spot_img
Homeఆంధ్రప్రదేశ్‌Putta Mahesh Yadav: పుట్టా మహేష్ పై టిడిపి సంచలన నిర్ణయం!

Putta Mahesh Yadav: పుట్టా మహేష్ పై టిడిపి సంచలన నిర్ణయం!

Putta Mahesh Yadav: తెలంగాణలో నమోదైన డ్రగ్స్ కేసు పై స్పందించారు ఎంపీ పుట్టా మహేష్ యాదవ్( MP Putta Mahesh Yadav). ఈ కేసులో అరెస్ట్ అయిన ఆయన స్టేషన్ బెయిల్ పై బయటకు వచ్చారు. తనపై వచ్చిన ఆరోపణలపై స్పందించారు. సోషల్ మీడియాలో వచ్చే వార్తలను నమ్మవద్దని విజ్ఞప్తి చేశారు. ప్రజల నమ్మకాన్ని వమ్ము చేసేలా తాను నడుచుకోనని.. ఎప్పుడూ నిజమే చెప్తానంటూ ఆ వీడియోలో పేర్కొన్నారు పుట్టా మహేష్ యాదవ్. నిన్ననే ఆయన అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. అయితే ఆయనపై డ్రగ్స్ కేసు విషయంలో రాజకీయ కుట్ర కోణం ఉందన్న అనుమానాలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో అరెస్టయి బెయిల్ పై వచ్చిన ఆయన ప్రత్యేకంగా ఒక వీడియో విడుదల చేశారు. ప్రస్తుతం అది వైరల్ అవుతోంది.

Also Read: నార్త్ లో అల్లు అర్జున్ మేనియా నడుస్తుందా..? ఆ బాలీవుడ్ స్టార్ నేను నీ సినిమాలో చేస్తాను బన్నీ అని అడిగాడా..?

* రోజంతా హైడ్రామా..
నిన్న రోజంతా హైడ్రామా నడిచిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నిమిషం నిడివిగల ఓ వీడియోను విడుదల చేశారు. తాను ఎలాంటి తప్పు చేయలేదని.. మీడియాతో పాటు సోషల్ మీడియాలో( social media) వచ్చే కథనాలను నమ్మవద్దని కోరారు. “ఏలూరు ప్రజలతోపాటు ఏపీ ప్రజలకు నా నమస్కారం. నేను ఎక్కడా కూడా తప్పు చేయలేదు. మీకు అందరికీ చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. అక్కడున్న వ్యక్తులు ఎన్నో రోజుల నుంచి కలుద్దామని కోరుతున్నారు. శనివారం వీలు దొరకడంతో డిన్నర్ కోసం వెళ్లాను. ఆ డిన్నర్ లో నేను ఎలాంటి తప్పు చేయలేదు. మీ అందరికీ మరోసారి చెబుతున్న. ఏలూరు ప్రజలు నామీద పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయను. ఎప్పుడూ తప్పు చేయను. మీడియాలో, సోషల్ మీడియాలో వచ్చే కథనాలను నమ్మవద్దు. నేను ఎల్లప్పుడూ నిజమే చెప్తాను. అబద్దాలు చెప్పను. ధన్యవాదాలు” అంటూ పుట్టా మహేష్ కుమార్ యాదవ్ ఆ వీడియోలో పేర్కొన్నారు.

* షోకాజ్ నోటీసులు
మరోవైపు ఈ వ్యవహారంపై టిడిపి హై కమాండ్ ( TDP high command ) దృష్టి పెట్టింది. ఎంపీ పుట్టా మహేష్ కుమార్ యాదవ్ తీరుపై టిడిపి అధినేత చంద్రబాబు సీరియస్ అయ్యారు. దీనిపై వివరణ కోరుతూ నోటీసులు ఇవ్వాలని టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ కు ఆదేశించారు. నేతలు చేసే తప్పులతో పార్టీకి నష్టం జరగనివ్వమని ఈ సందర్భంగా చంద్రబాబు స్పష్టం చేశారు. చంద్రబాబు ఆదేశాలతో మహేష్ కుమార్ యాదవ్ కు నోటీసులు జారీ చేసింది టిడిపి నాయకత్వం.. మత్తు పదార్థాలు తీసుకున్నట్టుగా మీపై వచ్చిన ఆరోపణలను, మీడియా కథనాలను పార్టీ అధిష్టానం సీరియస్గా తీసుకుందని నోటీసుల్లో పేర్కొన్నారు. ఈ నివేదిక వచ్చేవరకు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని మహేష్ను టిడిపి హై కమాండ్ ఆదేశించింది. ఐదు రోజుల్లో లిఖితపూర్వక వివరణ ఇవ్వాలని స్పష్టం చేసింది. వివరణ ఆధారంగా తదుపరి చర్యలు ఉంటాయని షోకాజ్ నోటీసుల్లో పేర్కొంది.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Most Popular

Sujeeth Director: డైరెక్టర్ సుజిత్ ని చూసి వణికిపోతున్న పవన్ ఫ్యాన్స్.. ఇలా అయితే కష్టమే..

Sujeeth Director: డైరెక్టర్ సుజిత్ తో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి అనుబంధం మామూలుది కాదు. ఒక సాధారణ పవన్ కళ్యాణ్ వీరాభిమాని గా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన సుజిత్ ,...

Jr NTR: నిరాశలో జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్.. ఆ సినిమా రద్దు అయ్యినట్టేనా!

Jr NTR: ప్రస్తుతం మన టాలీవుడ్ లో రెబల్ స్టార్ ప్రభాస్ తర్వాత , క్రేజీ కాంబినేషన్స్ ని సెట్ చేసుకున్న హీరో ఎవరైనా ఉన్నారా అంటే , అది జూనియర్...

Chiranjeevi: చిరంజీవి విషయంలో లైట్ తీసుకున్న స్టార్ డైరెక్టర్స్…

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేయాలనే కోరిక ప్రతి ఒక్కరికి ఉంటుంది. ప్రతి దర్శకుడు ఇండస్ట్రీకి రావడానికి ముందే చిరంజీవి సినిమాలను చూసి వచ్చినవారే కాదా విశేషం.. ఇండస్ట్రీ లో సక్సెస్...

Vijay Deverakonda Vs Naveen Polishetty: విజయ్ దేవరకొండ vs నవీన్ పోలిశెట్టి… పోటీ మామూలుగా లేదుగా…

Vijay Deverakonda Vs Naveen Polishetty: సినిమా ఇండస్ట్రీలో ఉన్న హీరోల మధ్య ఎంత మంచి ఫ్రెండ్షిప్ ఉన్నప్పటికి సినిమాల విషయంలో వాళ్ళ మధ్య తీవ్రమైన పోటీ అయితే ఉంటుంది. పర్సనల్ విషయాల్లో...

Nagababu Jabardasth: ‘జబర్దస్త్’ లోకి రీ ఎంట్రీ ఇచ్చిన తర్వాత నాగబాబు ఒక్కో ఎపిసోడ్ కి తీసుకునే రెమ్యూనరేషన్...

Nagababu Jabardasth: గత 13 సంవత్సరాల నుండి ఎలాంటి విరామం లేకుండా ఈటీవీ లో దిగ్విజయంగా సాగుతున్న షో ఏదైనా ఉందా అంటే , అది 'జబర్దస్త్' మాత్రమే. ఈ బిగ్గెస్ట్...
Oktelugu Epaper
Exit mobile version