Homeఆంధ్రప్రదేశ్‌Pawan Kalyan Telangana Politics: నాకు ఆంధ్రా లోనే దిక్కులేదు.. తెలంగాణకు ముఖ్యమంత్రి అవుతానా..

Pawan Kalyan Telangana Politics: నాకు ఆంధ్రా లోనే దిక్కులేదు.. తెలంగాణకు ముఖ్యమంత్రి అవుతానా..

Pawan Kalyan Telangana Politics: రాజకీయ నాయకులకు కొన్ని విషయాలు చెప్పాలంటే ధైర్యం ఉండాలి. అలాంటి ధైర్యం రాజకీయ నాయకులు నేటి కాలంలో పెద్దగా కనిపించడం లేదు. కానీ ఈ జాబితాలో పవన్ కళ్యాణ్ మాత్రం పూర్తి విభిన్నం. ఎందుకంటే ఆయన రాజకీయ నాయకుడిగా కంటే కూడా.. సామాజిక బాధ్యత ఉన్న పౌరుడిగా కనిపిస్తుంటారు. అందువల్లే ఆయన మొహమాటం లేకుండా మాట్లాడుతుంటారు. ముక్కుసూటిగా వ్యవహరిస్తూ ఉంటారు. తాజాగా తెలంగాణలో తన ఇంట్లో జరిగిన విలేకరుల సమావేశంలో పవన్ కళ్యాణ్ చాలా ఆవేశంగా మాట్లాడారు. తెలంగాణ పునర్ నిర్మాణ సభకు కాంగ్రెస్ ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోవడం.. హైకోర్టులో కూడా సానుకూల తీర్పు రాకపోవడంతో పవన్ కళ్యాణ్ నేరుగా తన ఇంటి నుంచి విలేకరుల సమావేశంలో మాట్లాడారు.

పవన్ కళ్యాణ్ అంటేనే ఆవేశం ఉంటుంది. దాని వెనక ఆలోచన కూడా ఉంటుంది. ఈసారి ఆవేశాన్ని, ఆలోచనను ఏకకాలంలో మిలితం చేసి ఆయన మాట్లాడారు. తన మీద వస్తున్న ఆరోపణలకు.. విమర్శలకు సమర్థవంతంగా సమాధానం చెప్పారు. అంతేకాదు, తెలంగాణలో జనసేన పోటీ ఎందుకు చేయాలి.. ఎందుకు ప్రశ్నించాలి.. సమర్థవంతమైన ప్రభుత్వాన్ని ఎందుకు ఎన్నుకోవాలి అనే విషయాలు మీద పవన్ కళ్యాణ్ చాలా క్లారిటీ ఇచ్చారు. విలేకరులు అడిగిన ప్రతి ప్రశ్నకు ఆయన సావధానంగా సమాధానం చెప్పారు. అంతేకాదు నేషనల్ మీడియా కూడా కొన్ని ప్రశ్నలు అడిగితే.. వాటికి కూడా సాలిడ్ ఆన్సర్ ఇచ్చేశారు.

ముఖ్యమంత్రి ఎందుకు అవుతాను

తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ప్రవేశించడానికి కేవలం అధికారం కోసం మాత్రమే కాదని.. ప్రజల సమస్యలు పరిష్కరించడానికి జనసేన తెలంగాణలో పోటీ చేస్తుందని పవన్ కళ్యాణ్ క్లారిటీ ఇచ్చారు. కెసిఆర్ ఆంధ్రప్రదేశ్లో భారత రాష్ట్ర సమితి కార్యాలయాన్ని ఏర్పాటు చేస్తే తాము స్వాగతించామని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. “అందరూ మహారాష్ట్ర వెళ్లొచ్చు. పంజాబ్ కూడా వెళ్ళవచ్చు. కానీ జనసేన తెలంగాణలో ఎందుకు అడుగు పెట్టకూడదు.. తెలంగాణ ఏమైనా మీ అయ్యా జాగిర.. తెలంగాణ ఏమైనా నిషిద్ధ ప్రాంతమా.. తెలంగాణలో ఏం కోరుకుంటాం.. నేను ఇక్కడ ముఖ్యమంత్రి ఎందుకు అవుతాను.. నాకు ఆంధ్రాలోనే దిక్కులేదు.. ఇక్కడ నేను ముఖ్యమంత్రి ఎందుకు అవుతాను. తెలంగాణ ప్రజలను చైతన్యవంతులను చేస్తామని ఇక్కడి వారి బయపడుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో జనసేన పార్టీకి లక్ష మంది కూడా లేరు. రెండువేల మందితో సభ పెట్టుకుంటే అనుమతి ఎందుకు ఇవ్వరు అంటూ” పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు.

పవన్ కళ్యాణ్ ప్రశ్నించిన ప్రతి మాటలోనూ క్లారిటీ ఉంది.. కేవలం ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అనవసరమైన రాద్ధాంతం చేసింది.. కాంగ్రెస్ ఒక జాతీయ పార్టీ. అని రాష్ట్రాలలో ఆ పార్టీ రాజకీయాలు చేస్తోంది. అలాంటప్పుడు తెలంగాణలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అడుగుపెడితే ఆ పార్టీకి వచ్చిన ఇబ్బంది ఏంటి.. త్వరలో జరిగే జిహెచ్ఎంసి ఎన్నికల్లో జనసేన పోటీ చేస్తే తమకు ఇబ్బంది అవుతుందని కాంగ్రెస్ నేతలు భయపడుతున్నారా.. అందువల్లే ఇలా జనసేన పార్టీ సభకు అడ్డంకులు సృష్టిస్తున్నారా.. అని రాజకీయ విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు. మరోవైపు పొన్నం ప్రభాకర్.. దానం నాగేందర్.. కల్వకుంట్ల కవిత.. పాశం యాదగిరి లాంటి వారంతా కూడా విమర్శలు చేయడం ఇక్కడ విశేషం. వారందరికీ కూడా పవన్ కళ్యాణ్ చాలా స్పష్టంగా క్లారిటీ ఇచ్చారు. మొత్తానికి తెలంగాణ ఎన్నికల్లో జనసేన పోటీ చేస్తుందని పవన్ కళ్యాణ్ విలేకరుల సమావేశం వేదికగా చెప్పేశారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version