Homeఆంధ్రప్రదేశ్‌YSRCP Coterie Corruption Allegations: కోటరీ దోపిడి.. జగన్ షాక్!

YSRCP Coterie Corruption Allegations: కోటరీ దోపిడి.. జగన్ షాక్!

YSRCP Coterie Corruption Allegations: వైఎస్ఆర్ కాంగ్రెస్ హయాంలో జగన్మోహన్ రెడ్డి చుట్టూ ఒక కోటరీ ఉండేది. జగన్ సైతం వారినే నమ్మేవారు. వారు కూడా ఆర్థికంగా బలపడ్డారు. అయితే ఇప్పుడు అలా చుట్టూ ఉన్న నేతల అవినీతి బయటపడుతోంది. తనకు తెలియకుండా ఇంత అవినీతి చేశారా అన్నట్టు.. ఒక్కో లెక్క బయటకు వస్తోంది.. దీంతో ప్యాలెస్ లోపల తీవ్ర అప నమ్మకం, నిశ్శబ్దం కనిపిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. తన పేరుతో దోపిడీ చేసి.. తనకు మాత్రం సగం కూడా ఇవ్వలేదని అంతిమ లబ్ధిదారుడు బాధపడుతున్నారట. కేవలం ఒకరు ఎంత పోగేసుకున్నారో.. ప్రత్యేక దర్యాప్తు బృందం లెక్కలు చెప్పడంతో తాడేపల్లి కోటరిలో ప్రకంపనలు రేగినట్లు తెలుస్తోంది . ఒకప్పుడు జగన్ చుట్టూ ఉంటూ.. పార్టీతో పాటు ప్రభుత్వ నిర్ణయాలను శాసించిన ఈ కోటరి పూర్తిగా చెల్లాచెదురయ్యింది. అయితే ఈ కోటరిలో క్రియాశీలక పాత్ర పోషించిన విజయసాయిరెడ్డి ముందుగానే బయటకు వెళ్లిపోయారు. అలా అనేదానికంటే జగన్మోహన్ రెడ్డి ఆయనను పక్కన పడేశారు.

* సాయి రెడ్డి స్థానంలో చెవిరెడ్డి..
అధికారం కోల్పోయిన తర్వాత విజయసాయిరెడ్డి విషయంలో జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు అప్పట్లో వైరల్ అయ్యాయి. సాయి అన్నకు వయసు అయిపోయింది అంటూ తేల్చి చెప్పి ఆస్థానంలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని తెచ్చి పెట్టారు. అయితే చెవిరెడ్డి సైతం జగన్మోహన్ రెడ్డితో ఉన్న సాన్నిహిత్యంతో వందల కోట్లు వెనుకేసుకున్నారన్న ఆరోపణలు వచ్చాయి. మద్యం కుంభకోణం దర్యాప్తు తర్వాత చెవిరెడ్డి సంపాదన బయటకు రావడంతో జగన్మోహన్ రెడ్డి సైతం ఆశ్చర్యపోయారట. అందుకే ఇటీవల చెవిరెడ్డి విషయంలో కూడా జగన్మోహన్ రెడ్డి అనుమానిస్తున్నారట. అనవసరంగా చెవిరెడ్డిని తీసుకొచ్చి విజయసాయిరెడ్డిని వదులుకున్నానని బాధపడుతున్నారట జగన్మోహన్ రెడ్డి.

* మాజీ పిఏ సంపాదన చూశాక..
జగన్ కోటరీలో ఎలానూ పిఎ నాగేశ్వర్ రెడ్డి ఉంటారు. అయితే ఆయన సంపాదన ఇప్పుడు బయటపడడంతో జగన్మోహన్ రెడ్డి నోట మాట రావడం లేదు. అధికారంలో ఉన్నప్పుడు పార్టీ ఫండ్స్, ప్రభుత్వ కాంట్రాక్టులు, బదిలీల వ్యవహారాల్లో అసలు కంటే ఆయన తిన్న కొసరు వందల కోట్లు ఎక్కువగా ఉందని ఆధారాలతో సహా తేలడంతో తాడేపల్లి ప్యాలెస్ వర్గాలు ఆశ్చర్యపడుతూ చూస్తున్నాయి. జగన్మోహన్ రెడ్డిని అడ్డం పెట్టుకుని ఆయనకు తెలియకుండానే ఈ కోటరీ నేతలు సమాంతర సామ్రాజ్యాలను నడిపించారని స్పష్టంగా తెలుస్తోంది. అయితే ఇది సహజంగానే సజ్జల రామకృష్ణారెడ్డి శిబిరానికి ఉత్సాహం ఇచ్చే విషయం. ఎందుకంటే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పోటీగా వచ్చారు. ఇప్పుడు అదే చెవిరెడ్డి పై అనుమానం వ్యక్తం చేస్తున్నారు జగన్ మోహన్ రెడ్డి. ఇదంతా మద్యం కుంభకోణం ద్వారానే జరగడంతో ఖుషి గా ఉంది సజ్జల వర్గం. అయితే మొత్తం సజ్జల సేఫ్ గా ఉంటే.. తనకు తెలియకుండానే ఇంత దోపిడీ రాజ్యం నడిసిందా? అని ఆశ్చర్యపోతున్నారట జగన్మోహన్ రెడ్డి. మరి ఈ ప్రచారంలో నిజం ఎంత ఉందో తెలియాలి.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Related News

Most Popular

loan charges : లోన్ తీసుకుంటున్నారా.. వడ్డీ రేటు మాత్రమే కాదు.. ముందుగా ఈ ఛార్జీల గురించి తెలుసుకోండి!

loan charges G అత్యవసర అవసరాలు, ఇల్లు కొనుగోలు ఇతర వ్యక్తిగత అవసరాల కోసం చాలామంది బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుంటుంటారు. అయితే లోన్ తీసుకునే సమయంలో చాలామంది...

Infertility : 35 ఏళ్ల వయసు దాటిందా… అయితే ఇలా చేయండి..

Infertility : ప్రస్తుతం చాలా మంది దంపతులు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. జీవితంలో ఏదో ఒక దశలో సుమారు ప్రతి ఆరుగురిలో ఒకరికి సంతానలేమి సమస్య...

Monsoon Cars : వర్షంతో రోడ్లు చెరువుల్లా ఉన్న పర్వాలేదు.. ఈ కార్లలో ప్రయాణం సురక్షితం.. ఎందుకంటే..

Monsoon Cars : ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో రహదారులు చెరువులను తలపిస్తుంటాయి. మోకాళ్ల లోతు నీటిలో సాధారణ హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కార్లు నడపడం...

Revanth Reddy : మల్లారెడ్డిని మళ్లీ టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి..

ఇటీవల అందెశ్రీ సంస్మరణ సభ జరిగింది. ఆ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అందెశ్రీ గురించి మాట్లాడారు. ఆయనకు జరిగిన అన్యాయం గురించి ఏ కరువు పెట్టారు....

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...
Oktelugu Epaper
Exit mobile version