Homeఆంధ్రప్రదేశ్‌PM Modi: బాబు, పవన్ లకు మోడీ షాక్

PM Modi: బాబు, పవన్ లకు మోడీ షాక్

PM Modi: చంద్రబాబు, పవన్ లకు మోడీ షాక్ ఇచ్చారా? వారు ఆశించిన స్థాయిలో మోడీ ప్రసంగించలేదా? జగన్ పై విరుచుకుపడతారని భావించారా? కానీ సున్నిత విమర్శలకే పరిమితమయ్యారా? దీంతో ఆ ఇద్దరి నేతలు అనుకున్నట్టు జరగలేదా? ఇప్పుడు ఏపీ పొలిటికల్ సర్కిల్లో ఇదే చర్చ నడుస్తోంది. మూడు పార్టీల ఉమ్మడి ఎన్నికల ప్రచార సభ నిన్న జరిగిన సంగతి తెలిసిందే. ముఖ్య అతిథిగా హాజరైన ప్రధాని మోదీ ఎన్డీఏ ను ఆశీర్వదించాలని మాత్రమే కోరారు. ఎన్డీఏ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమాన్ని, అభివృద్ధిని చెప్పే ప్రయత్నం చేశారు. జగన్ సర్కార్ పై రెండు విమర్శలకే పరిమితం అయ్యారు. దీంతో చంద్రబాబుతో పాటు పవన్ డీలా పడినట్లు తెలుస్తోంది.

ప్రధాని ఏ రాష్ట్రానికి ఎన్నికల ప్రచార సభలకు వెళ్లినా.. అక్కడ ప్రత్యర్థులుగా ఉండే ముఖ్యమంత్రులపై తీవ్ర స్థాయిలో కామెంట్స్ చేయడం జరుగుతూ వస్తోంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రివాల్, తమిళనాడు సీఎం స్టాలిన్, కేరళ సీఎం పినరాయి విజయన్ వంటి వారిపై ప్రధాని మోదీ తీవ్రస్థాయిలో విరుచుకుపడతారు. వారి వైఫల్యాలను ఎండగడతారు. గంట ప్రసంగం చేస్తే అరగంట వారికే కేటాయిస్తారు. కానీ నిన్నటి సభలో ఆ స్థాయిలో జగన్ పై విమర్శలు చేయలేదు. కేవలం మంత్రులు అవినీతిలో పోటీ పడుతున్నారని మాత్రమే వ్యాఖ్యానించారు. కాంగ్రెస్, వైసిపి వేర్వేరు కాదని.. ఆ రెండు పార్టీలు ఒకటేనని ఆరోపించారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చడానికే కాంగ్రెస్ పార్టీ ప్రయత్నాలు చేస్తోందన్న విమర్శకు పరిమితమయ్యారు. రాష్ట్రానికి 10 లక్షలు ఇళ్లు ఇచ్చినట్లు చెప్పుకొచ్చారు. అంతకుమించి జగన్ సర్కార్ పై ప్రతికూల వ్యాఖ్యలు ఏమీ చేయలేదు.

వాస్తవానికి చంద్రబాబుతో పాటు పవన్ చాలా రకాలుగా ఊహించారు. ప్రధాని మోదీ జగన్ ను టార్గెట్ చేసుకుంటారని భావించారు. జగన్ అవినీతి, కేసుల విషయమై ప్రస్తావిస్తారని అంచనా వేశారు. కానీ ఆ ఇద్దరు నాయకులు ఊహించినట్టుగా జరగలేదు. మరోవైపు ఎన్డీఏ అంటూ సంబోధించారే తప్ప.. చంద్రబాబు గురించి కానీ.. పవన్ గురించి గానీ ప్రత్యేకంగా ప్రస్తావించలేదు. పైగా డబుల్ ఇంజన్ ప్రభుత్వం రావాలని మోడీ ఆకాంక్షించడం.. దాని వెనుక అర్థం ఏమై ఉంటుందా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. చివరిసారిగా 2014 ఎన్నికలకు ముందు జగన్ పై ప్రధాని మోదీ వ్యక్తిగతంగా కామెంట్స్ చేశారు. అప్పటికి ఆయన ప్రధాని కాలేదు. గత ఎన్నికలకు ముందు ఎన్డీఏ నుంచి టిడిపి బయటకు వెళ్ళింది. దీంతో అప్పట్లో చంద్రబాబును ప్రధాని మోదీ టార్గెట్ చేసుకున్నారు. లోకేష్ విషయమై సంబోధిస్తూ సన్ రైజ్ లో ఏపీ వెలిగిపోతుందంటూ హాట్ కామెంట్స్ చేశారు. పోలవరం ప్రాజెక్టు చంద్రబాబుకు ఏటీఎం గా మారిందని వ్యాఖ్యానించారు. అప్పట్లో ఇవి ప్రజల్లోకి బలంగా వెళ్లాయి. ఈసారి ప్రధాని నుంచి ఆ స్థాయి కామెంట్స్ ను చంద్రబాబుతో పాటు పవన్ ఆశించారు. కానీ ప్రధాని పరిమిత వ్యాఖ్యలు చేయడం వారిలో నిరాశ అలుముకుంది.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Exit mobile version