Homeఆంధ్రప్రదేశ్‌Pawan Kalyan: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ బలంపై పవన్ పంజా!

Pawan Kalyan: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ బలంపై పవన్ పంజా!

Pawan Kalyan: జనసేన పార్టీ బలోపేతం పై ఫుల్ ఫోకస్ పెట్టింది. అయితే ఈ విషయంలో వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి బలమైన కంచుకోటలపై దృష్టి పెట్టింది. గత కొంతకాలంగా టిడిపికి చిక్కని నియోజకవర్గాలను తనకు విడిచి పెట్టాలని జనసేన కోరుతోంది. ప్రధానంగా రిజర్వుడు నియోజకవర్గాలపై ఆ పార్టీ ఫోకస్ చేసినట్లు తెలుస్తోంది. అందులో భాగంగా అరకు పార్లమెంట్ స్థానం పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలని చూస్తోంది జనసేన. ఇటీవల అరకు పార్లమెంట్ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశంలో ఇదే అంశం చర్చకు వచ్చింది.

* టిడిపికి అవకాశాలు తక్కువ..
సాధారణంగా ఎస్టీ రిజర్వుడు నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ గెలిచిన దాఖలాలు లేవు. కానీ 2024 ఎన్నికల్లో మాత్రం తెలుగుదేశం పార్టీ మెజారిటీ స్థానాల్లో గెలిచింది. అయినా సరే రెండు చోట్ల వైసిపి తన ఆధిపత్యాన్ని కొనసాగించగలిగింది. కూటమి ప్రభంజనంలో సైతం అరకు పార్లమెంటరీ స్థానం వైసీపీ ఖాతాలో పడింది. అందుకే ఈసారి ఎలాగైనా అరకు పార్లమెంట్ స్థానంలో కూటమి అడుగు పెట్టాలని చూస్తోంది. ఆ బాధ్యతను జనసేన తీసుకున్నట్లు తెలుస్తోంది. అరకు పార్లమెంట్ సీటుతో పాటు దాని పరిధిలోని మెజారిటీ అసెంబ్లీ స్థానాలను పొత్తులో భాగంగా జనసేన తీసుకోవాలని చూస్తున్నట్లు సమాచారం.

* ఎంపీ తో పాటు ఎమ్మెల్యే సీట్లపై..
అరకు పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో అరకు, పాడేరు, రంపచోడవరం, కురుపాం, సాలూరు, పార్వతీపురం, పాలకొండ నియోజకవర్గాలు ఉన్నాయి. అరకు తో పాటు పాడేరులో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ గెలిచింది. పాలకొండ నుంచి జనసేన విజయం సాధించింది. మిగతా నాలుగు స్థానాల్లో మాత్రం తెలుగుదేశం పార్టీ గెలుపొందింది. అరకు పార్లమెంట్ స్థానం మాత్రం వైసిపి చేజిక్కించుకుంది. అయితే ఇప్పుడు అరకు పార్లమెంట్ సీట్ తో పాటు దాదాపు ఓ నాలుగు నుంచి ఐదు స్థానాలపై జనసేన గురిపెట్టినట్లు సమాచారం.

* పవన్ ప్రత్యేక ఫోకస్..
రిజర్వుడు నియోజకవర్గాలపై జనసేన గురి పెట్టడానికి అనేక రకాల కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయ్యారు. గ్రామీణాభివృద్ధి తో పాటు అటవీ, పర్యావరణ శాఖలను సైతం తీసుకున్నారు. గిరిజన ప్రాంతాల్లో అభివృద్ధి పనులపై దృష్టి పెట్టారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన ఓటు బ్యాంకుగా గిరిజనులు ఉన్నారు. వారు చాలావరకు జనసేన వైపు టర్న్ అయినట్లు ప్రచారంలో ఉంది. అందుకే ఆ స్థానాలపై జనసేన గురిపెట్టినట్లు తెలుస్తోంది.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Most Popular

loan charges : లోన్ తీసుకుంటున్నారా.. వడ్డీ రేటు మాత్రమే కాదు.. ముందుగా ఈ ఛార్జీల గురించి తెలుసుకోండి!

loan charges G అత్యవసర అవసరాలు, ఇల్లు కొనుగోలు ఇతర వ్యక్తిగత అవసరాల కోసం చాలామంది బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుంటుంటారు. అయితే లోన్ తీసుకునే సమయంలో చాలామంది...

Infertility : 35 ఏళ్ల వయసు దాటిందా… అయితే ఇలా చేయండి..

Infertility : ప్రస్తుతం చాలా మంది దంపతులు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. జీవితంలో ఏదో ఒక దశలో సుమారు ప్రతి ఆరుగురిలో ఒకరికి సంతానలేమి సమస్య...

Monsoon Cars : వర్షంతో రోడ్లు చెరువుల్లా ఉన్న పర్వాలేదు.. ఈ కార్లలో ప్రయాణం సురక్షితం.. ఎందుకంటే..

Monsoon Cars : ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో రహదారులు చెరువులను తలపిస్తుంటాయి. మోకాళ్ల లోతు నీటిలో సాధారణ హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కార్లు నడపడం...

Revanth Reddy : మల్లారెడ్డిని మళ్లీ టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి..

ఇటీవల అందెశ్రీ సంస్మరణ సభ జరిగింది. ఆ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అందెశ్రీ గురించి మాట్లాడారు. ఆయనకు జరిగిన అన్యాయం గురించి ఏ కరువు పెట్టారు....

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...
Oktelugu Epaper
Exit mobile version