాశం చేజారి పోతోంది’ అంటూ ఆవేదన వ్యక్తం చేస్తూ ఈ ట్వీట్ ఉంది. విశాఖకు ఆర్ఎం జెడ్ తరలి వెళ్లడం కోయంబత్తూర్ కు కోలుకోలేని దెబ్బ అని పరోక్షంగా ప్రస్తావించారు. కోయంబత్తూర్ లో ఆర్ఎం జెడ్ పెట్టుబడులు పెట్టేందుకు అవకాశాలు ఉన్నా.. ప్రభుత్వం ఆ దిశగా ప్రయత్నాలు చేయలేకపోయిందనేది వీరి వాదన.

గతంలో కర్ణాటక నుంచి..
గతంలో కర్ణాటక( Karnataka) నుంచి ఇటువంటి అభ్యంతరాలు వచ్చాయి. చాలామంది ఐటి నిపుణులు, కంపెనీల నిర్వహకులు ఇదే మాదిరిగా ట్వీట్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. గతంలో తమిళనాడు రాజధాని చెన్నైకు రావాల్సిన కంపెనీలు హైదరాబాద్, బెంగళూరుకు తరలి వెళ్లాయి. ఇప్పుడు కోయంబత్తూర్ కు రావాల్సిన కంపెనీలు విశాఖకు వెళ్ళిపోతున్నాయి అనేది తమిళనాడు వాసుల ఆవేదన. కోయంబత్తూర్ కు రావాల్సిన కంపెనీలు విశాఖ వైపు చూస్తున్నాయని వారు చెప్పుకొస్తున్నారు. కోయంబత్తూర్ అనేది టైర్ 2 నగరం. అదే స్థాయిలో ఉంది విశాఖపట్నం. అయినా సరే విశాఖకు పరిశ్రమలు వెళ్లిపోతుండడం వెనుక అక్కడి ప్రభుత్వం చూపుతున్న చొరవ కారణమని తమిళనాడు ప్రజలు అభిప్రాయపడుతున్నారు. ఏపీ ప్రభుత్వ అనుకూల విధానాలతోనే కంపెనీలు ఏపీ వైపు మొగ్గు చూపుతున్నాయని వాదనలు వినిపిస్తున్నాయి. అయితే ఇప్పుడు ఈ ఆసక్తికర ట్వీట్ వైరల్ అవుతోంది.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Related News

Most Popular

Corona alert in AP: ఏపీలో కరోనా అలెర్ట్.. ఒక్క రోజులోనే పది!

Corona alert in AP: ఏపీలో కరోనా కేసులు పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. కొత్తరకం వేరియంట్ నమోదవుతున్న సంగతి తెలిసిందే. గడిచిన 24 గంటల వ్యవధిలో పది కేసులు నమోదు కావడం గమనార్హం....

Operation Aranya: ‘ఆపరేషన్ అరణ్య’పై పవన్ కళ్యాణ్ స్పెషల్ ఫోకస్!

Operation Aranya: ఎర్రచందనం స్మగ్లర్ల పై ప్రత్యేకంగా గురి పెట్టారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ప్రస్తుతం ఆయన అటవీ శాఖ బాధ్యతలను కూడా చూస్తున్నారు. గత కొద్దిరోజులుగా ఎర్రచందనం స్మగ్లింగ్...

VVS Laxman: టీమిండియా కు లక్కీ లక్ష్మణ్… ఆ గౌతమ్ గంభీర్ ను సాగనంపండి సార్

VVS Laxman: ముక్కు మీద కోపం లేదు. ముఖం మీద చిరునవ్వు మాత్రమే ఉంటుంది. ఫ్రస్ట్రేషన్ ఉండదు. కేవలం సానుకూల దృక్పథం మాత్రమే ఉంటుంది. ఓటమి ఎదురైతే బాధ ఉండదు.. ఎలా గెలవాలి...

Dharmendra Pradhan: ధర్మేంద్ర ప్రధానే కాదు.. మనదేశంలో ఎంతమంది మంత్రులు రాజీనామాలు చేశారో తెలుసా..

Dharmendra Pradhan: ప్రజాగ్రహం పెరిగిపోతే ఎంతటి వారైనా సరే తల వంచాల్సిందే. ముఖ్యంగా యువత గట్టిపట్టు పడితే గొప్ప గొప్ప నాయకులు సైతం వెనకడుగు వేయాల్సిందే. మనదేశంలోనే కాకుండా.. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన...

ABN Radhakrishna: ఆర్కే కొత్త పలుకు.. బొద్దింకలకు వత్తాసు పలికిన ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ

ABN Radhakrishna: ఏ ఎండకు తగ్గట్టుగా ఆ తరహా గొడుగులు పట్టే వాళ్లను అవకాశవాదులు అంటారు. దీనిని ఇంగ్లీషులో ట్రెండ్ అని పిలుస్తుంటారు గాని.. ఒక స్థిరమైన అభిప్రాయం లేకుండా.. ట్రెండును మాత్రమే...
Oktelugu Epaper
Exit mobile version