spot_img
Homeఆంధ్రప్రదేశ్‌YS Jagan Mohan Reddy :  జగన్ దేవుడినే నమ్ముకుంటే కష్టం!

YS Jagan Mohan Reddy :  జగన్ దేవుడినే నమ్ముకుంటే కష్టం!

YS Jagan Mohan Reddy : రాజకీయాన్ని రాజకీయంలో చేయాలి. రాజకీయాన్ని వ్యాపారంలా చేస్తే దుష్పరిణామాలు అధికం.ఇప్పుడు జగన్ విషయంలోఅదే జరుగుతోంది. జగన్ ను తప్పుడు మనిషిగా చిత్రీకరించడంలో అప్పట్లో ఉన్న ప్రతిపక్షం సక్సెస్ అయ్యింది. ఇప్పుడు అదే జగన్ ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత కూడా అదే తరహా ప్రచారం జరుగుతోంది.అప్పుడు బాధితుడు ఆయనే. ఇప్పుడు కూడా బాధితుడు ఆయనే.ప్రకాశం బ్యారేజీకి పడవలతో ఢీ కొట్టించింది వైసిపినే . ముంబై నటిని వేధించింది వైసిపినే. ఇప్పుడు తిరుపతి లడ్డూలో జంతు కొవ్వు కలిపింది వైసిపి నే. ఇలా వరుస విమర్శలు వస్తున్నా.. జగన్ మాత్రం తిప్పి కొట్టడం లేదు.ప్రజల్లోకి వచ్చి తన వాయిస్ ను వినిపించడం లేదు.కనీసం ఆధారాలు చూపించమని అడగడం లేదు. ఇప్పటికీ అదే డైలాగులు వాడుతున్నారు.అంతా దేవుడు చూసుకుంటాడుఅన్నట్టు మాట్లాడుతున్నారు.అయితే జగన్లో ఎటువంటి మార్పు రాకపోవడంతో వైసీపీ నేతలు తమ దారి తాము చూసుకుంటున్నారు.

* అప్పట్లో లెక్క చేయలేదు
జగన్ అధికారంలో ఉన్నప్పుడు ఏం చేసినా జరిగిపోయేది. అప్పట్లో ప్రతిపక్షాలను లెక్కచేయలేదు. ప్రజలకు అన్నీ చేస్తున్నాను.. అన్నీ ఇస్తున్నాను అంటూ చెప్పుకొచ్చారు.ప్రతిపక్షాల విమర్శలను పరిగణలోకి తీసుకోలేదు. తమకంటూ ఒక ప్రత్యేకమైన ఓటర్లు ఉన్నారని భావించారు. సంక్షేమ పథకాలు తీసుకున్న వారు తమను మరోసారి అధికారంలోకి తీసుకొస్తారని భ్రమించారు. అయితే నాడు ప్రతిపక్షాలు జగన్ పై చేసిన ప్రచారం ప్రజల్లోకి బలంగా వెళ్ళింది. వైసీపీకి దారుణ పరాజయానికి కారణమైంది.

* ప్రతిపక్షంలోకి వచ్చినా ప్రశ్నించరే!
అయితే ప్రతిపక్షంలోకి వస్తేప్రశ్నించే తత్వం వస్తుందని అంతా భావిస్తారు.కానీ ఇప్పుడు కూడా వైసీపీయే అధికారపక్షానికి టార్గెట్ అవుతుండడం విశేషం. ఏపీలో జరిగే ప్రతి ఘటన వెనుక వైసీపీ హస్తం ఉందని అధికార పక్షం ఆరోపిస్తోంది. అది ప్రజల్లోకి బలంగా వెళుతుంది. దీనిని తిప్పి కొట్టాల్సిన జగన్ నోరు మెదపడం లేదు. గట్టిగా కౌంటర్ ఇవ్వడం లేదు. సాక్షిలో ఫ్యాక్ట్ చెక్ పేరిట ఒక కథనంతో సరిపెడతారు. ఎవరో తెలియని వైసిపి అధికార ప్రతినిధితో మాట్లాడించి మమ అనిపించేస్తారు. అంతకుమించి ఖండన ఉండడం లేదు. రోడ్డు మీదకు వచ్చి పోరాటం చేయడం లేదు. మీరు చెబుతున్నది తప్పు అని చెప్పడం లేదు. దీంతో జగన్ అనే వ్యక్తి మంచివాడు కాదు అని ప్రచారం చేయడంలో ప్రత్యర్ధులు సక్సెస్ అవుతున్నారు.

* అదే నిస్సహాయత
అప్పుడు, ఇప్పుడు జగన్ దేవుడిని నమ్ముకుని ఉన్నట్టు ఉన్నారు. అందుకే తన నిస్సహాయతను దేవుడిపై పెడుతున్నారు. అంతా దేవుడే చూసుకుంటాడులే అని భావిస్తున్నారు. ఇది పార్టీ శ్రేణులకు మింగుడు పడడం లేదు. జగన్ తీరు నచ్చక, పార్టీకి భవిష్యత్తు ఉంటుందని నమ్మకం లేక చాలామంది నేతలు పార్టీని వీడుతున్నారు. అందులో జగన్ కు అత్యంత సన్నిహితులు కూడా ఉన్నారు. కుటుంబ శ్రేయోభిలాషులు ఉన్నారు. గత ఐదేళ్లుగా వైసీపీతో బాగుపడిన వారు ఉన్నారు. మొత్తానికైతే జగన్ రోడ్డు మీదకు వచ్చి పోరాటం చేయకుంటే మాత్రం.. ఆ పార్టీ ఉనికి ప్రశ్నార్థకం. ఈ విషయం జగన్ గుర్తించకపోతే ఆయనకే నష్టం.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Related News

Most Popular

Azim Premji : జీవితానికి సంబధించి అజీమ్ ప్రేమ్ జీ చెప్పిన 5 సూత్రాలివే..

Azim Premji : భారతదేశ ప్రముఖ పారిశ్రామికవేత్త అజీమ్ ప్రేమ్‌జీ వ్యాపార రంగంలో ఎన్నో విజయాలు సాధించారు. ఆయన ధనవంతుడైనప్పటికీ సాదాసీదా జీవనశైలి, క్రమశిక్షణకు ఎంతో ప్రాధాన్యత ఇస్తారు. యువతకు, వ్యాపారవేత్తలకు స్ఫూర్తినిచ్చేలా...

Yasho Sagar : రాత్రికి రాత్రే స్టార్‌డమ్.. ‘ఉల్లాసంగా ఉత్సాహంగా’ హీరో విషాదాంతం.. ఇప్పటికీ మిస్టరీయేనా?

Yasho Sagar : ఒక హీరో కి అయినా , హీరోయిన్ కి అయినా కేవలం ఒకటి రెండు సినిమాలతో కలలో కూడా ఊహించని గుర్తింపు దక్కడం అనేది ఒక అదృష్టం. పదుల...
Jana Nayagan OTT release

Jana Nayagan collections : 2వ రోజు దారుణంగా పడిపోయిన ‘జన నాయగన్ ‘ వసూళ్లు.. ఎంత గ్రాస్...

Jana Nayagan collections : తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ నటించిన లేటెస్ట్ చిత్రం 'జన నాయగన్ ' నిన్న ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదలైంది. 'భగవంత్' కేసరి కి రీమేక్ గా...
Infosys : ఇన్ఫోసిస్‌లో కొత్త 20 వేల ఉద్యోగాలు... వారికి మాత్రమే ఛాన్స్‌..

Infosys : ఏఐ విజృంభిస్తున్న వేళ.. ఇన్ఫోసిస్ కీలక నిర్ణయం.. ఇకపై జరిగేది అదే

Infosys : టెక్నాలజీలో రోజురోజుకు కొత్త కొత్త మార్పులు వస్తున్నాయి. నిన్న ఉన్న టెక్నాలజీ నేటికీ పాతగా మారిపోతుంది. నేడు ఉన్న టెక్నాలజీ రేపటికి మరుగున పడిపోతోంది. అందువల్లే టెక్నాలజీ యుగంలో ఎప్పుడు...

Jantar Mantar : జంతర్ మంతర్ వద్ద రామనామం.. ఇది అసలు ఊహించలేదుగా..

Jantar Mantar : సాధారణంగా రాముడి నామం మీద పేటెంట్ రైట్స్ మొత్తం బిజెపికి ఉంటాయి. ఎందుకంటే ఆ పార్టీ రాముడి నామం జపించడంలో ఏమాత్రం వెనుకాడదు. పైగా ఆ పార్టీకి సెక్యులర్...
Oktelugu Epaper