Homeఆంధ్రప్రదేశ్‌Pilli Subhash Chandra Bose: టిడిపిలోకి ఆ రాజ్యసభ సభ్యుడు!

Pilli Subhash Chandra Bose: టిడిపిలోకి ఆ రాజ్యసభ సభ్యుడు!

Pilli Subhash Chandra Bose: వైసీపీ రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్ చంద్రబోస్( pilli Subhash Chandra Bose) పార్టీ మారే ఆలోచనతో ఉన్నారా? టిడిపిలో చేరుతారా? వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెబుతారా? అందుకే సొంత పార్టీ నేతలపై ఆరోపణలు చేస్తున్నారా? త్వరలో ఆయన ఎందుకు చంద్రబాబును కలవనున్నారు? పొలిటికల్ సర్కిల్లో దీనిపైనే ఆసక్తికర చర్చ నడుస్తోంది. నిన్నటికి నిన్న ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. రామచంద్రపురం నియోజకవర్గంలో వైసిపి హయాంలో భారీ అవినీతి జరిగిందని ఆరోపించారు. గృహ నిర్మాణంలో భాగంగా కోట్లాది రూపాయలు అప్పట్లో పక్కదారి పట్టించారని ఆరోపణలు చేశారు. మరో నాలుగు నెలలు రాజ్యసభ పదవీకాలం ముగియడం, సొంత పార్టీ నేతలపై బోస్ ఆరోపణలు చేయడంతో.. ఆయన పార్టీ మారుతారని ప్రచారం మొదలైంది.

వైసీపీ హయాంలో కోల్డ్ వార్..
వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress ) పార్టీ ఏర్పాటు తర్వాత జగన్ వెంట అడుగులు వేశారు సుభాష్ చంద్రబోస్. 2014 ఎన్నికల్లో ఓటమి చవి చూశారు. 2019 ఎన్నికల్లో సుభాష్ చంద్రబోస్ విషయంలో ప్రయోగం చేశారు జగన్. ఆయన సొంత నియోజకవర్గాన్ని కాదని మండపేట టిక్కెట్ ఇచ్చారు. రామచంద్రపురం నుంచి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణను రంగంలోకి దించారు. అయితే రామచంద్రపురం నుంచి వేణుగోపాలకృష్ణ గెలిచారు. మండపేట నుంచి సుభాష్ చంద్రబోస్ ఓడిపోయారు. అయితే ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చారు జగన్ బోస్ కు. అలా ఎమ్మెల్సీగా ఉన్న బోస్ ను మంత్రిని కూడా చేశారు. అయితే ఇంతలో మండలిని రద్దు చేయాలని ఆలోచన చేశారు. ఈ క్రమంలోనే బోస్ను రాజ్యసభకు పంపించారు. ఆయన రాజీనామా చేసిన మంత్రి పదవిని చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణకు ఇచ్చారు. అయితే ఎంపీగా ఉన్న బోస్ కు, మంత్రిగా ఉన్న వేణుగోపాల కృష్ణ మధ్య విభేదాలు నడిచాయి.

మరో ఆరు నెలల్లో రిటైర్మెంట్..
రాజ్యసభ సభ్యుడిగా ఉండడంతో సుభాష్ చంద్రబోస్ కు మొన్నటి ఎన్నికల్లో పోటీ చేసేందుకు అవకాశం చిక్కలేదు. పైగా రామచంద్రపురం( Ramachandrapuram) నియోజకవర్గ బాధ్యతల విషయంలో ఆయన అసంతృప్తితో ఉన్నారు. మరో ఆరు నెలల్లో రాజ్యసభ పదవి కూడా ఖాళీ కానుంది. ఇప్పుడు ఏదో ఒక పొలిటికల్ ప్లాట్ఫారం కావాలి. అందుకే పిల్లి సుభాష్ చంద్రబోస్ ఇప్పుడు సౌండ్ చేస్తున్నారు. అధికారంలో ఉన్నప్పుడు గృహ నిర్మాణ అవినీతి ఆయనకు గుర్తుకు రాలేదు. ఇప్పుడు అదే అంశాన్ని పట్టుకొని సొంత పార్టీ నేతలపై విమర్శలు చేస్తున్నారు. సీఎం చంద్రబాబును కలుస్తానని చెబుతున్నారు. తద్వారా టిడిపిలో ఎంట్రీ కి సిద్ధమని సంకేతాలు పంపిస్తున్నారు. మరి తెలుగుదేశం పార్టీ ఈ విషయంలో ఎలా స్పందిస్తుందో చూడాలి. అటు వైసిపి నాయకత్వం సైతం ఎటువంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Related News

Most Popular

Public Movement : ప్రధానుల తల వంచిన ప్రజా ఉద్యమాలు..

Public Movement : ప్రజా ఉద్యమాలు భారత దేశానికి కొత్తకాదు. మన స్వాతంత్య్రమే ప్రజా ఉద్యమాలతో సాధించుకున్నాం. స్వతంత్ర భారతదేశంలో ప్రజా ఉద్యమాలు ప్రభుత్వాలపై గణనీయమైన ప్రభావం చూపాయి. కొన్ని సందర్భాల్లో ప్రధానులు...
Narendra Modi

Narendra Modi : నాడు రైతులు.. నేడు విద్యార్థులు.. మోదీతో వెనకడుగు వేయించిన ఉద్యమాలు!

Narendra Modi : ప్రధాని నరేంద్రమోదీ.. వరుసగా మూడోసారి ప్రధాని అయ్యారు. ఇటీవలే పండిత్‌ జవహర్‌లాల్‌ నెహ్రూ పేరిట ఉన్న రికార్డును కూడా అధిగమించారు. అత్యధిక కాలం పాలించిన ప్రధానిగా చరిత్ర సృష్టించారు....
Cockroach Janata Party youth politics

Cockroach Janata Party రాజకీయ పార్టీగా సిజెపి.. తర్వాతి అడుగు అదే..

Cockroach Janata Party ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. కొత్త విద్యా శాఖ మంత్రిగా ప్రహ్లాద్ జోషి నియమితులయ్యారు. ఇక్కడితోనే సీజేపీ ఆగిపోతుందా.. తదుపరి ఏం చేస్తుంది.. అసలు బొద్దింకల తదుపరి లక్ష్యం...

Chiranjeevi : బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిన గబ్బర్ సింగ్ నటుడికి మెగాస్టార్ చిరంజీవి భారీ విరాళం..

Chiranjeevi : ఆపదలో ఉన్నవారికి సహాయం చేయడం మెగాస్టార్ చిరంజీవి కి కొత్తేమి కాదు. ప్రతీ నెల ఎవరికో ఒకరికి ఆయన నుండి సహాయం అందుతూనే ఉంటుంది. చిరంజీవి చేసినన్ని సహాయ కార్యక్రమాలు...
CJP Protests

Student Movements in India బొద్దింకలే మొదలు కాదు.. మన దేశంలో ఎన్ని విద్యార్థి ఉద్యమాలు జరిగాయి అంటే..

Student Movements in India ఏ దేశానికైనా సరే అక్కడి యువత ప్రధాన బలం. యువత సానుకూలంగా ఉంటేనే ఆదేశం అభివృద్ధి పథంలో సాగుతూ ఉంటుంది. యువతలో అసంతృప్తి పెరిగిపోతే ఆది కాస్త...
Oktelugu Epaper